Crime News: పెళ్లికి నిరాకరించిందని ప్రియురాలికి నిప్పు.. చికిత్స పొందుతూ యువతి మృతి

తనను పెళ్లాడేందుకు నిరాకరించిందని 22 ఏళ్ల యువతిపై ఓ వ్యక్తి పెట్రోల్‌ పోసి నిప్పంటించిన ఘటన ఝార్ఖండ్‌లోని దుమ్కా జిల్లాలో శుక్రవారం చోటు చేసుకుంది.

Updated : 08 Oct 2022 08:47 IST

ఝార్ఖండ్‌లో దారుణ ఘటన

తనను పెళ్లాడేందుకు నిరాకరించిందని 22 ఏళ్ల యువతిపై ఓ వ్యక్తి పెట్రోల్‌ పోసి నిప్పంటించిన ఘటన ఝార్ఖండ్‌లోని దుమ్కా జిల్లాలో శుక్రవారం చోటు చేసుకుంది. బాల్కీ గ్రామానికి చెందిన ఓ యువతి మహేశ్‌పుర్‌కు చెందిన రాజేశ్‌ అనే యువకుడు ప్రేమించుకున్నారు. 2022లో రాజేశ్‌ మరో మహిళను వివాహం చేసుకున్నాడు. దీంతో యువతి తల్లిదండ్రులు ఆమెను మరొకరికి ఇచ్చి పెళ్లి జరిపించేందుకు సిద్ధమయ్యారు. రాజేశ్‌ మాత్రం ఆమెను కూడా తానే పెళ్లి చేసుకుంటానని యువతి వెంటపడ్డాడు. ఆమె ఎంత చెప్పినా వినకపోగా.. యువతిని చంపుతానని బెదిరించాడు. శుక్రవారం ఉదయం ఎవరూ లేని సమయం చూసుకుని రాజేశ్‌ యువతి ఇంటికి వెళ్లాడు. నిద్రపోతున్న యువతిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించి పరారయ్యాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు విడిచింది. నిందితుడ్ని పట్టుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

- ఈటీవీ భారత్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని