Hyderabad: జూబ్లీహిల్స్‌ గ్యాంగ్‌ రేప్‌ కేసు.. మైనర్ల బెయిల్‌ పిటిషన్లు తిరస్కరణ

జూబ్లీహిల్స్‌లో 17 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నలుగురు మైనర్లు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను జువైనల్‌ జస్టిస్‌ బోర్డు తిరస్కరించింది. కేసు తీవ్రత దృష్ట్యా నిందితులకు

Published : 22 Jun 2022 19:53 IST

హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో 17 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నలుగురు మైనర్లు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను జువైనల్‌ జస్టిస్‌ బోర్డు తిరస్కరించింది. కేసు తీవ్రత దృష్ట్యా నిందితులకు బెయిల్‌ ఇవ్వొద్దని పోలీసులు చేసిన వాదనతో జువైనల్‌ జస్టిస్‌ బోర్డు ఏకీభవిస్తూ బెయిల్‌ పిటిషన్లు తిరస్కరించింది. 23న మరో మైనర్ బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయనున్నారు.

నలుగురు మైనర్లు జువైనల్ జస్టిస్ బోర్డులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై మంగళవారం నిందితుల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. బెయిల్‌ మంజూరు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. అయితే కేసు దర్యాప్తు దశలో ఉన్నందున మైనర్లకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని పోలీసుల తరఫు న్యాయవాది బోర్డు ఎదుట వాదనలు వినిపించారు. సమాజంలో పలుకుబడి ఉన్న మైనర్ల తల్లిదండ్రులు దర్యాప్తునకు ఆటంకం కలిగించే అవకాశం కూడా ఉండొచ్చని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. బెయిల్ పిటిషన్లపై మంగళవారం విచారణ వాయిదా వేసిన జువైనల్ జస్టిస్‌ బోర్డు పిటిషన్లు తిరస్కరిస్తూ తీర్పు వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని