Hyderabad News: మియాపూర్‌లో అదృశ్యమైన బాలిక ఘటన విషాదాంతం

నగరంలోని మియాపూర్‌లో అదృశ్యమైన బాలిక(13నెలలు) ఘటన విషాదాంతమైంది.

Updated : 13 Sep 2021 12:03 IST

హైదరాబాద్‌: నగరంలోని మియాపూర్‌లో అదృశ్యమైన బాలిక(13నెలలు) ఘటన విషాదాంతమైంది. ఇంటి సమీపంలోని నీటి గుంతలో బాలిక మృతదేహాన్ని గుర్తించారు. నిన్న ఉదయం పనులకు వెళ్తూ తల్లిదండ్రులు చిన్నారిని పక్కింట్లో వదిలి వెళ్లారు. బాలికను చూసుకోమని వారికి చెప్పారు. చిన్నారి తల్లిదండ్రులు చెత్త ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పనులకు వెళ్లి వచ్చే సరికి బాలిక కనిపించలేదు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఘటన ప్రమాదవశాత్తూ జరిగిందా? లేక హత్య చేశారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన వివరాల్లో స్పష్టత లేకపోవడంతో వారికి పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి విచారణ జరుపుతున్నారు. గుర్తు తెలియని 12 ఏళ్ల బాలుడు నిన్న సాయంత్రం పాపను తీసుకెళ్లినట్లు వారు పోలీసులకు చెప్పారు. అప్పటి నుంచి బాలుడు కూడా అదృశ్యమైనట్లు సమాచారం.

చిన్నారి మృతిపై అనుమానాలు..

బాలిక నిన్న రాత్రి అదృశ్యమై ఇవాళ ఉదయం విగతజీవిగా మారడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పాప ఆచూకీ లభించినప్పుడు తడిబట్టలతో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. చిన్నారిని నీటిలో ముంచి చంపినట్లు వారు భావిస్తున్నారు. పాప కుటుంబ సభ్యుల్లో ఒకరిపై అనుమానం ఉందని చెబుతున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని