Crime News: దోపిడీ దొంగను పట్టించిన ఇన్స్టాగ్రామ్
చెడు వ్యసనాలకు బానిసైన శివ ఎలాగైనా డబ్బులు సంపాదించాలని మరో యువకుడితో కలిసి దోపిడీలకు తెరలేపాడు. రాత్రి సమయంలో జాతీయ రహదారిపై వెళ్తున్న ప్రయాణికులే లక్ష్యంగా దోపిడీల పరంపర కొనసాగించాడు. ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా బాధితుల కంట పడటంతో ఎట్టకేలకు...
గుంటూరు: చెడు వ్యసనాలకు బానిసైన శివ ఎలాగైనా డబ్బులు సంపాదించాలని మరో యువకుడితో కలిసి దోపిడీలకు తెరలేపాడు. రాత్రి సమయంలో జాతీయ రహదారిపై వెళ్తున్న ప్రయాణికులే లక్ష్యంగా దోపిడీల పరంపర కొనసాగించాడు. ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా బాధితుల కంట పడటంతో ఎట్టకేలకు కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా పెదకాకానిలో జరిగింది. సీఐ సురేశ్బాబు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్కు చెందిన నామాల సతీష్, అతని తండ్రి రామకృష్ణారావు నవంబరు 18న ఫంక్షన్ నిమిత్తం కొలకలూరు గ్రామానికి వచ్చారు. అదే రోజు అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ద్విచక్రవాహనంపై చిలకలూరిపేట నుంచి విజయవాడ బయల్దేరారు. పెదకాకాని మండలం మానససరోవరం దాటిన తర్వాత సర్వీసు రోడ్డు నుంచి హైవేపై ఎక్కుతుండగా వెనుకనుంచి బైక్పై వచ్చిన ఇద్దరు.. సతీష్, అతని తండ్రి ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని తన్నడంతో ఇద్దరూ రోడ్డు మార్జిన్లో పడిపోయారు. నిందితులిద్దరూ వారిని బెదిరించి రూ.4వేల నగదు, మొబైల్ ఫోన్ లాక్కుని పరారయ్యారు.
దోపిడీకి గురైంది తక్కువ మొత్తం కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఇంటికి వెళ్లిపోయారు. అయితే, నాలుగు రోజుల క్రితం ఇన్స్టాగ్రామ్లో దోపిడీ దొంగ ఫొటో రైడర్ శివ అనే అకౌంట్తో కనిపించింది. వారు వాడిన పల్సర్బైక్ ఫొటో కూడా అందులో ఉంది. దీంతో వెంటనే సతీష్ పెదకాకాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇన్స్టా్గ్రామ్ ఖాతా ఆధారంగా పోలీసులు శివ గురించి విచారించారు. అతని స్నేహితుల ద్వారా వివరాలు సేకరించి శివను అరెస్టు చేశారు. అతని బైక్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. గతంలోనూ శివపై చోరీ కేసులున్నట్టు సీఐ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంతర్జాతీయ కోడ్తో వాట్సప్ కాల్స్!
బంజారాహిల్స్ వాసి దినేశ్కు +84 (వియత్నాం) కోడ్తో మొదలయ్యే నంబర్ నుంచి వాట్సప్ వీడియోకాల్ వచ్చింది. అది విదేశీ నంబర్ కావడంతో అనుమానంతో అతను లిఫ్ట్ చేయలేదు. -
ఇద్దరు మావోయిస్టుల లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు శుక్రవారం పోలీసులకు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా కిష్టారం పోలీస్స్టేషన్ పరిధిలోని నెమలిగూడకు చెందిన పొడియం ఇడుమయ్య అలియాస్ హరీశ్, ఉయికే ముత్యాలక్క లు భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ ఎదుట లొంగిపోయినట్లు తన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఏఎస్పీ తెలిపారు. -
‘మృత్యు’ ప్రయాణం!
సెలవులు...శుభకార్యాలు. వెరసి వేసవికాలంలో..ముఖ్యంగా మే నెలలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. జాతీయ రహదారులు, హైవేల మంత్రిత్వశాఖ నివేదిక ప్రకారం 2022 సంవత్సరంలో అత్యధికంగా మే నెలలోనే రోడ్డు ప్రమాదాలు, మరణాలు నమోదయ్యాయి. -
కొట్టేసిన ఫోన్లు సూడాన్కు.. స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు
రాష్ట్రంలో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తున్న, వాటిని కొనుగోలు చేస్తున్న 12 మంది సభ్యులున్న ముఠాను హైదరాబాద్ సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. -
పెళ్లి వేడుకలో అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబంలో ఆరుగురి మృతి
బిహార్లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. దర్భంగా ప్రాంతంలో జరిగిన ఓ వివాహ వేడుకలో మంటలు చెలరేగి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులతో ప్రమాదాలు
ఉమ్మడి అనంతపురం జిల్లాలో శుక్రవారం రెండు వేర్వేరు చోట్ల ఆర్టీసీ బస్సులు ప్రమాదానికి గురయ్యాయి. ఆ రెండు బస్సులూ కాలం చెల్లినవే కావడం గమనార్హం. -
ఆలిన్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం
రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలోని ఆలిన్ ఫార్మసీ కంపెనీలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. -
నీటి బకెట్లో పడి చిన్నారి మృతి
నీటి బకెట్లో పడి ఊపిరాడక 18 నెలల చిన్నారి స్నేహిత మృతిచెందింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలో జరిగింది. -
ఏనుగు దాడిలో మరో ఇద్దరి రైతుల మృతి
కుమురం భీం జిల్లాలో ఇటీవల ఇద్దరిని చంపిన ఏనుగు మహారాష్ట్రలో మరో ఇద్దరిని బలి తీసుకుంది. -
స్టాక్ ట్రేడింగ్లో లాభాలిస్తామని రూ.కోటి కాజేత
సైబర్ వలలో చిక్కుకున్న ఓ విద్యార్థిని రూ.కోటికి పైగా డబ్బు పోగొట్టుకుంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.