రెమిడెసివర్ అక్రమ అమ్మకాల గుట్టురట్టు
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో రెమిడెసివిర్ ఔషధాన్ని అక్రమంగా విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రికి
ఏలూరు నేరవార్తలు: కొవిడ్ రోగులకు ఉపయోగించే రెమిడెసివర్ ఇంజక్షన్లను అక్రమంగా బయట అధిక ధరలకు విక్రయిస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రి ఉద్యోగులు కొందరిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద 13 రెమిడెసివర్ ఇంజక్షన్లను, రూ.40వేల నగదును, మూడు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు టూటౌన్ పోలీసుస్టేషన్ వద్ద బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో స్థానిక డీఎస్పీ దిలీప్ కిరణ్ వివరాలు వెల్లడించారు.
ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న ఇద్దరు స్టాఫ్ నర్సులు, ట్రామాకేర్లో పని చేసే ఓ టెక్నీషియన్ రెమిడెసివర్ ఇంజక్షన్లను పక్కదారి పట్టించి కొంతమందికి విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఈ కేసును ఛేదించేందుకు 3బృందాలు ఏర్పాటు చేసి, అక్రమాలకు పాల్పడుతున్న 10 మందిని అరెస్టు చేసినట్లు చెప్పారు. అరెస్టయిన వారిలో ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్న రాయల వెంకటలక్ష్మి, మరో స్టాఫ్ నర్సు లావణ్య, ట్రామాకేర్ టెక్నీషియన్ బి.రవిబ్రహ్మయ్య, వీరితోపాటు వివిధ మెడికల్ స్టోర్లలో పని చేస్తున్న వారు, మెడికల్ రిప్లుగా పని చేస్తున్నవారు మొత్తం 10 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. కీలక నిందితులు మరో ముగ్గురిని అరెస్టు చేయాల్సి ఉందని చెప్పారు. టూటౌన్ సీఐ ఆదిప్రసాద్, ఎస్సైలు కిశోర్ బాబు, నాగబాబు, సిబ్బంది పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంతర్జాతీయ కోడ్తో వాట్సప్ కాల్స్!
బంజారాహిల్స్ వాసి దినేశ్కు +84 (వియత్నాం) కోడ్తో మొదలయ్యే నంబర్ నుంచి వాట్సప్ వీడియోకాల్ వచ్చింది. అది విదేశీ నంబర్ కావడంతో అనుమానంతో అతను లిఫ్ట్ చేయలేదు. -
ఇద్దరు మావోయిస్టుల లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు శుక్రవారం పోలీసులకు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా కిష్టారం పోలీస్స్టేషన్ పరిధిలోని నెమలిగూడకు చెందిన పొడియం ఇడుమయ్య అలియాస్ హరీశ్, ఉయికే ముత్యాలక్క లు భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ ఎదుట లొంగిపోయినట్లు తన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఏఎస్పీ తెలిపారు. -
‘మృత్యు’ ప్రయాణం!
సెలవులు...శుభకార్యాలు. వెరసి వేసవికాలంలో..ముఖ్యంగా మే నెలలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. జాతీయ రహదారులు, హైవేల మంత్రిత్వశాఖ నివేదిక ప్రకారం 2022 సంవత్సరంలో అత్యధికంగా మే నెలలోనే రోడ్డు ప్రమాదాలు, మరణాలు నమోదయ్యాయి. -
కొట్టేసిన ఫోన్లు సూడాన్కు.. స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు
రాష్ట్రంలో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తున్న, వాటిని కొనుగోలు చేస్తున్న 12 మంది సభ్యులున్న ముఠాను హైదరాబాద్ సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. -
పెళ్లి వేడుకలో అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబంలో ఆరుగురి మృతి
బిహార్లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. దర్భంగా ప్రాంతంలో జరిగిన ఓ వివాహ వేడుకలో మంటలు చెలరేగి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులతో ప్రమాదాలు
ఉమ్మడి అనంతపురం జిల్లాలో శుక్రవారం రెండు వేర్వేరు చోట్ల ఆర్టీసీ బస్సులు ప్రమాదానికి గురయ్యాయి. ఆ రెండు బస్సులూ కాలం చెల్లినవే కావడం గమనార్హం. -
ఆలిన్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం
రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలోని ఆలిన్ ఫార్మసీ కంపెనీలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. -
నీటి బకెట్లో పడి చిన్నారి మృతి
నీటి బకెట్లో పడి ఊపిరాడక 18 నెలల చిన్నారి స్నేహిత మృతిచెందింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలో జరిగింది. -
ఏనుగు దాడిలో మరో ఇద్దరి రైతుల మృతి
కుమురం భీం జిల్లాలో ఇటీవల ఇద్దరిని చంపిన ఏనుగు మహారాష్ట్రలో మరో ఇద్దరిని బలి తీసుకుంది. -
స్టాక్ ట్రేడింగ్లో లాభాలిస్తామని రూ.కోటి కాజేత
సైబర్ వలలో చిక్కుకున్న ఓ విద్యార్థిని రూ.కోటికి పైగా డబ్బు పోగొట్టుకుంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.