Crime News: విడాకుల కోసం వచ్చిన భార్యకు కత్తిపోట్లు.. కోర్టు బయటే భర్త దారుణం!

తన భార్యతో విడాకుల కోసం కోర్టుకు వచ్చిన ఓ భర్త అందరూ చూస్తుండగానే ఆమెపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది.......

Published : 30 Apr 2022 02:25 IST

చెన్నై: భార్యతో విడాకుల కోసం కోర్టుకు వచ్చిన ఓ భర్త అందరూ చూస్తుండగానే ఆమెపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది. ఈ షాకింగ్‌ ఘటన తమిళనాడులోని పెరంబలూరు జిల్లా కోర్టు వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుధ, కామరాజ్‌ అనే దంపతులు విడిపోయి గత కొన్నేళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు. విడాకుల కోసం కోర్టును ఆశ్రయించగా.. ఆ కేసు విచారణ సాగుతోంది. అయితే, శుక్రవారం ఈ కేసు విచారణ కోసం వారిద్దరూ అనుకోకుండా ఒకే బస్సులో ప్రయాణం చేసి వచ్చారు. కోర్టు బస్‌ స్టాప్‌ వద్ద దిగగానే.. దాచి పెట్టుకొని వచ్చిన కత్తితో కామరాజ్‌.. తన భార్యపై దాడి చేశాడు. దీంతో అతడిని అదుపులోకి తీసుకొని హత్యాయత్నం నేరం కింద కేసు నమోదు చేసినట్టు ఎస్పీ మణి వెల్లడించారు. అదే బస్సు నుంచి దిగిన ఓ పోలీసు, కోర్టు బయట విధులు నిర్వహించే వ్యక్తి అడ్డుకొనేందుకు ప్రయత్నించగా.. ఒకరికి తీవ్రగాయాలైనట్టు పోలీసులు తెలిపారు. మహిళకు చికిత్స కొనసాగుతోందన్నారు. ఈ జంట గత కొన్నేళ్లుగా విడాకుల కోసం పోరాడుతుండగా.. ప్రస్తుతం ఆ కేసు ఆఖరి దశలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని