పోలీస్.. పక్కా వైకాపా
వైకాపాకు వంతపాడుతున్నారని.. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సీపీ, డీజీ స్థాయి అధికారులపై వేటు కూడా పడుతున్నా కొందరు పోలీసు అధికారులు ఇంకా జగన్ భజనే చేస్తున్నారు.
పలుచోట్ల ఒకే పేరుతో ఉన్న అభ్యర్థుల నామినేషన్లు
వైకాపా నేతల పేర్లతో ఉన్నవారిని అడ్డుకున్న పోలీసులు
గుడివాడలో ఓ దళిత యువకుడిపై ఈఆర్ఓ ఆగ్రహం
మచిలీపట్నంలో బాలశౌరిని పోలిన పేర్లతో నామినేషన్లు..
(ఈనాడు యంత్రాంగం)
వైకాపాకు వంతపాడుతున్నారని.. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సీపీ, డీజీ స్థాయి అధికారులపై వేటు కూడా పడుతున్నా కొందరు పోలీసు అధికారులు ఇంకా జగన్ భజనే చేస్తున్నారు. అక్కడక్కడా ఎన్నికల అధికారులూ వంతపాడుతున్నారు. ఎన్నికల సంఘం ఒకటుందనే భయమైన లేకపోవడం గమనార్హం. వైకాపా తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థుల పేర్లతో ఉన్నవారెవరైనా.. స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ వేసేందుకు సిద్ధమైతే చాలు దగ్గరుండి అడ్డుకున్నారు. కిడ్నాప్ డ్రామాలాడించారు. అదే తెదేపా తరఫున పోటీ చేసే అభ్యర్థుల పేర్లతో ఉన్న వారెవరైనా ఉంటే.. వైకాపా నేతల సహకారంతో దగ్గరుండి నామినేషన్ వేసేందుకు తోడ్పాటు అందించారు. గుంటూరు జిల్లా పశ్చిమ నియోజకవర్గంలో విడదల రజని అనే ఎస్సీ మహిళను నామినేషన్ వేయకుండా అడ్డుకోవడంలో.. అక్కడి సీఐ లోకనాథం, పోలీసులు కృతకృత్యులయ్యారు. మంగళగిరిలో మురుగుడు లావణ్య అనే మహిళ నామినేషన్కు సిద్ధమైతే.. వైకాపా నేతలు ఆమెను బెదిరిస్తున్నా, వాహనాల్లో తీసుకెళ్తున్నా పట్టణ సీఐ శ్రీనివాసరావు కనీసం అడ్డుకోలేదు. గుడివాడలో కొడాలి శ్రీవెంకటేశ్వరరావు అనే వ్యక్తి నామినేషన్ వేసేందుకు వస్తే.. అక్కడి ఈఆర్ఓ పద్మావతి దురుసుగా మాట్లాడి బయటకు వెళ్లాలంటూ హెచ్చరించడమే కాకుండా పోలీసుల్ని పిలిచి క్రిమినల్ కేసు పెట్టమంటూ ఆదేశించారు. ఇంత జరుగుతుంటే ఇటీవలే బాధ్యతలు తీసుకున్న గుంటూరు ఎస్పీ తుషార్ డూడీ, కృష్ణా ఎస్పీ అద్నాన్ నయీం హస్మీ ఏం చేస్తున్నారు? కొందరు పోలీసులు, ఎన్నికల అధికారులు వైకాపాతో అంటకాగుతున్నారనేందుకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?
వ్యక్తుల పేర్లు, పార్టీ పేర్లు అదే మాదిరిగా...
వైకాపా నేతలు చాలాచోట్ల జాతీయ జనసేన పార్టీ, నవరంగ్ కాంగ్రెస్, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్.. తదితర పార్టీల తరఫున కూటమి అభ్యర్థుల పేర్ల మాదిరే ఉన్న వ్యక్తులతో చివరిరోజున నామినేషన్లు దాఖలు చేయించడం గమనార్హం. మచిలీపట్నం లోక్సభకు జనసేన అభ్యర్థిగా బాలశౌరి పోటీ చేస్తున్నారు. ఆ నియోజకవర్గానికి అదే పేరున్న ఇద్దరు వేర్వేరు పార్టీల తరఫున నామినేషన్లు దాఖలు చేశారు. నవరంగ్ కాంగ్రెస్ పార్టీ నుంచి బాలశౌరమ్మ పాముల, జాతీయ జనసేన పార్టీ నుంచి బాలశౌరి సీహెచ్ పేరుతో ఈ నామినేషన్లు దాఖలయ్యాయి. ఇదొక కుట్ర అని, దీని వెనుక మాజీ మంత్రి పేర్ని నాని ఉన్నట్లు జనసేన నేతలు పేర్కొంటున్నారు.
మంగళగిరిలో లావణ్యను అడ్డుకుని..
మంగళగిరిలో మురుగుడు లావణ్య స్వతంత్ర అభ్యర్థిగా అసెంబ్లీ స్థానానికి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇదే నియోజకవర్గం నుంచి వైకాపా అభ్యర్థిగా మురుగుడు లావణ్య పోటీ చేస్తున్నారు. అదే పేరుతో మరొకరు పోటీ చేస్తే ఇబ్బంది అనే భయంతో వైకాపా నేతలు ఆమెను పోటీ నుంచి తప్పించేందుకు సిద్ధమయ్యారు. టిడ్కో గృహ సముదాయంలో ఉన్న బంధువుల ఇంట్లో ఉన్నారని తెలిసి వైకాపా నాయకులు అక్కడకు చేరుకుని గృహనిర్బంధం చేశారు. నామినేషన్ వేయొద్దని హెచ్చరించారు. సుమారు గంటపాటు ఈ తంతంగం నడిచింది. అనంతరం ఆమెను, కుటుంబ సభ్యుల్ని వాహనాల్లో ఎక్కించుకుని తీసుకెళ్లారు. వైకాపా నాయకులు లావణ్య ఇంటికి వచ్చారని తెలిసిన తెదేపా నాయకులు అక్కడకు చేరుకున్నారు. ఆ వెంటనే సీఐ శ్రీనివాసరావు, పోలీసులు అక్కడకు చేరుకుని తెదేపా నాయకులు, కార్యకర్తలను అక్కడ నుంచి బలవంతంగా పంపించారు. వైకాపా నేతలు సుమారు 60 మంది వరకు లావణ్య ఇంటి చుట్టూ ఉన్నా ఎంతమాత్రం పట్టించుకోలేదు. వాహనాల్లో వైకాపా నేతలు వచ్చి లావణ్యతోపాటు ఆమె కుటుంబ సభ్యులను తీసుకెళ్తున్నా.. దగ్గరుండి సాగనంపి విధేయత ఒలికించారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సూచనలతోనే పోలీసులు వైకాపాకు అనుకూలంగా వ్యవహరించారని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు.
భీమిలిలో గంటా శ్రీనివాసరావు పేరుతో
భీమిలి నియోజకవర్గంలోని ఆనందపురం మండలం గంటాపేటకు చెందిన గంటా శ్రీనివాసరావు అనే పేరున్న వ్యక్తి భీమిలి అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. అక్కడి నుంచి తెదేపా అభ్యర్థిగా మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు బరిలో నిలిచారు. నామినేషన్ల దాఖలు గడువు మరో మూడు నిమిషాల్లో ముగుస్తుందనగా గంటాపేటకు చెందిన శ్రీనివాసరావు జాతీయ జనసేన పార్టీ అభ్యర్థిగా నామినేషన్ సమర్పించారు. వైకాపా నేతల ప్రమేయంతోనే ఇది జరిగినట్లు చెబుతున్నారు.
ఎవరీ బత్తుల బలరామకృష్ణులు..
- తూర్పుగోదావరి జిల్లా రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గం జనసేన అభ్యర్థిగా బత్తుల బలరామకృష్ణ బరిలో ఉన్నారు. ఇదే పేరుతో జాతీయ జనసేన పార్టీ, నవరంగ్ కాంగ్రెస్, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్థులుగా 6 నామినేషన్లు దాఖలయ్యాయి.
- జనసేన అభ్యర్థి భార్య బత్తుల వెంకటలక్ష్మి ఒక నామినేషన్ దాఖలు చేయగా అదే పేరుతో మరో ఇద్దరు నామినేషన్లు వేశారు.
- కోనసీమ జిల్లా పి.గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గానికి జనసేన తరఫున గిడ్డి సత్యనారాయణ బరిలో ఉన్నారు. అదే పేరుతో మరో ఇద్దరు నామినేషన్లు దాఖలు చేశారు.
ఎన్నికల సంఘం ఏం చేస్తున్నట్లు?
అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే గుంటూరు, కృష్ణా ఎస్పీలను ఎన్నికల సంఘం బాధ్యతల నుంచి తప్పించింది. అయినా అక్కడ పరిస్థితి మారలేదు. కొందరు పోలీసులు ఇప్పటికీ వైకాపా కార్యకర్తల్లా వ్యవహరిస్తూ.. అంటకాగుతున్నారని తెదేపా నేతలు పేర్కొంటున్నారు. వీరిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటే.. అధికారుల చర్యలకు మద్దతిచ్చినట్లే అవుతుందని వారంటున్నారు.
రజిని పేరుంటే.. కుదరదంతే!
గుంటూరు ఏసుభక్తనగర్కు చెందిన విడదల రజని అనే ఎస్సీ మహిళ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గురువారం నామినేషన్ వేయటానికి సిద్ధమయ్యారు. ఈ నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థిగా మంత్రి విడదల రజిని పోటీ చేస్తున్నారు. వైకాపా నేతలు విడదల రజిని (ఏసుభక్తనగర్)ను అడ్డుకున్నారు. తన కుమార్తెను ఎవరో కిడ్నాప్ చేశారని ఆమె తండ్రితో డయల్ 100కు ఫోన్ చేయించారు. వారు సెల్ఫోన్ లొకేషన్ ద్వారా ఆమెను గుర్తించి ఇద్దరు కానిస్టేబుళ్లు, ఎస్సై వెళ్లి తమవెంట రావాలని ఆదేశించారు. బలవంతంగా నగరంపాలెం పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి తండ్రికి అప్పగించారు. అప్పటికే అక్కడున్న వైకాపా నేతలు ఆమెను కారులో ఎక్కించుకుని తీసుకుపోయి నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారు. భర్త అనురాగరావు వచ్చి ఆమె ఎక్కడుందో చూపాలని నిలదీయడంతో తండ్రికి అప్పగించామని చెప్పారు. సాయంత్రం వరకు ఆయనను పోలీస్స్టేషన్ లోపలే నిర్బంధించి నామినేషన్ల దాఖలు సమయం ముగిశాక వదిలిపెట్టారు. పోలీసు స్టేషన్ ఆవరణలోనే వైకాపా నేతలు రజనితో ఉపసంహరణ పత్రాలపై సంతకం పెట్టించినట్లు చెబుతున్నారు. అంటే ఈ అరాచకమంతటికీ ప్రత్యక్ష సాక్షులు పోలీసులే. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని బాధితురాలే చెబుతున్నా పట్టించుకోలేదంటే.. ఖాకీ దుస్తులేసుకున్న ఈ వీరభక్త వైకాపా కార్యకర్తలు ఎంత ఏకపక్షంగా వ్యవహరించారో అర్థమవుతుంది.
గుడివాడలో.. దళిత యువకుడికి అవమానం
కొడాలి వెంకటేశ్వరరావు అనే పేరున్న దళిత దివ్యాంగ యువకుడు నామినేషన్ వేసేందుకు వస్తే.. గుడివాడ ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఈఆర్ఓ) పద్మావతికి ఆగ్రహం వచ్చింది. కుచ్చికాయలపూడి గ్రామానికి చెందిన కొడాలి వెంకటేశ్వరరావు నామినేషన్ వేయడానికి వచ్చారు. అక్కడున్న ఈఆర్వో, ఆర్డీవో పద్మావతి.. నామినేషన్ తీసుకోవడానికి నిరాకరించారు. తక్షణమే బయటకు వెళ్లాలని అవమానకరంగా మాట్లాడారు. వెంకటేశ్వరరావుపై క్రిమినల్ కేసు నమోదు చేయమంటూ అక్కడే ఉన్న పోలీసులను ఆదేశించారు. ఇదెక్కడి అన్యాయమంటూ ఆయన ఈఆర్వో కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. దీంతో పోలీసులు వచ్చి.. ఇక్కడ వాగ్వాదానికి దిగితే.. క్రిమినల్ కేసు నమోదు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. న్యాయవాదులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. నామినేషన్ వేయకుండా వెంకటేశ్వరరావును ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ పోలీసులు వారిని కూడా హెచ్చరించారు. నామినేషన్ వేసే హక్కును హరించడానికి మీరెవరంటూ అందరూ కలిసి వాగ్వాదానికి దిగడంతో.. చివరికి అనుమతించారు. ‘నా పేరు కొడాలి వెంకటేశ్వరరావు కావడమే నా తప్పా? నేను పోటీ చేయడానికి అర్హుణ్ని కాదా? నాకు ఏదైనా ముప్పు జరిగితే అధికారులదే బాధ్యత’ అని వెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు.
కూటమి ఓట్లు చీల్చేందుకు వైకాపా కుట్ర
ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థిగా తంగిరాల సౌమ్య పోటీ చేస్తుండగా, అదే పేరున్న విజయవాడకు చెందిన తంగిరాల సౌమ్యతో వైకాపా నేతలు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయించారు. ఓట్లను చీల్చేందుకు వైకాపా నాయకులు ఇలా కుట్ర పన్నారని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాబోయేది ఎన్డీయేనే.. మళ్లీ ప్రధాని మోదీనే: ధర్మవరం సభలో చంద్రబాబు
దేశంలో రాబోయేది ఎన్డీయేనే.. మళ్లీ ప్రధాని అయ్యేది మోదీనే అని తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. రాష్ట్రంలో ధర్మాన్ని గెలిపించేందుకు అందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. -
ఏపీలో చంద్రబాబు.. కేంద్రంలో మోదీ వస్తే రెండేళ్లలో పోలవరం పూర్తి: అమిత్షా
ఆంధ్రప్రదేశ్లో గూండాగిరీని అంతం చేసేందుకే తెదేపా, జనసేనతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని భాజపా అగ్రనేత, కేంద్రమంత్రి అమిత్షా అన్నారు. -
ఏపీలో ఇద్దరు డీఎస్పీలపై ఈసీ బదిలీ వేటు
ఏపీలో ఇద్దరు డీఎస్పీలపై బదిలీ వేటు వేశారు. వారిపై అందిన ఫిర్యాదులపై మేరకు ఎన్నికల సంఘం ఈ చర్యలు తీసుకుంది. -
పొలాల్లో నాటిన హద్దు రాళ్లే.. జగన్ ఓటమికి శిలాఫలకాలు
జగనన్న భూరక్ష పేరిట రైతుల పొలాల్లో నాటిన హద్దురాళ్లే జగన్ ప్రభుత్వ ఓటమికి శిలాఫలకాలని, ఆ పథకం పెద్ద బోగస్ అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. -
పార్టీ మారారని పొట్ట కొట్టిన వైకాపా నాయకులు
వైకాపా నాయకుల ఆగడాలు ఆగడం లేదు. తెదేపా సభలకు వెళ్లారని, ప్రచారంలో పాల్గొన్నారని, తమ పార్టీలో చేరలేదని వైకాపా శ్రేణులు... దాడులకు పాల్పడుతున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. -
అంగీకారం.. అభ్యంతరం.. రెండూ ఆయనవే!
‘ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ఎవరికైనా అభ్యంతరాలుంటే అప్పిలేట్ అథారిటీ (జిల్లా జడ్జి స్థాయి అధికారి) దృష్టికి తీసుకెళ్లొచ్చు. -
ప్రతి రంగంలోనూ మార్పులు తెచ్చాం
‘ఎన్నడూ లేని విధంగా ఈ 59 నెలల్లో రాష్ట్రంలోని ప్రతి రంగంలోనూ విప్లవాత్మక మార్పులు తెచ్చాం. 2.31 లక్షల ఉద్యోగాలిచ్చాం. రూ.2.70 లక్షల కోట్లను అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశాం. -
జగన్ పాలనంతా బూతులు.. గోతులే
‘ఆడబిడ్డలకు పెళ్లిళ్లు చేసి పసుపు కుంకుమ కింద ఇచ్చే పొలాలకు జిరాక్స్ పత్రాలు ఇస్తామా? వాటికి విలువ ఉంటుందా? అందుకే వైకాపా ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ను వ్యతిరేకించాలని కోరుతున్నా. -
నరసాపురం.. కూటమిదే బలం!
సాగునీరందక పంట విరామం.. తాగునీరు కొనుక్కోవాల్సిన దుస్థితి.. ఆక్వా రంగానికి వెన్నెముకగా నిలిచిన భీమవరంలో జే ట్యాక్స్.. ఇంటికి పునాది పడితే ‘కే’ ట్యాక్స్.. ఇదీ నరసాపురం లోక్సభ నియోజకవర్గంలో పరిస్థితి. -
జగన్ ఇంటి సమీపంలో యువతిపై అఘాయిత్యం కేసులో చర్యలేవి?
సీఎం జగన్ ఇంటి సమీపంలో యువతిపై జరిగిన అఘాయిత్యం కేసు నిందితుల్ని ఇంతవరకు పోలీసులు ఎందుకు శిక్షించలేదని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామినీశర్మ ప్రశ్నించారు. -
మేం అధికారంలోకి వచ్చాక రౌడీలు జైల్లోకే!
ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చాక రౌడీలు దేశమైనా వదలాలి.. జైళ్లలోనైనా ఉండాలని తెదేపా ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నారు. చట్టాలను అతిక్రమించినవారి భరతం పట్టేందుకే ‘రెడ్ బుక్’ ఉందని హెచ్చరించారు. -
దళిత, గిరిజనులను జగన్ బిచ్చగాళ్లలా చూశారు
ఐదేళ్ల పాలనలో ముఖ్యమంత్రి జగన్.. దళిత, గిరిజనులను అడుక్కునేవాళ్లలా చూశారని, వారి అభివృద్ధికి చేసిందేమీ లేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విరుచుకుపడ్డారు. -
మంత్రాలయం ఎమ్మెల్యేకి నిరసన సెగ
కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం చిన్నకడబూరు గ్రామంలో శనివారం ఎన్నికల ప్రచార నిమిత్తం వచ్చిన మంత్రాలయం ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి వై.బాలనాగిరెడ్డికి చుక్కెదురైంది. -
పోస్టల్ బ్యాలెట్కు రూ.3 వేలు
తమకు ఓటేస్తే రూ.3 వేలు ఇస్తామని కొందరు ఉద్యోగులకు వైకాపా నాయకులు ఎర వేశారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం పోస్టల్ బ్యాలెట్ వినియోగించే కేంద్రాల్లోకి సెల్ఫోన్లు అనుమతించకూడదు. -
జగన్ గెలిస్తే ప్రజల భూములన్నీ తాకట్టే!
కొత్తగా తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం ద్వారా ప్రజల భూముల్ని తాకట్టు పెట్టడానికి జగన్ కుట్ర పన్నినట్లు తెదేపా నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆరోపించారు. -
సందిగ్ధతతో ఓటును చెల్లని కాగితంగా చేయొద్దు..!
పోస్టల్ బ్యాలట్ వేయడంలో కొంతమంది ఉద్యోగులు చేస్తున్న తప్పుల కారణంగా ఓట్లు చెల్లనివిగా మారుతున్నాయి. ఓటు వేయడంలో సందేహాలు ఉంటే అక్కడే ఉండే పీఓ, ఏపీఓల సహాయం సైతం తీసుకోవచ్చు. -
రాష్ట్రంలో పోస్టల్ బ్యాలట్ విధానం అస్తవ్యస్తం
ఆంధ్రప్రదేశ్లో పోస్టల్ బ్యాలట్ విధానం అస్తవ్యస్తంగా మారిందని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. -
ప్రజల ఆస్తులు లాక్కొనేందుకు జగన్ కుట్ర
భూ యాజమాన్య హక్కు చట్టం పేరిట ప్రజల ఆస్తులను లాక్కొనేందుకు జగన్ కుట్ర చేస్తున్నారని నరసాపురం ఎంపీ, తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి రఘురామకృష్ణరాజు విమర్శించారు. -
నేడు ధర్మవరానికి అమిత్షా.. జమ్మలమడుగుకి రాజ్నాథ్సింగ్
అనంతపురం జిల్లా ధర్మవరంలోని బత్తలపల్లి రోడ్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆదివారం ఉదయం 10.30గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్షా పాల్గొననున్నారు. -
రేపు అనకాపల్లి జిల్లాకు ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్రమోదీ మరోసారి రాష్ట్రానికి రాబోతున్నారు. ఈ ఎన్నికల్లో భాజపాతో తెదేపా, జనసేన కూటమిగా జట్టుకట్టిన తర్వాత తొలిసారిగా చిలకలూరిపేట బహిరంగసభకు వచ్చిన మోదీ.. తాజాగా రాజమహేంద్రవరంతో పాటు అనకాపల్లి జిల్లాలో పర్యటించేందుకు సోమవారం రానున్నారు. -
పవన్ను ఇబ్బంది పెట్టాలని హెలిప్యాడ్ ధ్వంసం
గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణం జీబీసీ రహదారిలో ఇటీవల సీఎం పర్యటన సందర్భంగా నిర్మించిన హెలిప్యాడ్ను వైకాపా నాయకులు శనివారం ధ్వంసం చేశారు.
తాజా వార్తలు
-
ఎన్టీఆర్కు అర్జున్పై నమ్మకం.. నేను రీషూట్ చేయలేదు: సుకుమార్
-
డోపింగ్ శాంపిల్కు బజరంగ్ నిరాకరణ.. సస్పెన్షన్ వేటు!
-
మృణాల్ అవుట్ఫిట్కు నెటిజన్లు ఫిదా.. డిజైనింగ్కు 1400 గంటలు
-
కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నా.. ఆడతానని అనుకోలేదు: సిరాజ్
-
ఒకే సమయంలో వచ్చే ఏడాది ఐపీఎల్ - పీఎస్ఎల్..! కారణమిదేనా?
-
హంతకులకు అడ్రస్ చెప్పిన ఇన్స్టా పోస్టు.. మోడల్ హత్యలో కీలక విషయాలు