Telangana News: క్షతగాత్రుడితో రాస్తారోకో.. ఆరోగ్యం క్షీణించి మృతి
మండే ఎండలో మంచంపై పడుకోబెట్టి క్షతగాత్రునితో రహదారిపై గురువారం రాస్తారోకో చేస్తున్న చిత్రమిది. అనార్యోగంగా ఉన్న అతడి పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించే క్రమంలో మృతి చెందాడు. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లిలో
మండే ఎండలో మంచంపై పడుకోబెట్టి క్షతగాత్రునితో రహదారిపై గురువారం రాస్తారోకో చేస్తున్న చిత్రమిది. అనార్యోగంగా ఉన్న అతడి పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించే క్రమంలో మృతి చెందాడు. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లిలో ఈ ఘటన జరిగింది. కమ్మర్పల్లికి చెందిన గుండెబోయిన భూమన్న(33) తన స్నేహితుడు ఆటో డ్రైవర్ మారుతితో కలిసి ఫిబ్రవరి 23న ఆటోలో ఊరికి వస్తుండగా బోల్తా పడింది. భూమన్న వెన్నెముకకు తీవ్రంగా గాయమైంది. తల్లి గంగవ్వ ఫిర్యాదుతో పోలీసులు మారుతిపై కేసు నమోదు చేశారు. గాయం కారణంగా మంచంపై నుంచి లేవలేని స్థితిలో ఉన్న భూమన్నను ఆటో డ్రైవర్ ఆదుకోవాలని కుటుంబ సభ్యులు నిజామాబాద్- కరీంనగర్ ప్రధాన రహదారిపై క్షతగాత్రునితో రాస్తారోకో చేశారు. ఎస్సై రాజశేఖర్ కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి.. క్షతగాత్రుడిని 108 అంబులెన్స్లో ఆర్మూర్ దవాఖానాకు తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు.
- కమ్మర్పల్లి, న్యూస్టుడే
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM