ఇప్పుడే ఇలా.. మున్ముందెలా..!
భవిష్యత్తు అవసరాల దృష్ట్యా, ఇల్లు కట్టుకోవాలన్న ఉద్దేశంతో పలువురు పట్టణాల్లో స్థిరపడేందుకు మొగ్గు చూపుతున్నారు. జిల్లా కేంద్రంగా నిర్మల్, డివిజన్గా భైంసా, పురపాలికగా ఖానాపూర్ ఏర్పడిన తర్వాత స్థిరాస్తి వ్యాపారం జోరందుకుంది.
ఓపెన్ ప్లా(పా)ట్లు.. కనీస చర్యలు కరవు
నిర్మల్ అర్బన్, న్యూస్టుడే: భవిష్యత్తు అవసరాల దృష్ట్యా, ఇల్లు కట్టుకోవాలన్న ఉద్దేశంతో పలువురు పట్టణాల్లో స్థిరపడేందుకు మొగ్గు చూపుతున్నారు. జిల్లా కేంద్రంగా నిర్మల్, డివిజన్గా భైంసా, పురపాలికగా ఖానాపూర్ ఏర్పడిన తర్వాత స్థిరాస్తి వ్యాపారం జోరందుకుంది. ఎక్కడికక్కడ వెంచర్లు ఏర్పాటు చేస్తూ ప్లాట్లు చేసి అమ్ముతున్నారు. స్థిరాస్తి వ్యాపారులు కనీస ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం, కొనుగోలు చేసిన యజమానులు వాటి రక్షణ విషయంలో సరైన దృష్టి సారించకపోవడంతో ఇళ్లు నిర్మించుకున్న పలువురికి ఖాళీ ప్లాట్లు చెప్పలేని ఇక్కట్లను తెచ్చిపెడుతున్నాయి.
నిర్లిప్తత..
జిల్లాలోని మూడు బల్దియాల్లో పెద్ద సంఖ్యలో ఖాళీ ప్లాట్లు ఉన్నాయి. వాటిలో వర్షం, మురుగు నీరు నిల్వ, పిచ్చిమొక్కలు పెరగకుండా, చెత్తాచెదారం వంటివి చేరనీయకుండా సంబంధిత యజమానులు తగిన రక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కొనడం, చుట్టూ కంచెలు, హద్దులు ఏర్పాటు చేయడంలో చూపుతున్న శ్రద్ధ రక్షణ విషయంలో కనబర్చడం లేదు. ఫలితంగా సమీపంలో ఇళ్లు నిర్మించుకున్న స్థానికులు చెప్పలేని కష్టాలు ఎదుర్కొంటున్నారు. మురుగు, పిచ్చిమొక్కలు, చెత్తాచెదారం పేరుకుపోయి అపరిశుభ్రంగా మారుతున్నాయి. ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే రానున్న వర్షాకాలంలో ఎదురయ్యే ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. సంబంధిత పురపాలిక అధికారులను సంప్రదిస్తే యజమానులకు నోటీసులు జారీ చేస్తామని, కానీ వాటి యజమానుల చిరునామా తెలియడం లేదన్న సమాధానం చెబుతున్నారు.
- చిన్నపాటి కుంటను తలపిస్తూ, మురుగు చేరి అపరిశుభ్రంగా మారుతున్న ఈ పరిస్థితి జిల్లా కేంద్రంలోని విజయనగర్కాలనీలోనిది. ఇక్కడ ఉన్న పలు ఖాళీ ప్లాట్లు ఇలాంటివే కనిపిస్తాయి. తుంగ, గుర్రపుడెక్క అమాంతంగా పెరిగి పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి. ఇప్పుడే ఈ దుస్థితి ఉంటే రానున్న వర్షాకాలంలో కాలనీవాసులు ఎదుర్కొనే ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. ఇక్కడే కాకుండా ఇలాంటివి పలు ప్రాంతాల్లో కనిపిస్తాయి.
- చెత్తాచెదారం పేరుపోతున్న ఈ ఖాళీ ప్లాటు ఎన్టీఆర్ మార్గ్లోని భాగ్యనగర్ కాలనీలో ఉంది. ప్లాస్టిక్ తదితర వాటిని పారేయడంతో పరిసరాలు దెబ్బతింటున్నాయి. ఇలాంటి సమస్య జిల్లాలోని మూడు పురపాలికల్లోని పలు కాలనీల్లో ఉంది.
ఇకనైనా..
ఖాళీ స్థలాల పన్ను (వీఎల్టీ) వసూళ్లను గతంలో నిర్మల్, భైంసా పురపాలికల్లో చేపట్టినా.. కొన్నేళ్లుగా విస్మరించారు. ఓపెన్ ప్లాట్లతో దోమలు, ఈగలు వృద్ధి చెందడంతోపాటు పందులు, పశువులకు ఆవాసంగా మారి స్థానికులు రోగాల బారినపడుతున్నారు. రానున్న వర్షాకాలం దృష్ట్యా బల్దియా అధికారులు వీటి విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబర్చాల్సిన అవసరం ఉంది. ఈ విషయమై నిర్మల్ పురపాలిక కమిషనర్ సి.వి.ఎన్.రాజును ‘న్యూస్టుడే’ సంప్రదించగా.. వెంటనే సదరు యజమానులకు నోటీసులు జారీ చేస్తామన్నారు. రక్షణ చర్యలు తప్పక తీసుకోవాలని చెప్పారు. లేనిచో బల్దియా ఆధ్వర్యంలోనే చేపట్టి దానికి అయిన ఖర్చును వారి నుంచి వసూలు చేయనున్నామని వెల్లడించారు. స్థానికులు సదరు స్థలాల్లో చెత్తాచెదారం వంటివి వేయకూడదని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హత్యాచారం నిందితులను కఠినంగా శిక్షించాలి
[ 16-06-2024]
పెద్దపల్లి జిల్లాలో బాలికపై హత్యాచారం ఘటనలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రగతిశీల మహిళా సంఘం (పీవోడబ్ల్యూ) డిమాండ్ చేసింది. -
సుధీర్కుమార్కు తెలంగాణ స్ఫూర్తి పురస్కారం
[ 16-06-2024]
ఆదిలాబాద్కు చెందిన ప్రముఖ న్యాయవాది, సంగెం ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ సంగె సుధీర్కుమార్కు తెలంగాణ స్ఫూర్తి పురస్కారం లభించింది. -
ఆదిలాబాద్లో బక్రీద్ హడావిడి
[ 16-06-2024]
ఆదిలాబాద్ బక్రీద్ పండగ సందర్భంగా పట్టణంలో సందడి నెలకొంది. ఆదివారం అయినప్పటికీ పట్టణంలోని ప్రధాన కూడళ్లు వినియోగదారులతో కిటకిటలాడాయి. -
బక్రీద్ పండుగకు భారీ బందోబస్తు
[ 16-06-2024]
బక్రీద్ పండుగను జిల్లా ప్రజలు మత సామరస్యాన్ని కాపాడుతూ ప్రశాంతంగా నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం సూచించారు. -
ఎస్పీని సన్మానించిన పోలీసు అధికారులు
[ 16-06-2024]
పార్లమెంట్ ఎన్నికలను ఆదిలాబాద్ జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా నిర్వహించడానికి ఎంతగానో కృషి చేసిన జిల్లా ఎస్పీ గౌష్ ఆలంకు కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ ప్రశంసా పత్రం పంపించారు. -
ఆత్రం భగవంతురావు సేవలు మరువలేనివి
[ 16-06-2024]
గిరిజన చట్టాల పరిరక్షణకు ఆదివాసీ ఉద్యమ నేత ఆత్రం భగవంత్ రావు చేసిన కృషి మరువలేనిదని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి పూసం సచిన్ అన్నారు. -
జిల్లా కేంద్రంలో బక్రీద్ ప్రార్థనలకు ఏర్పాట్లు
[ 16-06-2024]
ఈద్ ఉల్-అజ్ హా (బక్రీద్) పండుగ నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని ఈద్గా మైదానంలో ప్రార్థనలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా.. -
రిమ్స్ లో కొత్త కాంట్రాక్టర్లను నియమించాలని వినతి
[ 16-06-2024]
జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న కాంట్రాక్టర్లను కాకుండా కొత్త కాంట్రాక్టర్లను నియమించాలని... -
వారధి.. ప్రమాదానికి దారి
[ 16-06-2024]
జిల్లాలో ప్రమాదకరంగా ఉన్న వంతెనలపై ప్రయాణం చేయాలంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సిందే. ప్రతి సంవత్సరం కురుస్తున్న భారీ వర్షాలకు వారధులు దెబ్బతింటున్నా.. -
సమన్వయం.. పారదర్శకం
[ 16-06-2024]
జిల్లా కలెక్టర్గా ఎనిమిది నెలలు పనిచేసిన అశిష్ సంగ్వాన్ పారదర్శక పాలన చేపట్టారు. 13 అక్టోబరు 2023న జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన ఆయన అన్ని శాఖల అధికారులను సమన్వయం చేస్తూ జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో శాసనసభ, లోక్సభ ఎన్నికలను సమర్థŸంగా నిర్వహించి ప్రశంసలు అందుకున్నారు. -
తరుగు పేరిట రూ. 500 కోట్లకు పైగా అక్రమాలు
[ 16-06-2024]
భారాస ప్రభుత్వ పాలనలో ధాన్యం కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై సీబీ సీఐడీ అధికారులతో విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు డిమాండ్ చేశారు -
ప్రసవం వేదనే
[ 16-06-2024]
తెలంగాణ రాష్ట్రంలో ప్రసూతి మరణాలు తగ్గినా.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో మరణాల సంఖ్యలో పెరుగుదల ఉంది. -
ఎన్నికల ఖర్చు.. జిల్లాకో తీరు!
[ 16-06-2024]
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఖర్చు ఆయా జిల్లాల కలెక్టర్ల విచక్షణ మీద ఆధారపడి ఉంది. వాహనాల అద్దె, సిబ్బంది జీతభత్యాలు, భోజనం, రవాణా తదితర ఖర్చులకు స్పష్టమైన జీఓలు ఎన్నికల సంఘం జారీ చేసింది. -
ప్రమాదాలకు నిలయం@ కెరమెరి ఘాట్!
[ 16-06-2024]
అసలే అది ఘాట్ రోడ్డు.. ప్రమాదకర మూలమలుపులతో కూడిన ఇరుకు రహదారి.. అడుగుకో గుంత, రాళ్లు తేలిన మార్గం.. ఇదీ జిల్లాలోని ప్రధాన రహదారి దుస్థితి. -
లోకాన్ని చూపే బడి.. నాన్న ఒడి
[ 16-06-2024]
నాన్న.. మన కోసం శ్రమించే నిస్వార్థ జీవి.. తనలోని బాధను మనకు తెలియనీయకుండా తనలోనే దాచుకుంటూ ఇంటిల్లిపాదిని కాపాడుకునే స్ఫూర్తి ప్రదాత.. ఆయన ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడే.. -
ప్రియుడి కోసం భర్తను హత్య చేయించిన భార్య
[ 16-06-2024]
ప్రియుడి మోజులో పడి భార్యే భర్తను హత్య చేయించినట్లు ఉట్నూరు డీఎస్పీ సీహెచ్ నాగేందర్ పేర్కొన్నారు -
ఉపాధ్యాయ ఐచ్ఛికాలకు పచ్చజెండా
[ 16-06-2024]
పదోన్నతిలో భాగంగా ఐచ్ఛికాల కోసం రెండు రోజులుగా వేచిచూస్తున్న ఉపాధ్యాయుల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది.
తాజా వార్తలు (Latest News)
-
సైబర్ నేరగాళ్లు కాజేసిన రూ.31 కోట్లు.. బాధితులకు అందజేసిన అధికారులు
-
శ్రీలీల ‘డ్రిప్పిన్’ కల్చర్.. రోజీ చీరలో మంజిమా..
-
కౌంటింగ్ వేళ ఈవీఎం అన్లాక్ ఘటన..ఎంపీ బంధువు అరెస్ట్
-
ఐపీఎస్ అధికారి గరికపాటి బిందు మాధవ్పై సస్పెన్షన్ ఎత్తివేత
-
మార్పొస్తుందని ఆశిస్తున్నా: పవన్ కల్యాణ్పై ఉపేంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు
-
రేణుకాస్వామి హత్య కేసు.. ఆ కారు సీజ్!