Nizamabad: కారును ఢీకొట్టి టోల్‌ప్లాజా కౌంటర్‌లోకి దూసుకెళ్లిన లారీ

నిజామాబాద్‌ జిల్లాలోని ఇందల్వాయి టోల్‌ ప్లాజా వద్ద లారీ బీభత్సం సృష్టించింది.

Published : 26 Dec 2023 14:46 IST

ఇందల్వాయి: నిజామాబాద్‌ జిల్లాలోని ఇందల్వాయి టోల్‌ ప్లాజా వద్ద లారీ బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న లారీ డ్రైవర్‌ ముందు వెళ్తున్న కారును ఢీకొట్టాడు. అనంతరం లారీ టోల్‌ ప్లాజా కౌంటర్‌లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు టోల్‌ ప్లాజా సిబ్బంది, కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించిన టోల్‌ ప్లాజా సిబ్బంది.. బాధితులను నిజామాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కౌంటర్‌లోకి దూసుకెళ్లిన లారీని క్రేన్‌ సాయంతో తొలగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని