Suryapet: ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌ కింద పడి ఇద్దరు మృతి

పొలం దున్నుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌ కింద పడి ఇద్దరు మృతి చెందారు. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డి గూడెం మండలం పర్సాయపల్లిలో ఈ ఘటన జరిగింది.

Updated : 31 Jul 2023 18:03 IST

జాజిరెడ్డిగూడెం: పొలం దున్నుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌ కింద పడి ఇద్దరు మృతి చెందారు. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డి గూడెం మండలం పర్సాయపల్లిలో ఈ ఘటన జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

బొల్లంపల్లి గ్రామానికి చెందిన పసుల రామలింగయ్య (52) పర్సాయపల్లి గ్రామానికి చెందిన భద్రారెడ్డి వద్ద ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన మిడతపల్లి మల్లయ్య (65) పొలాన్ని దున్నేందుకు ఇవాళ రామలింగయ్య వెళ్లారు. పొలం దున్నుతుండగా.. గట్టు మీద ఉన్న మల్లయ్య ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడ్డాడు. ఈ క్రమంలోనే ట్రాక్టర్‌ వీల్‌ ఆయన కాలు పైనుంచి పోవడంతో గుండె ఆగి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో ఉలిక్కిపడి కిందకు దిగుతున్న క్రమంలో.. డ్రైవర్‌ రామలింగయ్య కాలు క్లచ్‌లో ఇరుక్కుపోయి కిందకు వేలాడి తల బురదలో ఇరుక్కుంది. దీంతో ఊపిరాడక రామలింగయ్య కూడా మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని