Crime news: గర్భిణిపై అమానుషం.. గ్యాంగ్ రేప్ చేసి రైలు పట్టాలపై పడేశారు!
వాకింగ్కు వెళ్లిన గర్భిణిపై ముగ్గురు మానవ మృగాళ్లు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. స్పృహ కోల్పోయిన గర్భిణి పట్ల కనీస కనికరం కూడా చూపకుండా నిర్దయగా రైలు పట్టాలపై పడేసి వెళ్లిపోయారు.
పట్నా: బిహార్లోని పట్నా నగరంలో ఓ గర్భిణిపై దారుణం చోటుచేసుకుంది. వాకింగ్కు వెళ్లిన ఆమెపై ముగ్గురు మానవ మృగాళ్లు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. స్పృహ కోల్పోయిన గర్భిణి పట్ల కనీస కనికరం కూడా చూపకుండా నిర్దయగా రైలు పట్టాలపై పడేసి వెళ్లిపోయారు. ఈ అమానుష ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 24ఏళ్ల మహిళ శనివారం రాత్రి తన ఇంటి సమీపంలో వాకింగ్కు వెళ్లింది. ఆమెను అనుసరించిన ఇద్దరు యువకులు గర్భిణి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. అనంతరం ఆమె నోటిని గట్టిగా మూసేసి సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అనంతరం మరో వ్యక్తిని పిలిచి ముగ్గురూ ఒకరి తర్వాత ఒకరు దారుణానికి పాల్పడ్డారు. ఆమె ప్రతిఘటించగా దాడి చేశారు. దీంతో స్పృహ కోల్పోవడంతో మహిళను రైల్వే ట్రాక్ వద్ద వదిలేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆమెకు స్పృహ వచ్చింది. గట్టిగా కేకలు వేయడంతో అప్రమత్తమైన రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి ఆమెను మహిళా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. అనంతరం వైద్య పరీక్షలు చేసి వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఈ వ్యవహారంలో ఇద్దరు నిందితులైన విశాల్, అంకిత్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. మూడో నిందితుడి కోసం గాలిస్తున్నట్టు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంతర్జాతీయ కోడ్తో వాట్సప్ కాల్స్!
బంజారాహిల్స్ వాసి దినేశ్కు +84 (వియత్నాం) కోడ్తో మొదలయ్యే నంబర్ నుంచి వాట్సప్ వీడియోకాల్ వచ్చింది. అది విదేశీ నంబర్ కావడంతో అనుమానంతో అతను లిఫ్ట్ చేయలేదు. -
ఇద్దరు మావోయిస్టుల లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు శుక్రవారం పోలీసులకు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా కిష్టారం పోలీస్స్టేషన్ పరిధిలోని నెమలిగూడకు చెందిన పొడియం ఇడుమయ్య అలియాస్ హరీశ్, ఉయికే ముత్యాలక్క లు భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ ఎదుట లొంగిపోయినట్లు తన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఏఎస్పీ తెలిపారు. -
‘మృత్యు’ ప్రయాణం!
సెలవులు...శుభకార్యాలు. వెరసి వేసవికాలంలో..ముఖ్యంగా మే నెలలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. జాతీయ రహదారులు, హైవేల మంత్రిత్వశాఖ నివేదిక ప్రకారం 2022 సంవత్సరంలో అత్యధికంగా మే నెలలోనే రోడ్డు ప్రమాదాలు, మరణాలు నమోదయ్యాయి. -
కొట్టేసిన ఫోన్లు సూడాన్కు.. స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు
రాష్ట్రంలో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తున్న, వాటిని కొనుగోలు చేస్తున్న 12 మంది సభ్యులున్న ముఠాను హైదరాబాద్ సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. -
పెళ్లి వేడుకలో అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబంలో ఆరుగురి మృతి
బిహార్లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. దర్భంగా ప్రాంతంలో జరిగిన ఓ వివాహ వేడుకలో మంటలు చెలరేగి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులతో ప్రమాదాలు
ఉమ్మడి అనంతపురం జిల్లాలో శుక్రవారం రెండు వేర్వేరు చోట్ల ఆర్టీసీ బస్సులు ప్రమాదానికి గురయ్యాయి. ఆ రెండు బస్సులూ కాలం చెల్లినవే కావడం గమనార్హం. -
ఆలిన్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం
రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలోని ఆలిన్ ఫార్మసీ కంపెనీలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. -
నీటి బకెట్లో పడి చిన్నారి మృతి
నీటి బకెట్లో పడి ఊపిరాడక 18 నెలల చిన్నారి స్నేహిత మృతిచెందింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలో జరిగింది. -
ఏనుగు దాడిలో మరో ఇద్దరి రైతుల మృతి
కుమురం భీం జిల్లాలో ఇటీవల ఇద్దరిని చంపిన ఏనుగు మహారాష్ట్రలో మరో ఇద్దరిని బలి తీసుకుంది. -
స్టాక్ ట్రేడింగ్లో లాభాలిస్తామని రూ.కోటి కాజేత
సైబర్ వలలో చిక్కుకున్న ఓ విద్యార్థిని రూ.కోటికి పైగా డబ్బు పోగొట్టుకుంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.