Crime News: అదుపు తప్పొద్దంటే...అమ్మనే హతమార్చింది

జీవితంలో దారి తప్పొద్దని హెచ్చరించిన పాపానికి కన్నతల్లినే కడతేర్చిందా కుమార్తె. పోలీసుల కథనం ప్రకారం... తమిళనాడులోని తూత్తుక్కుడి వన్నార్‌వీధికి చెందిన మునియలక్ష్మి (43) భర్త నుంచి విడిపోయి

Updated : 28 Mar 2022 08:54 IST

సైదాపేట, న్యూస్‌టుడే: జీవితంలో దారి తప్పొద్దని హెచ్చరించిన పాపానికి కన్నతల్లినే కడతేర్చిందా కుమార్తె. పోలీసుల కథనం ప్రకారం... తమిళనాడులోని తూత్తుక్కుడి వన్నార్‌వీధికి చెందిన మునియలక్ష్మి (43) భర్త నుంచి విడిపోయి తన ముగ్గురు పిల్లలతో కలిసి జీవిస్తోంది. ఆమె కుమార్తె (17) ఎప్పుడూ స్థానిక యువకులతో మాట్లాడుతుండటంతో మునియలక్ష్మి మందలించింది. దారి తప్పొద్దని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో తన తల్లిని ఎవరో హత్య చేసినట్లు బాలిక ఆదివారం పోలీసులకు ఫోన్‌ చేసి సమాచారమిచ్చింది. పోలీసులు వచ్చి మునియలక్ష్మి మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపారు. తల్లిని స్నేహితులతో కలిసి కుమార్తే హత్య చేసినట్లు దర్యాప్తులో తెలిసింది. ఇంట్లో నిద్రిస్తున్న తల్లిని తన స్నేహితులైన యువకులతో కలిసి గొంతు నులిమి చంపినట్లు బాలిక విచారణలో పోలీసులకు చెప్పింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని