Sangareddy: తండ్రికి సూసైడ్‌ నోట్‌ పంపి.. ప్రభుత్వ వైద్యుడి అదృశ్యం

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న  చిన్నపిల్లల వైద్యుడు గోకుల్‌నాథ్‌(27) అదృశ్యమైన ఘటన ఆదివారం సంగారెడ్డిలో చోటుచేసుకుంది.

Updated : 07 Aug 2023 07:21 IST

సంగారెడ్డి అర్బన్‌, న్యూస్‌టుడే: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న  చిన్నపిల్లల వైద్యుడు గోకుల్‌నాథ్‌(27) అదృశ్యమైన ఘటన ఆదివారం సంగారెడ్డిలో చోటుచేసుకుంది. గ్రామీణ ఎస్సై రాజేశ్‌నాయక్‌ తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడుకు చెందిన గోకుల్‌నాథ్‌ 6 నెలల క్రితం సంగారెడ్డి జిల్లాఆసుపత్రిలో పీజీ కోర్సులో భాగంగా విధుల్లో చేరారు. శనివారం రాత్రి 8:30 గంటలకు డ్యూటీకి వెళుతున్నానంటూ వసతిగృహంలో చెప్పి బయల్దేరారు. ఆదివారం తెల్లవారుజామున తండ్రి మురుగన్‌కు సూసైడ్‌ నోట్‌ను వాట్సప్‌ చేశారు. చెల్లి పెళ్లికి చేసిన అప్పు రూ.4లక్షల వరకు ఉందని, మానసిక ఒత్తిడికి గురవుతున్నానంటూ అందులో పేర్కొన్నారు. ఈ లేఖ చదివిన తండ్రి మురుగన్‌ ఆందోళన చెంది, వెంటనే సంగారెడ్డికి చేరుకున్నారు. అదృశ్యమైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆసుపత్రి పరిసరాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. మహారాష్ట్రలోని ఉమర్గ ప్రాంతంలో గోకుల్‌నాథ్‌ ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ అయినట్టు ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని