Crime News: మహిళతో అసభ్య ప్రవర్తన.. స్థానికుల దాడిలో వ్యక్తి మృతి

మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడని స్థానికులు దాడి చేయడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా జవహర్‌నగర్‌ ఠాణా పరిధిలోని కౌకూరు భరత్‌నగర్‌లో జరిగింది. జవహర్‌నగర్‌

Updated : 07 Apr 2022 06:49 IST

జవహర్‌నగర్‌, న్యూస్‌టుడే: మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడని స్థానికులు దాడి చేయడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా జవహర్‌నగర్‌ ఠాణా పరిధిలోని కౌకూరు భరత్‌నగర్‌లో జరిగింది. జవహర్‌నగర్‌ సీఐ చంద్రశేఖర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కౌకూరు భరత్‌నగర్‌లో రాజు అలియాస్‌ ఏసు(38) ఒంటరిగా నివసిస్తున్నాడు. పక్కనే మరో గదిలో తల్లి ఉంటున్నారు. బుధవారం పెరుగు విక్రయించేందుకు వచ్చిన ఓ మహిళతో అతడు అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె విషయాన్ని భర్తకు తెలిపింది. అతడు రాజును నిలదీశాడు. స్థానికులు దాడి చేశారు. రాజు ఘటనాస్థలిలోనే కుప్పకూలిపోయాడు. సమాచారం అందగానే కుషాయిగూడ ఏసీపీ శివకుమార్‌ అక్కడికి చేరుకొని విచారించారు. రాజుకు అప్పుడప్పుడు మానసికస్థితి సరిగా లేదని స్థానికులు పేర్కొన్నట్లు ఆయన తెలిపారు. తన కుమారుడిపై కావాలనే దాడి చేసి హత్య చేశారని మృతుడి తల్లి ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని