పబ్జీ లేదని.. ప్రాణాలు తీసుకున్నాడు..!

అనంతపురంలో పబ్జీ గేమ్‌కు బానిసైన బీటెక్‌ విద్యార్థి కిరణ్‌కుమార్‌రెడ్డి నిషేధాన్ని తట్టుకోలేక ప్రాణాలు తీసుకున్నాడు.

Published : 13 Sep 2020 01:14 IST

అనంతపురం: అనంతపురంలో పబ్జీ గేమ్‌కు బానిసైన ఓ బీటెక్‌ విద్యార్థి ఆ గేమ్‌పై నిషేధాన్ని తట్టుకోలేక ప్రాణాలు తీసుకున్నాడు. నగరానికి చెందిన కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ నెల ఐదో తేదీనే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడగా ఈ ఘటన ఆలస్యంగా బయటపడింది. కుమారుడు కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆచూకీ లభించక ఆందోళన చెందారు. తాజాగా స్టోర్‌ రూంలో కుళ్లిన శవం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. చెన్నైలో బీటెక్‌ రెండో సంవత్సరం చదువుతున్న కిరణ్‌కుమార్‌రెడ్డి నిత్యం సెల్‌ఫోన్‌లో గేమ్స్‌ ఆడుకునే వాడని బంధువులు తెలిపారు. ఇటీవల పబ్జీ గేమ్‌పై వేటు పడటంతో కావడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని