గ్రామీణ బ్యాంకులో భారీ దోపిడీ
నిజామాబాద్ జిల్లాలో ఘటన
గ్యాస్ కట్టర్తో లాకర్ ధ్వంసం చేసి 8.3 కిలోల బంగారం చోరీ
మొత్తం రూ.4.46 కోట్ల సొత్తు అపహరణ
ఈనాడు, నిజామాబాద్, బాల్కొండ, న్యూస్టుడే: గ్యాస్ కట్టర్లతో బ్యాంకు లాకర్ను ధ్వంసం చేసి రూ.4.46 కోట్ల విలువైన సొమ్ము దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. 44వ జాతీయ రహదారిపై మెండోరా మండలం బుస్సాపూర్లోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఈ చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామాభివృద్ధి కమిటీ భవనంపై అంతస్తులో ఉన్న బ్యాంకు తాళాలు తొలగించి దొంగలు లోనికి ప్రవేశించారు. వెంట తెచ్చుకున్న గ్యాస్ సిలిండర్లతో కట్టర్లను వినియోగించి స్ట్రాంగ్రూం తాళాలు తొలగించారు. బ్యాంకులో రెండు లాకర్లుండగా తాకట్టు బంగారం ఉంచిన పెద్ద లాకర్ను ధ్వంసం చేశారు. ఇందులో రూ.7.30 లక్షల నగదు, 8.3 కిలోల బంగారు ఆభరణాలు, దస్త్రాలు ఉన్నాయి. గ్యాస్ కట్టర్తో లాకర్ తలుపును కోసే క్రమంలో నిప్పురవ్వల కారణంగా కొంత నగదు, దస్త్రాలు దగ్ధమయ్యాయి. దుండగులు వెంటతెచ్చిన గ్యాస్ సిలెండర్లు అక్కడే వదిలేసి బంగారంతో పరారయ్యారు. దొంగలు సీసీ కెమెరాలను ధ్వంసం చేసి వీడియో రికార్డు జరిగే డీవీఆర్ను ఎత్తుకెళ్లారు. ఎలుగుబంటి రూపంలో ఉండే మాస్కులు ధరించి వచ్చిన దొంగలు బ్యాంకు ఆవరణలో ఓ మాస్క్ వదిలి వెళ్లారు. ఖాతాదారుల ఆభరణాల లాకర్కు ఏమీ కాకపోవటంతో మరింత భారీ చోరీ తప్పినట్లయింది.
శనివారం రాత్రే దోపిడీ
దోపిడీ శనివారం అర్ధరాత్రే జరిగినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఆదివారం ఉదయమే బ్యాంకు కింద ఉండే హోటల్కు వచ్చిన కొందరు కాలిపోయిన వాసన గుర్తించినప్పటికీ అటువైపు వెళ్లలేదు. బ్యాంకుకు సెలవు కావడంతో ఉద్యోగులెవరూ రాలేదు. సోమవారం ఉదయం విధులకు వచ్చిన సిబ్బంది బ్యాంకులో పరిస్థితిని చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లూస్ టీం వేలిముద్రలు సేకరించింది. జాగిలాలతో తనిఖీలు చేయించారు. అవి సమీపంలో జాతీయ రహదారి వెంట నిర్మల్ జిల్లా వైపు వెళ్లాయి. దొంగలు బ్యాంకు భవనానికి ముందు నుంచి కాకుండా వెనకాల ఉన్న పాఠశాల, బీఎస్ఎన్ఎల్ పాత ఎక్స్ఛ్ంజ్ గోడలు దూకి వచ్చినట్లు తేలింది.
పనిచేయని స్ట్రాంగ్రూం తాళం
బ్యాంకులో స్ట్రాంగ్రూమ్కు ఉన్న ఆటోమేటిక్ తాళం పనిచేయక పోవడంతో ఇళ్లకు వేసే తాళం ఉపయోగించారు. దొంగలు దీన్ని సులువుగా తొలగించి లోనికి ప్రవేశించారు. అక్కడ రాత్రి వేళల్లో ఎవరైనా లాకర్ను తాకితే బ్యాంకు మేనేజర్, స్థానిక పోలీసుల సెల్ఫోన్లకు మెసేజ్ అలారం వెళ్లే ఎలక్ట్రానిక్ పరికరం అమర్చారు. దొంగలు దీన్ని ముందే గుర్తించి వైర్లు కట్చేసి చిప్ తీసుకెళ్లిపోయారు. అంతర్రాష్ట్ర దొంగల ముఠా పనిగా ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు నిజామాబాద్ పోలీసు కమిషనర్ నాగరాజు విలేకరులకు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (07/08/2022)
-
World News
China-Taiwan ఉద్రిక్తతల వేళ.. తైవాన్ కీలక అధికారి అనుమానాస్పద మృతి
-
India News
Varun Gandhi: ఉచిత రేషన్ సరే.. ఆ రూ.10 లక్షల కోట్ల మాటేంటి..?
-
Movies News
Naga Chaitanya: సమంతను ఎప్పటికీ గౌరవిస్తూనే ఉంటా: నాగచైతన్య
-
General News
Telangana News: గాంధీ సినిమా ఉచిత ప్రదర్శన.. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు
-
Politics News
CM Kcr: తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ పంద్రాగస్టు కానుక
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- weekly horoscope :రాశిఫలం ( ఆగస్టు 7 - ఆగస్టు 13)
- INDIA vs WI: వెస్టిండీస్పై ఘన విజయం..సిరీస్ భారత్ సొంతం
- Alibaba: 10 వేల మంది ఉద్యోగులకు అలీబాబా గుడ్బై.. 2016 తర్వాత తొలిసారి!
- Tattoos: టాటూలు వేసుకున్న ఇద్దరికి హెచ్ఐవీ పాజిటివ్!
- ఈ బాధలు భరించలేకపోతున్నానంటూ అమెరికాలో ప్రవాస భారతీయురాలి ఆత్మహత్య
- Stomach ulcers: అల్సర్ ఎందుకొస్తుందో తెలుసా..?
- Rishi Sunak: ప్రధాని పదవికి నేనే బెస్ట్..!
- INDw vs ENGw : క్రికెట్లో పతకం ఖాయం.. ఫైనల్కు దూసుకెళ్లిన టీమ్ఇండియా
- IT Raids: సినీ ప్రముఖుల ఇళ్లల్లో ఐటీ సోదాలు.. రూ.200కోట్ల ‘నల్లధనం’ గుర్తింపు
- Delhi: పోలీసుస్టేషన్లోకి చొరబడి మరీ.. కానిస్టేబుల్పై రౌడీ మూక దాడి