JK: శ్రీనగర్‌లో వేర్వేరు చోట్ల ఉగ్రవాదుల కాల్పులు.. ఒకరి మృతి

జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో వేర్వేరు చోట్ల ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ముష్కరుల దాడిలో ఒకరు మృతి చెందగా.....

Updated : 03 Oct 2021 01:19 IST

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో వేర్వేరు చోట్ల ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ముష్కరుల దాడిలో ఒకరు మృతి చెందగా.. మరొకరికి గాయాలైనట్టు పోలీసులు వెల్లడించారు. కారానగర్‌ ప్రాంతంలో సాయంత్రం 5.50 గంటల ప్రాంతంలో ఉగ్రవాదులు కాల్పులు జరపగా.. ఈ ఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. దీంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతడు మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.  ఈ ఘటనతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టారు. అదనపు బలగాలను శ్రీనగర్‌లోని అన్ని చోట్లా మోహరించారు. ముమ్మర తనిఖీలు చేపట్టారు.

ఈ తనిఖీలు కొనసాగుతుండగానే మరోవైపు, రాత్రి 8గంటల సమయంలో మరోచోట కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో మహమ్మద్‌ షఫీ దార్‌ అనే వ్యక్తి గాయపడినట్టు పోలీసులు తెలిపారు. అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు వెల్లడించారు. ఈ రెండు ఘటనలపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. దాడికి పాల్పడిన వారి ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని