Mother tortured son: చిత్తూరులో కన్నతల్లి కిరాతకం: బిడ్డను హింసించి.. ఆపై వీడియో తీసి..!

చిత్తూరు జిల్లా సోమల మండలం రాంపల్లిలో తులసి అనే మహిళ కన్న బిడ్డతో కిరాతకంగా ప్రవర్తించింది. ఆమె చేతిలో చిత్రహింసకు గురైన చిన్నారి ప్రదీప్ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది..

Published : 30 Aug 2021 01:25 IST

సోమల: చిత్తూరు జిల్లా సోమల మండలం రాంపల్లిలో తులసి అనే మహిళ కన్న బిడ్డపై కిరాతకంగా ప్రవర్తించింది. ఆమె చేతిలో చిత్రహింసలకు గురైన చిన్నారి ప్రదీప్ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు విల్లుపురం జిల్లా వాసి వడివేలన్‌కు చిత్తూరు జిల్లాకు చెందిన తులసితో వివాహం జరిగింది. విభేదాల కారణంగా భర్తకు దూరమైంది. చిత్తూరు జిల్లా అనిపల్లిలో కుమారుడితో కలిసి తన తండ్రి వద్ద ఉంటోంది. అనిపల్లిలో కన్న బిడ్డ ప్రదీప్‌ను చిత్రహింసలకు గురిచేసింది. అంతటితో ఆగకుండా కుమారుడిని హింసిస్తున్న  దృశ్యాలు వీడియో తీసి భర్తకు పంపించింది. వడివేలన్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు తులసిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని