CISF constable: దిల్లీలో చీపురుపల్లి కానిస్టేబుల్‌ ఆత్మహత్య

దిల్లీలో విజయనగరం జిల్లాకు చెందిన సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు. 

Updated : 04 Oct 2023 12:05 IST

చీపురుపల్లి గ్రామీణం: దిల్లీలో విజయనగరం జిల్లాకు చెందిన సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు. చీపురుపల్లికి చెందిన దాసరి నాగేశ్వరరావు (30) తాను ఉంటున్న క్వార్టర్స్‌లోనే ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆయన మృతికి సంబంధించిన సమాచారాన్ని అక్కడి అధికారులు కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి తెలిపారు. దీంతో కుటుంబీకులు దిల్లీకి బయల్దేరి వెళ్లారు. నాగేశ్వరరావు ఆత్మహత్యకు గల కారణాలు వెల్లడికాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని