కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ..
అనూహ్య మలుపులు తిరిగిన ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిత్వం ఎట్టకేలకు ఆత్రం సుగుణకే ఖరారైంది. ఉట్నూరుకు చెందిన టీచర్, మానవ హక్కుల వేదిక జిల్లా కార్యదర్శిగా పని చేస్తున్న సుగుణ పేరును ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ) ఆమోదించింది.
ఉత్కంఠకు తెరదించిన కాంగ్రెస్
ఈటీవీ - ఆదిలాబాద్
ఎమ్మెల్యే బొజ్జును కలిసిన ఆత్రం సుగుణ దంపతులు
అనూహ్య మలుపులు తిరిగిన ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిత్వం ఎట్టకేలకు ఆత్రం సుగుణకే ఖరారైంది. ఉట్నూరుకు చెందిన టీచర్, మానవ హక్కుల వేదిక జిల్లా కార్యదర్శిగా పని చేస్తున్న సుగుణ పేరును ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ) ఆమోదించింది. బుధవారం రాత్రి ఈమేరకు కాంగ్రెస్ జాబితా విడుదల చేసింది. మరో 13 ఏళ్ల పాటు సర్వీసు ఉండగానే ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తికి ఈ నెల 12న రాజీనామా చేసిన ఆమె 13న కాంగ్రెస్లో చేరారు. అంతకంటే ముందు నుంచే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ) పరిశీలనలో ఉన్న ఆమె అభ్యర్థిత్వంపై ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ)లో ఏకాభిప్రాయం కుదరడంతో పార్టీ ప్రకటించిన జాబితాలో ఆమెకు స్థానం లభించింది.
కలిసొచ్చిన అంశాలు..
భర్త పిల్లలు సహా సుగుణ కూడా వామపక్ష భావజాలాన్ని కలిగి ఉన్నారు. తెలంగాణ మలి ఉద్యమంతోపాటు ఉపాధ్యాయ, ఆదివాసీ ఉద్యమాల్లో క్రియాశీలకంగా పని చేయడం, జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా నియమితులైన సీతక్కతో సన్నిహిత సంబంధాలు కలిసి వచ్చాయి.
ఎన్నో మలుపులు..
ఎంపీ అభ్యర్థి ఎంపిక విషయం కాంగ్రెస్లో ఎన్నో మలుపులు తిరిగింది. ఓ దశలో సీఎంవో నుంచి ఆదిలాబాద్ రిమ్స్ ప్రొఫెసర్ డా.సుమలత పేరు తెరపైకి వచ్చింది. అంతకుముందు ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్, శాసనసభ ఎన్నికల ముందు టికెట్ ఇస్తామని ఏఐసీసీ నేతల నుంచి హామీ పొందిన ఏఐసీసీ సభ్యుడు నరేష్ జాదవ్ పేరును సైతం సీఈసీ పరిశీలించింది. చివరి నిమిషంలో సుగుణ అభ్యర్థిత్వం తెరపైకి వచ్చింది. ఆమెతోపాటు ఉట్నూరు ఐటీడీఏ ఏపీవో అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న పీజీ హెచ్ఎం పదవికి రాజీనామా చేసిన ఆత్రం భాస్కర్ సైతం కాంగ్రెస్లో చేరడం మరోసారి ఉత్కంఠకు తెరలేపింది. చివరకు సుగుణకు అవకాశం దక్కింది.
బయోడేటా
పేరు : ఆత్రం సుగుణ
కులం : ఆదివాసీ, గోండ్
వృత్తి : ఉట్నూర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా పని చేశారు. మరో 13 ఏళ్ల సర్వీసు ఉండగానే రాజకీయాలపై ఆసక్తితో ఈ నెల 12న ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేశారు.
బాధ్యతలు : ఆదివాసీ మహిళా ఆర్గనైజేషన్ రాష్ట్ర కార్యదర్శిగా పని చేస్తున్నారు. తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్(టీపీటీఎఫ్) సహాయ కార్యదర్శిగా ఉన్నారు. మానవ హక్కుల వేదిక జిల్లా కార్యదర్శిగా పని చేస్తున్నారు. అరుణోదయ కల్చరల్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా కో-కన్వీనర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
భర్త : ఆత్రం భుజంగరావ్, ప్రభుత్వ ఉపాధ్యాయులు, పిట్టబొంగరం ఆశ్రమ పాఠశాలలో పని చేస్తున్నారు. మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
పిల్లలు : ఇద్దరు సంతానం(పెద్దకొడుకు ఆత్రం విప్లవ్, ఎంబీబీఎస్, చిన్న కొడుకు సాయుధ బీటెక్ చదువుతున్నారు.)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నగేష్ నామినేషన్పై గందరగోళం
[ 27-04-2024]
ఆదిలాబాద్ లోక్సభ స్థానం కోసం దాఖలైన భాజపా అభ్యర్థి గోడం నగేష్ నామపత్రాల పరిశీలనలో గందరగోళం నెలకొంది. -
నీళ్లు లేవు..నీడ లేదు..
[ 27-04-2024]
జిల్లాలో మారుమూల ప్రాంతవాసులకు సరకుల కొనుగోలుకు వారసంతలే దిక్కు. చిన్నా, చితక కుటుంబాలెన్నో వీటిపైనే ఆధారపడి జీవనోపాధి పొందుతున్నాయి. -
బ్యాటింగ్ చేస్తా.. ఓట్లు పట్టేస్తా!
[ 27-04-2024]
జిల్లా కేంద్రంలోని గాంధీపార్కు, ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో శుక్రవారం భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ తమ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
కాంగ్రెస్తోనే అన్ని వర్గాల అభివృద్ధి
[ 27-04-2024]
అన్ని వర్గాల అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అత్రం సుగుణ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
చిన్నారుల ప్రతిభ.. ఆకాశవాణి వేదిక
[ 27-04-2024]
పిల్లలు.. మీలో సహజంగానే ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది కదూ.. కానీ అది ప్రదర్శించడానికి వేదిక కావాలి.. అయితే మీలోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం అవకాశాన్ని కల్పిస్తోంది. -
నెట్టింట్లో నేతలు
[ 27-04-2024]
ఎన్నికల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు సాదాసీదాగా సాగే ప్రచారం డిజిటల్ యుగం అందుబాటులోకి వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోయింది. -
ఎండ వే‘ఢీ’.. చిక్కని ఓటరు నాడీ
[ 27-04-2024]
ఈసారి బరిలో నిలిచిన అభ్యర్థులకు లోక్సభ ఎన్నికలు రోజులు గడుస్తున్న కొద్దీ చెమటలు కక్కిస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతూ వస్తున్న ఎండ తీవ్రత ఒకవైపు, -
పోయిన ఫోను.. దొరుకుతున్నతీరు
[ 27-04-2024]
ఎవరైనా తమ చరవాణిని పోగొట్టుకున్నా, చోరీ అయినా ఇంతకు ముందు దానిపై ఆశలు వదులుకోవాల్సి వచ్చేది. ప్రస్తుతం తమ చరవాణి పోగొట్టుకున్నా, చోరీ అయినా మీసేవా కేంద్రం ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేస్తే సరిపోతుంది. -
ఆస్ట్రేలియా అతిథి!
[ 27-04-2024]
మనదేశ సంప్రదాయాలు, సంస్కృతి.. ఇలా ప్రతీ అంశం విదేశీయులకే కాస్త ఆసక్తే. అందుకే.. ఇక్కడి పద్ధతులను ప్రత్యక్షంగా చూసేందుకు, అందులో భాగమయ్యేందుకు చాలామంది ఉత్సుకత చూపిస్తుంటారు. -
వెండి తెరపై మెరుపులు
[ 27-04-2024]
సినిమాలో అవకాశాలు రావడం చాలా అరుదు. మక్కువ ఉన్నా.. దానిని సాకారం చేసుకునేందుకు ఎంతో కష్టపడుతుంటారు. -
13 ఆమోదం.. 10 తిరస్కరణ
[ 27-04-2024]
ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి ఆయా పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు దాఖలు చేసిన నామపత్రాలను శుక్రవారం ఆదిలాబాద్ కలెక్టరేట్లో పరిశీలించారు. -
తేలిన లెక్క
[ 27-04-2024]
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఓటరు తుది జాబితాను ఎన్నికల సంఘం తాజాగా ప్రకటించింది. ఈ మేరకు శాసనసభ నియోజకవర్గాల వారిగా ఓటర్ల వివరాలు వెల్లడించారు. -
అడుగడుగునా కోడ్ గండం
[ 27-04-2024]
గడిచిన జులై 28న కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా తెగిపోయిన సిరాల ప్రాజెక్టు పునరుద్ధరణ పనులకు ఆది నుంచి అవరోధాలు ఎదురవుతున్నాయి. -
దారుంది.. భయపెడుతోంది..!
[ 27-04-2024]
అదేంటది.. దారి భయపెట్టడమేంటని విస్తుపోతున్నారా! మీరు చదివింది నిజమే. అదీ జిల్లా కేంద్రంలోనే. పైగా జిల్లా ప్రధాన ఆసుపత్రి(ఇప్పుడు బోధనాసుపత్రి కూడా) పరిస్థితి ఇది. -
ఇంటర్ విద్య..వీరికి మిథ్య
[ 27-04-2024]
జిల్లాలోని మారుమూల మండలాలు భీమిని, కన్నెపల్లి, నెన్నెల. ఇక్కడ పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఇంటర్ చదవాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!