Telangana News: మృత్యువుతో పోరాడిన ఆ తల్లి కన్ను మూసింది..

కుమారుల వేధింపులను భరించలేక  ఆ తల్లి ఆత్మహత్యకు యత్నించింది. ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతూ కన్నుమూసింది. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌ మండలం జైకేసారం గ్రామానికి చెందిన బోదాసు ఆండాళు(55) స్వామి దంపతులకు

Updated : 13 Mar 2022 07:27 IST

ఆత్మహత్యకు యత్నించిన మహిళ మృతి

చౌటుప్పల్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: కుమారుల వేధింపులను భరించలేక  ఆ తల్లి ఆత్మహత్యకు యత్నించింది. ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతూ కన్నుమూసింది. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌ మండలం జైకేసారం గ్రామానికి చెందిన బోదాసు ఆండాళు(55) స్వామి దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె. పెద్దకుమారుడు నాగరాజు తాగి వచ్చి తల్లితో ఘర్షణ పడేవాడు. చిన్న కుమారుడు రవి కూడా తల్లిని సరిగ్గా చూడకపోయేవాడు. వీరిద్దరి ఆగడాలను భరించలేక ఈనెల 9న తల్లి ఆండాళు చౌటుప్పల్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కుమారులతో మాట్లాడుతుండగానే.. ఠాణా బయటే ఆండాళు నిప్పంటించుకుంది. ఆమెను హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రికి తరలించారు. తల్లిని చూసేందుకు చిన్న కుమారుడు రాలేదు. శుక్రవారం అర్ధరాత్రి ఆమె ప్రాణాలను విడిచింది. సంప్రదాయం ప్రకారం తల్లికి చిన్న కుమారుడు తల కొరివి పెట్టాల్సి ఉన్నా.. అతనితో వద్దని కుమార్తె పట్టుబట్టింది. గ్రామస్థులు నచ్చజెప్పి శనివారం స్వగ్రామంలో చిన్న కుమారుడితోనే అంత్యక్రియలు నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని