
Attack on Teacher: విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపణ.. ఉపాధ్యాయుడిపై దాడి
డీఎస్పీని ఆశ్రయించిన ఇరు వర్గాలు
గ్రామీణ గుంటూరు: వట్టిచెరుకూరులోని జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన వివాదం, దాడిపై ఇరు వర్గాలు తమకు న్యాయం చేయాలంటూ గుంటూరులోని కార్యాలయంలో దక్షిణ మండలి డీఎస్పీ ప్రశాంతిని కలిశారు. విద్యార్థిని, ఆమె కుటుంబ సభ్యులు ఘటనకు కారణమైన ఉపాధ్యాయుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. కాగా పాఠశాలలోకి దౌర్జన్యంగా ప్రవేశించి దాడి చేయడంపై ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. రెండు ఫిర్యాదులపై కేసు నమోదు చేసి సమగ్ర విచారణ చేపడతామని డీఎస్పీ ప్రశాంతి వెల్లడించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.