అందని అనుమతుల రుసుం
జిల్లాలోని పంచాయతీల్లో నూతనంగా ఇంటి నిర్మాణాలు చేసుకునే వారు చెల్లించే డబ్బులు మీ సేవా కేంద్రాల నుంచి పంచాయతీల బ్యాంకు ఖాతాల్లోకి పంపడంలో నిర్లక్ష్యం వహిస్తుండడంతో సర్పంచులు ఆందోళన చెందుతున్నారు.
నంనూరు పంచాయతీ కార్యాలయం
మంచిర్యాల గ్రామీణం, న్యూస్టుడే: జిల్లాలోని పంచాయతీల్లో నూతనంగా ఇంటి నిర్మాణాలు చేసుకునే వారు చెల్లించే డబ్బులు మీ సేవా కేంద్రాల నుంచి పంచాయతీల బ్యాంకు ఖాతాల్లోకి పంపడంలో నిర్లక్ష్యం వహిస్తుండడంతో సర్పంచులు ఆందోళన చెందుతున్నారు. పల్లెల్లో ఇంటిని నిర్మించుకోవాలన్నా.. లేఅవుట్ల కోసం మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులు చేసి డబ్బులు చెల్లిస్తేనే పంచాయతీలు అనుమతులు ఇస్తాయి. ఇలా చెల్లించిన నిధులు నేరుగా రాష్ట్ర ఖజానా కార్యాలయానికి వెళ్తాయి. అక్కడి నుంచి పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ కార్యాలయం ద్వారా జిల్లా పంచాయతీల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ ఏడాదికి పైగా నిలిచిపోవడంతో పంచాయతీలకు డబ్బులు అందడం లేదు. ఆర్థిక సంవత్సరం ముగింపు గడువు సమీపిస్తుండటంతో నిధులు అందక పంచాయతీలు నష్టపోతున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
జిల్లాలోని పంచాయతీల్లో నూతనంగా ఇంటి నిర్మాణం చేసుకునేందుకు తొలుతగా మీసేవా కేంద్రాల ద్వారా పంచాయతీలకు అనుమతుల కోసం దరఖాస్తులు చేసుకోవాలి. దీనికోసం మీసేవా కేంద్రాల్లోనే నిర్దేశిత రుసుం చెల్లించి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. వాటిని పంచాయతీల్లో ఇస్తే నిర్మాణ అనుమతి పత్రాలు అందజేస్తారు. ఈ ప్రక్రియలో మీసేవా కేంద్రాల బ్యాంకు ఖాతాల్లో జమచేసిన నిధులు నేరుగా రాష్ట్ర ఖజానాకు నిర్వాహకులు అందజేస్తారు. దీనికోసం కొంతమేరకు కమీషన్ను వారు పొందుతారు. అనంతరం ఖజానా ఖాతా నుంచి ఆయా పంచాయతీలకు నిర్మాణ రుసుం డబ్బులు పంపిణీ చేస్తారు. ఇందులో ఒక్కో నెలకు సుమారుగా రూ.2 లక్షల మేరకు ఆయా పంచాయతీలు ఆదాయాన్ని ఆర్జిస్తాయి. ఇలా 2021 అక్టోబర్ నాటికి రూ.15 లక్షల మేరకు జిల్లా పంచాయతీ కార్యాలయం ద్వారా ఆయా పంచాయతీల బ్యాంకు ఖాతాలకు మీసేవా కేంద్రాల ద్వారా నిధులు అందజేశారు.. ఆ తరువాత నుంచి ఇంటి నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతుల కోసం చెల్లించిన నిధులు పంచాయతీలకు పంపిణీ చేయడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నిధులు అందితే ట్రాక్టర్ల కిస్తీలు చెల్లించే అవకాశం ఉంటుందని, గ్రామాభివృద్ధికి ఊతమిచ్చినట్లవుతుందని పలువురు సర్పంచులు కోరుతున్నారు. ఈఏడాది మరో రూ.15 లక్షలు చెల్లించనున్నట్లు ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ఇంతవరకు నిధుల పంపిణీ పూర్తి కాకపోవడంతో సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి వెంటనే నిధులు మంజూరు చేయాలని కోరుతున్నారు.
జిల్లాలోని పంచాయతీలు, నష్టపోయిన నిర్మాణ రుసుం వివరాలు...
జిల్లాలోని పంచాయతీలు : 311
2021 నవంబరు నుంచి పంచాయతీలకు జమ చేయాల్సిన అనుమతుల రుసుంలు: రూ. 30 లక్షలు (సుమారుగా)
ఒక్కో నెలకు జమవుతున్న నిధులు: రూ. 2 లక్షలు (సుమారుగా) 2021 అక్టోబరు వరకు పంచాయతీలకు చెల్లించిన నిధులు : రూ. 15 లక్షలు
మంజూరైన వెంటనే పంచాయతీలకు చెల్లిస్తాం
- ఫణీందర్రావు, జిల్లా పంచాయతీ అధికారి, మంచిర్యాల.
ఏడాది కాలంగా నిధులు పంపిణీ కావడం లేదు. రాష్ట్ర కమిషనర్ కార్యాలయం నుంచి రూ.15 లక్షల చెల్లించనున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి. నిధులు మంజూరైన వెంటనే చలాన్ల ద్వారా ఆయా పంచాయతీలకు చెల్లిస్తాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిధుల పంపిణీ ప్రక్రియ కొనసాగుతుంది. దీనికోసం ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నగేష్ నామినేషన్పై గందరగోళం
[ 27-04-2024]
ఆదిలాబాద్ లోక్సభ స్థానం కోసం దాఖలైన భాజపా అభ్యర్థి గోడం నగేష్ నామపత్రాల పరిశీలనలో గందరగోళం నెలకొంది. -
నీళ్లు లేవు..నీడ లేదు..
[ 27-04-2024]
జిల్లాలో మారుమూల ప్రాంతవాసులకు సరకుల కొనుగోలుకు వారసంతలే దిక్కు. చిన్నా, చితక కుటుంబాలెన్నో వీటిపైనే ఆధారపడి జీవనోపాధి పొందుతున్నాయి. -
బ్యాటింగ్ చేస్తా.. ఓట్లు పట్టేస్తా!
[ 27-04-2024]
జిల్లా కేంద్రంలోని గాంధీపార్కు, ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో శుక్రవారం భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ తమ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
కాంగ్రెస్తోనే అన్ని వర్గాల అభివృద్ధి
[ 27-04-2024]
అన్ని వర్గాల అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అత్రం సుగుణ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
చిన్నారుల ప్రతిభ.. ఆకాశవాణి వేదిక
[ 27-04-2024]
పిల్లలు.. మీలో సహజంగానే ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది కదూ.. కానీ అది ప్రదర్శించడానికి వేదిక కావాలి.. అయితే మీలోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం అవకాశాన్ని కల్పిస్తోంది. -
నెట్టింట్లో నేతలు
[ 27-04-2024]
ఎన్నికల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు సాదాసీదాగా సాగే ప్రచారం డిజిటల్ యుగం అందుబాటులోకి వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోయింది. -
ఎండ వే‘ఢీ’.. చిక్కని ఓటరు నాడీ
[ 27-04-2024]
ఈసారి బరిలో నిలిచిన అభ్యర్థులకు లోక్సభ ఎన్నికలు రోజులు గడుస్తున్న కొద్దీ చెమటలు కక్కిస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతూ వస్తున్న ఎండ తీవ్రత ఒకవైపు, -
పోయిన ఫోను.. దొరుకుతున్నతీరు
[ 27-04-2024]
ఎవరైనా తమ చరవాణిని పోగొట్టుకున్నా, చోరీ అయినా ఇంతకు ముందు దానిపై ఆశలు వదులుకోవాల్సి వచ్చేది. ప్రస్తుతం తమ చరవాణి పోగొట్టుకున్నా, చోరీ అయినా మీసేవా కేంద్రం ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేస్తే సరిపోతుంది. -
ఆస్ట్రేలియా అతిథి!
[ 27-04-2024]
మనదేశ సంప్రదాయాలు, సంస్కృతి.. ఇలా ప్రతీ అంశం విదేశీయులకే కాస్త ఆసక్తే. అందుకే.. ఇక్కడి పద్ధతులను ప్రత్యక్షంగా చూసేందుకు, అందులో భాగమయ్యేందుకు చాలామంది ఉత్సుకత చూపిస్తుంటారు. -
వెండి తెరపై మెరుపులు
[ 27-04-2024]
సినిమాలో అవకాశాలు రావడం చాలా అరుదు. మక్కువ ఉన్నా.. దానిని సాకారం చేసుకునేందుకు ఎంతో కష్టపడుతుంటారు. -
13 ఆమోదం.. 10 తిరస్కరణ
[ 27-04-2024]
ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి ఆయా పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు దాఖలు చేసిన నామపత్రాలను శుక్రవారం ఆదిలాబాద్ కలెక్టరేట్లో పరిశీలించారు. -
తేలిన లెక్క
[ 27-04-2024]
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఓటరు తుది జాబితాను ఎన్నికల సంఘం తాజాగా ప్రకటించింది. ఈ మేరకు శాసనసభ నియోజకవర్గాల వారిగా ఓటర్ల వివరాలు వెల్లడించారు. -
అడుగడుగునా కోడ్ గండం
[ 27-04-2024]
గడిచిన జులై 28న కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా తెగిపోయిన సిరాల ప్రాజెక్టు పునరుద్ధరణ పనులకు ఆది నుంచి అవరోధాలు ఎదురవుతున్నాయి. -
దారుంది.. భయపెడుతోంది..!
[ 27-04-2024]
అదేంటది.. దారి భయపెట్టడమేంటని విస్తుపోతున్నారా! మీరు చదివింది నిజమే. అదీ జిల్లా కేంద్రంలోనే. పైగా జిల్లా ప్రధాన ఆసుపత్రి(ఇప్పుడు బోధనాసుపత్రి కూడా) పరిస్థితి ఇది. -
ఇంటర్ విద్య..వీరికి మిథ్య
[ 27-04-2024]
జిల్లాలోని మారుమూల మండలాలు భీమిని, కన్నెపల్లి, నెన్నెల. ఇక్కడ పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఇంటర్ చదవాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.