అక్రమాలకు అడ్డొస్తున్నారనే అంతమొందించారు
ప్రకాశం జిల్లా సి.ఎస్.పురం మండలం ఏకునాంపురానికి చెందిన దళిత పాస్టర్ దాసరి వెంకట రమణయ్య (55) హత్యకేసును పోలీసులు ఛేదించారు. వైకాపా నాయకుడు, ఉపాధిహామీ
వైకాపా నాయకుడే ప్రధాన నిందితుడు
ముగ్గురు బాలురతో పథకం ప్రకారం హత్య
పాస్టర్ హత్య కేసు ఛేదించిన పోలీసులు
సి.ఎస్.పురం, న్యూస్టుడే: ప్రకాశం జిల్లా సి.ఎస్.పురం మండలం ఏకునాంపురానికి చెందిన దళిత పాస్టర్ దాసరి వెంకట రమణయ్య (55) హత్యకేసును పోలీసులు ఛేదించారు. వైకాపా నాయకుడు, ఉపాధిహామీ క్షేత్ర సహాయకుడే ప్రధాన నిందితుడిగా గుర్తించారు. 17, 16, 13 ఏళ్ల వయసున్న ముగ్గురు బాలురతో హత్య ప్రణాళికను అమలు చేసినట్లు తేల్చారు. దర్శి డీఎస్పీ వి.నారాయణస్వామి రెడ్డి విలేకరులకు బుధవారం ఈ వివరాలు వెల్లడించారు. వైకాపా నాయకుడు కేతనబోయిన శ్రీనివాసులుకు.. వెంకటరమణయ్యకు మధ్య భూ వివాదాలు ఉన్నాయి. ఉపాధిహామీ పనుల్లో అవకతవకలు, గ్రామంలో ఇతర అక్రమాలపై ఆయన తరచూ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో రమణయ్యపై కక్ష పెంచుకున్న శ్రీనివాసులు.. ఆయనను అంతం చేయాలని పథకం పన్నాడు. ముగ్గురు బాలురతో తన పథకాన్ని అమలు చేశాడు. ఈ నెల 3న సాయంత్రం, అరివేముల నుంచి ద్విచక్ర వాహనంపై వస్తున్న వెంకట రమణయ్యను... చెర్లోపల్లి సమీపంలోని వెలిగొండ ప్రాజెక్టు కాలువ వద్ద బాలురు అడ్డగించారు. ఆయన తలపై కర్రలు, రాళ్లతో కొట్టి గాయపరిచారు. అనంతరం సమీప జామాయిల్ తోటలోకి తీసుకెళ్లి బండరాయితో మోది హత్య చేశారు. మృతదేహాన్ని ఈడ్చుకెళ్లి చిల్లచెట్లలో పడేశారు. ఈ ఘటనలో 8మందిపై అనుమానం వ్యక్తం చేస్తూ మృతుడి భార్య నారాయణమ్మ పోలీసులకు ఫిర్యాదుచేశారు. విచారణ జరిపిన పోలీసులు ప్రధాన నిందితుడు శ్రీనివాసులు సహా బాలలను అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాసులును పొదిలి కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. ముగ్గురు బాలురను జువెనైల్ హోంకు తరలించారు. కేసు దర్యాప్తును డీఎస్పీ స్వయంగా పర్యవేక్షించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్