ప్రచారానికి వడదెబ్బ
ఎండలు మండిపోతున్నాయి. భరించలేనంత ఉక్కపోత.. కాలు బయట పెడితే భగ్గుమంటోంది.. కానీ వెళ్లక తప్పదు. ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికలు మే 13న ఉండటంతో అభ్యర్థులతో పాటు నాయకులు, ఆయా పార్టీల కార్యకర్తలు ఓట్లను రాబటుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
ఓట్ల కోసం నేతల తిప్పలు
న్యూస్టుడే, రాంనగర్
ఎండలు మండిపోతున్నాయి. భరించలేనంత ఉక్కపోత.. కాలు బయట పెడితే భగ్గుమంటోంది.. కానీ వెళ్లక తప్పదు. ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికలు మే 13న ఉండటంతో అభ్యర్థులతో పాటు నాయకులు, ఆయా పార్టీల కార్యకర్తలు ఓట్లను రాబటుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సమయం ఎక్కువగా లేకపోవడంతో ఎండలు దంచికొడుతున్నా.. అవసరమైన జాగ్రత్తలతో ప్రచారానికి వెళ్తున్నారు. ఎక్కువ సేపు ఎండలో తిరగడం వల్ల ఇప్పటికే బోథ్ శాసనసభ్యుడు అనిల్జాదవ్, బోథ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి అడ గజేందర్కు వడదెబ్బ తగలడంతో కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. సోమవారం ప్రచారంలో భాగంగా మంత్రి సీతక్క ఎండకు అలసిపోయి కాసేపు అలాగే కూర్చుండిపోయారు. ఇలాగే ఆయా పార్టీలకు చెందిన కొంత మంది కార్యకర్తలకు సైతం వడదెబ్బ తగలడంతో ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. ఒక వైపు ప్రచారానికి ఎక్కువ సమయం లేదు. మరో వైపు ఎండలు.. తెల్లవారగానే గ్రామాలకు వెళితే కూలీలు ఉపాధి హామీకి వెళితే.. రైతులు పొలం పనులకు వెళ్తున్నారు. ఆలస్యంగా వెళదామంటే ఎండ వేడిమి బెంబేలెత్తిస్తోంది. రోడ్ షోలు చేయలేక, ఇంటింటికీ తిరగలేక, నేతలు ముప్పుతిప్పలు పడుతున్నారు.
వడదెబ్బ తగిలిన కాంగ్రెస్ నాయకుడు గజేందర్
నామినేషన్ల ఘట్టం పూర్తి కావడంతో పార్టీలు ప్రచారాన్ని ఉద్ధృతం చేశాయి. అయితే వారం రోజులుగా ఎండల తీవ్రత కారణంగా పూర్తిస్థాయిలో ప్రచారం చేయలేకపోతున్నారు. తెల్లవారుజామున బయలుదేరి గ్రామాలకు వెళ్లే సరికి కూలీలు ఉపాధి పనులకు వెళుతున్నారు. గ్రామంలో కొంత మందిని కలిసేలోగా ఎండ తీవ్రత పెరగడంతో మరో గ్రామానికి వెళ్ల లేకపోతున్నారు. తిరిగి సాయంత్రం ఆరు గంటల తరువాత గ్రామాలకు వెళ్లాల్సి వస్తోంది. అప్పటికే అలసిపోయి ఇళ్లకు చేరుకున్న గ్రామీణులు నేతలను కలిసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధి ఎక్కువగా ఉండటంతో గ్రామాలను చుట్టి రావడం కష్టంగా మారింది. బడా నేతలు ఒకటి, రెండు రోజులతోనే ప్రచారాన్ని సరిపెట్టుకున్నారు. వామ్మో.. ఈ ఎండలకు రోడ్ షోలు పెట్టకండి. ఏ గ్రామంలోనైనా తప్పని సరి అంటే తెల్లవారుజామున వస్తామని చెబుతున్నారు. ఇక ఆడవాళ్లయితే.. ఇంట్లో కూర్చొనేవాళ్లం.. పదవులని చెప్పి ఎండల్లో తిప్పుతున్నారని మండిపడుతున్నారు. ఏది ఏమైనా ప్రచారానికి ఎక్కువ సమయం లేకపోవడం, అందులో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో వెళ్లామా.. వచ్చామా.. అన్నట్లుగా పార్లమెంట్ ఎన్నికల ప్రచారం సాగుతోంది.
ఉక్కిరిబిక్కిరి..
జిల్లాలో వారం రోజులుగా ఎండలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జిల్లాల వారీగా 44 డిగ్రీలకు ఉష్ణోగ్రత చేరుకోవడంతో క్షణం పాటు బయట తిరగలేని పరిస్థితి ఉంది. ప్రచారానికి వెళ్లే వారి పరిస్థితి భిన్నంగా ఉంది. కారులో ఉన్నంత సేపు ఏసీ వేసుకొని వెళ్తున్నారు. గ్రామం వచ్చిందంటే కారు దిగి ఓటర్లను కలవాలంటే ఎండలోనే వెళ్లాల్సి వస్తోంది. ఇటు ఏసీ.. అటు ఎండలతో నేతలు పరేషాన్ అవుతున్నారు. జిల్లా సగటు ఉష్ణోగ్రత 42.8 డిగ్రీలు కాగా జిల్లాల వారీగా ఇంకా ఎక్కువే ఉంది.
ఎండల కారణంగా రాత్రి వేళ గ్రామస్థులతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుగుణ
చికిత్స పొందుతున్న బోథ్ శాసనసభ్యుడు అనిల్జాదవ్
ఎండల కారణంగా ఉదయం వేళ ఉపాధిహామీ పని చేస్తున్న కూలీలతో భాజపా అభ్యర్థి గోడం నగేష్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమీకృత మార్కెట్ ఎప్పటికి పూర్తయ్యేనో?
[ 22-05-2024]
జిల్లా కేంద్రంలో సమీకృత మార్కెట్ నిర్మాణ పనులు ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన పనులకు పూర్తిస్తాయిలో నిధులు విడుదల కాలేదు. -
ఏకరూపంపై ఎన్నో అనుమానాలు
[ 22-05-2024]
-
అటు మనుషుల ప్రాణాలు.. ఇటు పులుల మరణాలు!
[ 22-05-2024]
తెలంగాణ సరిహద్దున ఉన్న మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా పులులకు ప్రసిద్ధిగాంచింది. ఇక్కడి తడోబా అభయారణ్యాలలో వ్యాఘ్రాలు యథేచ్ఛగా సంచరిస్తుంటాయి. ఈక్రమంలో అవి తరచూ అటవీ సమీప జనావాసాల్లోకి వచ్చి మనుషులు, పశువులపై దాడిచేస్తుండగా.. ఇటు వేటగాళ్లు వాటిని హతమారుస్తున్నారు. దీంతో చంద్రపూర్ జిల్లాలో ఆందోళన నెలకొంది. -
నచ్చి.. మెచ్చి.. అభిమానించి..!
[ 22-05-2024]
ప్రపంచదేశాల్లో భారతదేశానికి ఉన్న ప్రాధాన్యం అంతాఇంతా కాదు. ఇక్కడి ఆచార వ్యవహారాలు, సంస్కృతి- సంప్రదాయాలు విదేశీయులకు ఎప్పటికీ ప్రత్యేకమే. ఆకర్షణీయమే. మన ప్రాంతంలో ఉండే కుటుంబ బంధాలు, ఆధ్యాత్మిక చింతన, కట్టుబొట్టు, వేషధారణ, బంధాలు-అనుబంధాలు.. ఇలా ఒకటేమిటి ప్రతీ విషయమూ వారిని ఆకట్టుకుంటోంది. -
మనోబలం.. విజయ పథం
[ 22-05-2024]
అందరి పిల్లల్లాగే చిన్నతనంలో బడికి వెళ్లి వచ్చి ఆటలాడుకుంటూ ఉండేది అతడి బాల్యం.. ఉన్నట్టుండి ఒక్కసారిగా అనారోగ్యానికి గురై కంటిచూపు కోల్పోయాడు. తల్లిదండ్రులు, స్నేహితుల అండతో చదువు కొనసాగించారు. -
20 కోట్ల ఏళ్ల నాటి వృక్ష శిలాజం
[ 22-05-2024]
సుమారు ఇరవై కోట్ల సంవత్సరాల నాటి అరుదైన వృక్ష శిలాజం రవీంద్రభారతి ప్రాంగణంలో కొలువుదీరాయి. రాష్ట్రానికి చెందిన పురాతత్వ పరిశోధకుడు సముద్రాల సునీల్ మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం సుంపుటం గ్రామ పరిధిలో దీన్ని కొనుగొన్నారు. -
ఆర్జీయూకేటీకి మళ్లీ రిక్తహస్తమే
[ 22-05-2024]
రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) ప్రాభవం క్రమంగా మసకబారుతోంది. తగ్గుతోంది. కులపతిగా గవర్నర్ పర్యవేక్షణ లేనందున శాశ్వత ఉపకులపతి(వీసీ) నియామకం చేసే వెసులుబాటు లేదు. -
ఏడుగురిపై ఏసీబీ కేసు
[ 22-05-2024]
నాలుగు వరుసల రహదారి విస్తరణలో భాగంగా.. భూములు కోల్పోయిన వారికి పరిహారం చెల్లింపుల్లో భారీగా అక్రమాలు జరిగాయి. రెవెన్యూ అధికారుల సహకారంతో స్థిరాస్తి వ్యాపారులు రూ.కోట్లలో పరిహారాన్ని కాజేయగా, రెవెన్యూ అధికారులకు సైతం స్థిరాస్తి వ్యాపారులు రూ.కోట్లలో ముట్టజెప్పారు. -
పని భారం.. చాలని వేతనం!
[ 22-05-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో సిబ్బంది కొరత కారణంగా ఉపాధ్యాయులు బోధనతోపాటు బోధనేతర పనులు కూడా నిర్వర్తిస్తున్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయులను కేవలం బోధన విధులకే ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. -
బొమ్మల పెండ్లి.. చిన్నారులే పెద్దలండి!
[ 22-05-2024]
పెళ్లి కుమార్తె ముస్తాబైంది.. పెళ్లి కుమారుడు మండపంలో సిద్ధంగా ఉన్నాడు. చిన్నారులు తోడుగా రాగా.. వధువు మండపానికి వచ్చేసింది. చిన్నారులే పెండ్లి పెద్దలుగా.. వేదమంత్రాలతో వివాహాన్ని పూర్తిచేశారు. ఇక్కడ వివాహం జరిగింది బొమ్మలకు. చేసింది పిల్లలే. -
పట్టణాలకొస్తే ఉగ్గపట్టుకోవాల్సిందే
[ 22-05-2024]
ఇంటి నుంచి పని నిమిత్తం బయటకు వెళ్లే మహిళలు, యువతులు, బాలికలు ఒంటికి, రెంటికి వెళ్లే క్రమంలో శౌచశాలలు లేక పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. కొన్ని పురపాలికల్లోని రద్దీ ప్రదేశాల్లో శౌచశాలలు లేకపోవడం, ఉన్న వాటిల్లో కొన్నింట్లో పూర్తిస్థాయిలో వసతులు లేక వారు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. -
నిపుణులు లేక.. సేవలు అందక
[ 22-05-2024]
ఒకప్పుడు వెలుగు వెలిగిన ఏరియా ఆసుపత్రి అది. అలాంటి ఆసుపత్రి యాజమాన్యం చిన్నచూపు, సంఘాల నాయకుల మెతక వైఖరితో ఉనికి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఏకంగా ఆసుపత్రిలోని పురుషుల, మహిళల వార్డులు మూసివేశారు. -
తెల్లబంగారానికే మొగ్గు
[ 22-05-2024]
వానాకాలం పంట ప్రణాళికను వ్యవసాయశాఖ సిద్ధం చేసింది. ఈ ఏడాది ముందే రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణశాఖ సూచించిన నేపథ్యంలో అన్నదాతలకు సరిపడా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టింది. -
అంతరాయం లేని విద్యుత్తు.. అధికారుల కసరత్తు
[ 22-05-2024]
అంతరాయం లేకుండా కరెంటు సరఫరా చేసేందుకు తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఉమ్మడి జిల్లాలో ఎప్పుడు, ఎక్కడ, ఎంత సేపు విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగిందనే వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా ఇప్పటికే జిల్లాల్లో సైదీ సైఫీ విధానం అమలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
గొంతుపై కాలుతో తొక్కి.. భార్య ప్రాణం తీసిన భర్త
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
ఐపీఎల్లో ‘ఎలిమినేట్’ అయ్యేదెవరు? ‘రాయల్’గా ముందుకెళ్లేదెవరు?
-
5 నిమిషాల్లో 6 వేల అడుగుల కిందకి.. సింగపూర్ విమానంలో భయానక దృశ్యాలు
-
సీబీఐలో లంచాధికారులు.. ఒక్కో కాలేజీ నుంచి రూ.2-10లక్షలు వసూలు
-
64ఎంపీ కెమెరాతో వివో కొత్త ఫోన్.. ఫీచర్లు ఇవే..