నీళ్లు లేవు..నీడ లేదు..
జిల్లాలో మారుమూల ప్రాంతవాసులకు సరకుల కొనుగోలుకు వారసంతలే దిక్కు. చిన్నా, చితక కుటుంబాలెన్నో వీటిపైనే ఆధారపడి జీవనోపాధి పొందుతున్నాయి.
సంతల్లో చిరువ్యాపారులు.. కొనుగోలుదార్లకు తీవ్ర ఇక్కట్లు
న్యూస్టుడే, ఇచ్చోడ, బోథ్: జిల్లాలో మారుమూల ప్రాంతవాసులకు సరకుల కొనుగోలుకు వారసంతలే దిక్కు. చిన్నా, చితక కుటుంబాలెన్నో వీటిపైనే ఆధారపడి జీవనోపాధి పొందుతున్నాయి. వారం రోజులకు సరిపడా అన్ని రకాల కూరగాయలు, వస్తువులను ఇక్కడ కొనుగోలు చేసి గ్రామస్థులు తీసుకెళ్తారు. ప్రస్తుతం ఎండలు ముదిరాయి. అక్కడ కనీస సౌకర్యాలు కల్పించలేదు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కనీసం తాగునీరు, మూత్రశాలలు లేకపోవడం సమస్యలకు నిలయంగా మారింది. ఈ సంతల ద్వారా పంచాయతీలకు నిధులు వస్తున్నా పట్టించుకోకపోవడం పరిపాటిగా మారింది. జిల్లాలో దాదాపుగా 20కి పైగా సంతలు నిర్వహిస్తారు.
మహారాష్ట్ర వాసులకు ఇదే దిక్కు
ఇది సొనాలలో నిర్వహించే వారసంత. ఇక్కడికి సొనాల చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు మహారాష్ట్రకు చెందిన అనేక గ్రామాల నుంచి ప్రజలు వారసంతకు తరలివస్తుంటారు. రూ.లక్షల్లో ఆదాయం పంచాయతీకి వస్తున్నా ఇప్పటి వరకు కనీసం తాగు నీటి సౌకర్యం కల్పించిన పరిస్థితి లేదు. మరోవైపు అత్యవసరమైన మరుగుదొడ్లు, మూత్రశాలలు లేవు. తప్పని పరిస్థితుల్లో సంతకు వచ్చిన వ్యాపారులు, ప్రజలు స్థానికంగా ఉన్న ఇళ్ల నుంచి నీటిని పొందడంతో పాటు వారి మరుగుదొడ్లను వినియోగించుకుంటున్నారు.
కనీస సౌకర్యాలు కరవే
ఇది సిరికొండ మండల కేంద్రంలోని వారసంత. ఇక్కడికి దాదాపుగా 30కి పైగా గ్రామాల ప్రజలు వస్తుంటారు. ఈ సంతతో పంచాయతీకి ఆదాయం వస్తున్నా కనీస సౌకర్యాలు కల్పించలేదు. దూరప్రాంతల నుంచి వచ్చే వారు స్థానికంగా ఉన్న హోటళ్లలో నీటిని తాగాల్సిందే. మరుగుదొడ్లు, మూత్రశాలలు లేక అత్యవసరంలో వారు పడే వేదన వర్ణనాతీతం. సంతకు వచ్చే మహిళా వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు.
30 గ్రామాలకు ఆధారం
ఇది బోథ్ మండల కేంద్రంలోని వారసంత. 30 గ్రామాల ప్రజలు ఈ సంతకు వస్తుంటారు. సంత ద్వారా ఆదాయం పంచాయతీకి వస్తున్నా కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. సౌకర్యాలు కల్పించేలా చూడాలని ప్రజలు, వ్యాపారులు కోరుతున్నారు. సంతల్లో సమస్యలు పరిష్కరించాలని ఇటీవల మండల కేంద్రానికి పలువురు సామాజిక కార్యకర్తలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాయ లేడి
[ 08-05-2024]
ఆమె ఓ మహిళ. భర్త వ్యాపారం చూస్తూనే అందరితో కలివిడిగా ఉంటూ మాటలు కలిపేది. ఈ క్రమంలో ఏర్పడిన పరిచయాలను సొమ్ము చేసుకోవాలనుకుంది. విద్యార్హత ఆధారంగా ఉద్యోగాలిప్పిస్తానంటూ నమ్మబలికింది. -
పెద్దపల్లి పోరు.. తండ్రీకొడుకులపై పోటీ
[ 08-05-2024]
పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం 1962లో ఏర్పడగా 62 ఏళ్లుగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఇద్దరు వ్యక్తులు(వి.తులసీరాం, గడ్డం వెంకటస్వామి) రెండు, అంతకంటే ఎక్కువసార్లు విజయం సాధించారు. -
దారి తప్పిన బాల్యం..
[ 08-05-2024]
ఆదిలాబాద్ పట్టణంలో కొందరు బాలలు ముఠాగా ఏర్పడి రాత్రయిందంటే చోరీలకు తెగబడటం పట్టణవాసులకు సమస్యగా మారింది. రహదారి పక్కన, మైదానాల్లో ఆశ్రయాలు ఏర్పాటు చేసుకొని జీవించే కుటుంబాలకు చెందిన కొందరు పగటి పూట రెక్కీ నిర్వహించి రాత్రి లేదా తెల్లవారుజామున అవకాశం చూసుకొని చోరీలకు పాల్పడటం సర్వసాధారణంగా మారింది. -
విద్యుత్తు ఉపకేంద్రాల్లో సౌర యూనిట్లు
[ 08-05-2024]
విద్యుత్తు అవసరాలు రోజురోజుకు పెరుగుతుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సౌరప్లాంట్ల ఏర్పాటుపై దృష్టి సారించాయి. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలపై సౌర యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాయి. -
ఓటు వేసేదెలా?
[ 08-05-2024]
ఒకవైపు ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని ఇంటింటికి వెళ్లి కదల్లేని వయోవృద్ధులు, దివ్యాంగులకు అవకాశం కల్పిస్తున్న అధికార యంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లలో కీలక భూమిక పోషిస్తున్న పంచాయతీ కార్యదర్శుల విషయంలో నిర్లక్ష్యం చేస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
సమున్నత లక్ష్యం.. శతశాతం ఓటింగ్తోనే పదిలం
[ 08-05-2024]
ఓటు.. ప్రజాస్వామ్య పరిరక్షణకు బలమైన పునాది. వజ్రాయుధంతో సమానమైన ఓటు హక్కు సద్వినియోగం చేసుకుంటేనే సార్థకత చేకూరుతుంది. అర్హులైన ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదు చేయించుకోవడంతో పాటు శత శాతం పోలింగ్ నమోదుకు ఎన్నికల సంఘం, వివిధ స్థాయిలో అధికార యంత్రాంగం కార్యక్రమాలు చేపడుతోంది. -
రహదారులకు ప్రాధాన్యం.. ఆరోగ్య భాగ్యం
[ 08-05-2024]
‘‘నా రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం లాంటిది. ప్రజాసంక్షేమం కోసం పని చేయాలనేది నా ఆశయం. ప్రగతి నా లక్ష్యం. వివాదాలు, విభేదాలు నా విధానం కాదు. ఈ అంశాలే నన్ను ఎంపీగా గెలిపిస్తాయనే నమ్మకం నాకు ఉంది.’’ -
ఆయన ఎన్నికల ఖర్చు రూ.500
[ 08-05-2024]
ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని ప్రతి ఒక్కరికి తెలుసు. వార్డు సభ్యుడు మొదలు ఏ ఎన్నిక జరిగినా డబ్బులు కుమ్మరించాల్సిందే. ఇక అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఖర్చులు తడిసిమోపెడవుతాయి. -
సెలవులొచ్చాయి.. యువ ఓటర్లు వస్తున్నారు
[ 08-05-2024]
సాధారణంగా చాలా సందర్భాల్లో ఎన్నికలప్పుడు వివిధ ప్రాంతాల్లో చదువుకునే యువ ఓటర్లు సొంతూరులో ఉండరు. ఒక వేళ ఓటు వేసేందుకు వద్దామనుకున్నా సెలవులు అంతగా ఉండవు. -
రక్త పిశాచి... చొరవ చూపితేనే విముక్తి
[ 08-05-2024]
తలసీమియా.. ఈ రక్తపిశాచితో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వ్యాధిగ్రస్థులు యాతన పడుతున్నారు. రోజూ మనిషి ఆహారాన్ని ఎలా కోరుకుంటాడో.. ఈ మహమ్మారి పక్షంరోజులకు ఒకసారి ఆయా బాధితుల రక్తం స్వీకరించేందుకు ఉవ్విళ్లూరుతుంటుంది. -
పోలింగ్ కేంద్రం దూరం.. అసౌకర్యాల భారం..
[ 08-05-2024]
మరో ఆరు రోజుల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అనేక అవస్థల మధ్య ఓట్లేసిన జిల్లావాసులకు మళ్లీ అసౌకర్యాలే ఎదురుకానున్నాయి. చాలా చోట్ల హడావుడిగా పనులను చేస్తున్నా.. -
భారీ వర్షం.. కాస్త ఉపశమనం!
[ 08-05-2024]
తీవ్రమైన ఎండలు, వేసవి తాపం, ఉక్కపోతతో కొన్నిరోజులుగా అల్లాడుతున్న జిల్లావాసులకు కాస్త ఉపశమనం కలిగించింది. జిల్లావ్యాప్తంగా మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. -
విరమణపై పెదవి విరుపు
[ 08-05-2024]
అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు పదవీ విరమణ ప్రయోజనాలు (బెనిఫిట్స్) అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 65ఏళ్లు నిండిన టీచర్కు రూ.లక్ష, సహాయకులకు రూ.50వేలు సహాయం ఇచ్చేందుకు సన్నద్ధమవుతోంది. -
ఎండ మాయం.. వానతో అపారనష్టం
[ 08-05-2024]
జిల్లా వ్యాప్తంగా మంగళవారం మధ్యాహ్నం వరకు ఎండ నిప్పుల కొలిమిని తలపించినప్పటికీ రెండు గంటల తర్వాత వాతావరణం మారిపోయి. ఒక్కసారిగా ఈదురుగాలులు ప్రారంభమయ్యాయి. -
సామాజిక సమీక‘రణం’
[ 08-05-2024]
ఎన్నికల బరిలో నిలిచిన ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి ప్రత్యర్థి సామాజిక వర్గానికి చెందిన ఓట్లపై గురిపెట్టారు. గతకొన్ని రోజుల వరుసగా ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులను పార్టీలోకి చేర్పించుకుంటున్నారు. -
శిశువులపై చిన్నచూపు..
[ 08-05-2024]
ఎస్ఎన్సీయూ (స్పెషల్ న్యూబార్న్ కేర్ యూనిట్) సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి పర్యవేక్షణలో కొనసాగే నవజాత శిశువు సంరక్షణ కేంద్రం సదుపాయాలు కరవై, వైద్యులు అందుబాటులో లేక అవస్థలు పడుతోంది. -
మెజార్టీయే లక్ష్యం
[ 08-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచార గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఆయా రాజకీయ పార్టీల ఎత్తుకు పైఎత్తులతో వ్యూహాలకు పదును పెడుతున్నారు. ప్రచారానికి నాలుగు రోజులే మిగిలి ఉండటంతో మెజార్టీయే లక్ష్యంగా లెక్కలు వేసుకుంటూ ఓటర్లకు గాలం వేస్తున్నారు. -
ఏటా ఇదే తంతు..
[ 08-05-2024]
కాకతీయ.. ఉన్నత విద్యాప్రమాణాల్లో న్యాక్ ఏ ప్లస్ గ్రేడ్ పొందిన విశ్వవిద్యాలయం. కానీ కొన్నేళ్లుగా తన పనితీరుతో అభాసుపాలవుతోంది. విద్యార్థుల భవితవ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, ‘వ్యక్తిగత ప్రయోజనాల’కు ప్రాధాన్యమిస్తూ కొందరు అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు దీని చరిత్రను మసకబారుస్తున్నాయి.