కన్నపేగుపై కాఠిన్యం

అప్పటివరకు అల్లారుముద్దుగా చూసుకున్న మగశిశువును ఆ తల్లి నీటి డ్రమ్ములో పడేసి హతమార్చింది. మానసిక స్థితి బాగోలేక మాతృత్వపు మమకారాన్ని మరిచి దారుణానికి పాల్పడిన ఉదంతం విశాఖ జిల్లా కశింకోట మండలం ఏఎస్‌పేట పంచాయతీ నర్సాపురంలో చోటుచేసుకుంది.

Published : 28 Nov 2021 06:46 IST

నీటిడ్రమ్ములో పడేసి హతమార్చిన తల్లి

అప్పటివరకు అల్లారుముద్దుగా చూసుకున్న మగశిశువును ఆ తల్లి నీటి డ్రమ్ములో పడేసి హతమార్చింది. మానసిక స్థితి బాగోలేక మాతృత్వపు మమకారాన్ని మరిచి దారుణానికి పాల్పడిన ఉదంతం విశాఖ జిల్లా కశింకోట మండలం ఏఎస్‌పేట పంచాయతీ నర్సాపురంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన యాచలపు అప్పలరాజు దంపతులకు నెలన్నర పసిబాలుడు ఉన్నాడు. శుక్రవారం రాత్రి పదింటికి తల్లి తన కుమారుడికి పాలు పట్టింది. అనంతరం ముగ్గురూ పడుకున్నారు. అర్ధరాత్రి దాటాక కొడుకు కనిపించడం లేదంటూ తల్లి హడావుడి చేసింది. సమాచారం అందుకొని వచ్చిన పోలీసులు డ్రమ్ములో శిశువు మృతదేహాన్ని గుర్తించారు. కన్నబిడ్డను నీటి డ్రమ్ములో పడేసినట్లు విచారణలో తల్లి చెప్పిందని డీఎస్పీ సునీల్‌ తెలిపారు. తన మానసిక స్థితి బాగోలేక ఇలా చేసినట్లు నిందితురాలు పేర్కొందని వివరించారు. తన కుమారుడిని తన భార్య చంపిందని అప్పలరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

-న్యూస్‌టుడే అనకాపల్లి పట్టణం, కశింకోట.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని