కన్నపేగుపై కాఠిన్యం
అప్పటివరకు అల్లారుముద్దుగా చూసుకున్న మగశిశువును ఆ తల్లి నీటి డ్రమ్ములో పడేసి హతమార్చింది. మానసిక స్థితి బాగోలేక మాతృత్వపు మమకారాన్ని మరిచి దారుణానికి పాల్పడిన ఉదంతం విశాఖ జిల్లా కశింకోట మండలం ఏఎస్పేట పంచాయతీ నర్సాపురంలో చోటుచేసుకుంది.
నీటిడ్రమ్ములో పడేసి హతమార్చిన తల్లి
అప్పటివరకు అల్లారుముద్దుగా చూసుకున్న మగశిశువును ఆ తల్లి నీటి డ్రమ్ములో పడేసి హతమార్చింది. మానసిక స్థితి బాగోలేక మాతృత్వపు మమకారాన్ని మరిచి దారుణానికి పాల్పడిన ఉదంతం విశాఖ జిల్లా కశింకోట మండలం ఏఎస్పేట పంచాయతీ నర్సాపురంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన యాచలపు అప్పలరాజు దంపతులకు నెలన్నర పసిబాలుడు ఉన్నాడు. శుక్రవారం రాత్రి పదింటికి తల్లి తన కుమారుడికి పాలు పట్టింది. అనంతరం ముగ్గురూ పడుకున్నారు. అర్ధరాత్రి దాటాక కొడుకు కనిపించడం లేదంటూ తల్లి హడావుడి చేసింది. సమాచారం అందుకొని వచ్చిన పోలీసులు డ్రమ్ములో శిశువు మృతదేహాన్ని గుర్తించారు. కన్నబిడ్డను నీటి డ్రమ్ములో పడేసినట్లు విచారణలో తల్లి చెప్పిందని డీఎస్పీ సునీల్ తెలిపారు. తన మానసిక స్థితి బాగోలేక ఇలా చేసినట్లు నిందితురాలు పేర్కొందని వివరించారు. తన కుమారుడిని తన భార్య చంపిందని అప్పలరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
-న్యూస్టుడే అనకాపల్లి పట్టణం, కశింకోట.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?