logo

కాంగ్రెస్‌తోనే అన్ని వర్గాల అభివృద్ధి

అన్ని వర్గాల అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమని కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థి అత్రం సుగుణ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Published : 27 Apr 2024 02:27 IST

గుడిహత్నూర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి అత్రం సుగుణ

గుడిహత్నూర్‌, న్యూస్‌టుడే : అన్ని వర్గాల అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమని కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థి అత్రం సుగుణ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీ పథకాల అమలుకు కట్టుబడి ఉందని చెప్పారు. ఆదిలాబాద్‌ లోక్‌ సభ ఎన్నికల్లో మహిళకు తొలిసారిగా కాంగ్రెస్‌ పార్టీ అవకాశం కల్పించిందని, తనను గెలిపిస్తే జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని తెలిపారు. నాయకులు అడే గజేందర్‌, కరుణాకర్‌, అంకతి రవి, నాగ్‌నాథ్‌, అడే శీల, మహేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని