ప్రేమించు.. లేదంటే చంపేస్తా..

ప్రేమ వేధింపులతో హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగాపూర్‌కు చెందిన నమిండ్ల శ్వేత (18) శనివారం ఆత్మహత్యకు పాల్పడింది. ములుకనూర్‌ పోలీసుల కథనం ప్రకారం.. శ్వేత కరీంనగర్‌లో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది.

Published : 26 Jun 2022 05:39 IST

స్నేహితుడితో కలిసి ఇంటికెళ్లి మరీ బెదిరింపులు
వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య

భీమదేవరపల్లి, న్యూస్‌టుడే: ప్రేమ వేధింపులతో హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగాపూర్‌కు చెందిన నమిండ్ల శ్వేత (18) శనివారం ఆత్మహత్యకు పాల్పడింది. ములుకనూర్‌ పోలీసుల కథనం ప్రకారం.. శ్వేత కరీంనగర్‌లో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇదే గ్రామానికి చెందిన మీసాల వంశీ ఏడాది కాలంగా ప్రేమించాలంటూ వేధిస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం వంశీతో పాటు అతడి మిత్రుడు జగదీష్‌ ఇంటికి వచ్చి శ్వేతతో గొడవపడ్డారు. ఆమె తండ్రిని చూసి భయపడి పారిపోయారు. వెళ్తూవెళ్తూ.. ‘నన్ను ప్రేమించు.. లేదంటే నిన్ను ఎప్పటికైనా చంపేస్తా, నీ పరువు తీస్తా’ అని వంశీ బెదిరించాడు. అవమానం భరించలేక శనివారం ఉదయం గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో దూకి శ్వేత ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని