Crime news: నీలి చిత్రాలు చూపించిన టీచర్‌పై చర్యలు తీసుకోవాలని ధర్నా

గుంటూరు జిల్లా సత్తెనపల్లి శాలివాహన్‌ నగర్‌ ఉర్దూ పాఠశాలలో విద్యార్థినుల పట్ల ఉపాధ్యాయుడు అనుచితంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.

Published : 25 Oct 2021 01:28 IST

సత్తెనపల్లి: గుంటూరు జిల్లా సత్తెనపల్లి శాలివాహన్‌ నగర్‌ ఉర్దూ పాఠశాలలో విద్యార్థినుల పట్ల ఉపాధ్యాయుడు అనుచితంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.  హుస్సేన్‌ అనే ఉపాధ్యాయుడు కొంతకాలంగా తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, నీలిచిత్రాలు చూపిస్తూ లైంగికదాడి చేస్తున్నారని విద్యార్థినులు తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో విద్యార్థినుల తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. టీచర్‌ హుస్సేన్‌పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం రహదారిపై ధర్నా చేపట్టారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని