Road Accident: టాటాఏస్‌-కారు ఢీ.. 20 మందికి గాయాలు

జిల్లాలోని కొత్తపల్లి మండలం చింతకుంట వద్ద ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది.

Published : 24 Jan 2022 01:55 IST

కరీంనగర్‌: జిల్లాలోని కొత్తపల్లి మండలం చింతకుంట వద్ద ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. టాటాఏస్‌ వాహనం-కారు ఢీకొని 20 మంది గాయపడ్డారు. వేములవాడ దర్శనానికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితులు మహబూబాబాద్‌, ములుగు జిల్లాలకు చెందినవారిగా గుర్తించారు. ప్రమాద సమయంలో టాటాఏస్‌ వాహనంలో 15 మంది, కారులో ఐదుగురు ఉన్నారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు