జెండా ఉంటేనే మనముంటాం!
వచ్చే ఎన్నికల్లో అంతా కష్టపడి వైకాపాను గెలిపించుకోవాలి, పార్టీ జెండా నిలబడితేనే మనకు మనుగడ ఉంటుందని రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు.
వైకాపా ప్లీనరీలో మంత్రి అమర్నాథ్
జ్యోతి వెలిగించి సమావేశాన్ని ప్రారంభిస్తున్న తితిదే ఛైర్మన్ సుబ్బారెడ్డి, పక్కన ఎంపీ మాధవి, ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి, ధనలక్ష్మి, మాజీ మంత్రి బాలరాజు
పాడేరు, న్యూస్టుడే: మన్యంలో 2014లో వైకాపా తరఫున గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు తెదేపాకు అమ్ముడుపోయారు. వారిలో ఒకరిని దేవుడు తీసుకెళ్లిపోగా, మరొకరికి 2019లో ప్రజలు గుణపాఠం చెప్పార’ని మంత్రి అమర్నాథ్ అన్నారు. వైకాపా జిల్లాస్థాయి ప్లీనరీ సమావేశాన్ని పార్టీ జిల్లా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అధ్యక్షతన స్థానిక మోదకొండమ్మ ఆలయ ఓపెన్ ఆడిటోరియంలో శుక్రవారం నిర్వహించారు. తితిదే ఛైర్మన్, వైకాపా ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి, మంత్రి అమర్నాథ్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. తొలుత పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి అమర్ మాట్లాడుతూ 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకమూ గుర్తుకురాదన్నారు. సీఎం జగన్ గుర్తు పెట్టుకోవడానికి వీల్లేనన్ని పథకాలు ప్రవేపెడుతున్నారన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు రూ. లక్షన్నర కోట్లు ప్రజలకు అందించామన్నారు. ఎన్టీఆర్కు చంద్రబాబు వెన్నుపోటు పొడవగా.. జగన్మోహన్రెడ్డి ఎన్టీఆర్ పేరుతో ఓ జిల్లానే ఏర్పాటు చేశారని అమర్ పేర్కొన్నారు. ముందుగా అధ్యక్ష హోదాలో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మాట్లాడారు. మూడేళ్లలోనే ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ఘనత సీఎం జగన్మోహన్రెడ్డికి దక్కుతుందన్నారు. ప్రతిపక్ష పార్టీలు ఎంత వ్యతిరేక ప్రచారం చేసినా వైకాపాను ఓడించలేరన్నారు. తితిదే ఛైర్మన్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ 2024లోనే ఎన్నికలు జరుగుతాయని అనుకుంటున్నాం.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైకాపాను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. బాక్సైట్ తవ్వకాల రద్దు వంటి కీలక నిర్ణయాలు తీసుకుని సీఎం జగన్మోహన్రెడ్డి గిరిజనుల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని చెప్పారు. పాడేరు వైద్య కళాశాలలో వచ్చే ఏడాది నుంచి ప్రవేశాలు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
* ఎంపీ మాధవి మాట్లాడుతూ జిల్లా ప్లీనరీ చూసి ప్రతిపక్షాలకు వణుకు పుడుతోందన్నారు. జనసేనకు ప్రజల్లో ఆదరణ లేదని, ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రజలకు ఏమి చేశారని ఓట్లెయ్యాలని ప్రశ్నించారు. అరకులోయ ఎమ్మెల్యే ఫాల్గుణ మాట్లాడుతూ తెదేపా దుష్ప్రచారాలను ప్రజలు నమ్మరన్నారు. ప్రతి ఇంటికి ఏదో ఒక పథకం అందిస్తున్నామన్నారు. రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మి మాట్లాడుతూ తెదేపా హయాంలో జరిగిన అభివృద్ధి, ఈ మూడేళ్లలో జరిగిన పనులను ప్రజలు గమనించాలన్నారు. పోడు భూములకు పట్టాలిచ్చిన సీఎం జగన్ ఆదివాసీల పాలిట దేవుడయ్యారన్నారు. జడ్పీ ఛైర్పర్సన్ సుభద్ర మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి సీఎం అహర్నిశలు కృషిచేస్తున్నారన్నారు. ట్రైకార్ ఛైర్మన్ బుల్లిబాబు, మాజీ మంత్రులు పపుసులేటి బాలరాజు, మత్స్యరాస బాలరాజు, జిల్లా ప్లీనరీ పరిశీలకులు పరీక్షిత్రాజు, నాయకులు వినయ్, బాలకృష్ణ, 22 మండలాల జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
సొంత గూటికి మాజీ ఎంపీపీ
పాడేరు, న్యూస్టుడే: అరకులోయ మాజీ ఎంపీపీ అరుణకుమారి సొంత గూటికి చేరారు. గతంలో ఆమె వైకాపా అరకు నియోజకవర్గ సమన్వయకర్తగా వ్యవహరించారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో ఆమెతోపాటు భర్త అప్పాలు వైకాపాను వీడి తెదేపాలో చేరారు. శుక్రవారం పాడేరులో నిర్వహించిన ప్లీనరీలో తితిదే ఛైర్మన్ సుబ్బారెడ్డి, మంత్రి అమర్నాథ్, అరకులోయ ఎంపీ మాధవి, ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి, ఫాల్గుణ ఆధ్వర్యంలో వైకాపాలో చేరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల వేళ...‘కూపన్ల’ ఎర..!
[ 27-04-2024]
ప్రజాదరణ కోల్పోయిన అధికార పార్టీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారాలు, ర్యాలీలు జనం లేక వెలవెలబోతున్నాయి. -
పింఛనుదారులకు జగన్ వంచన
[ 27-04-2024]
మలివయసులో కృష్ణా, రామా అనుకుంటూ ప్రశాంతంగా గడపాల్సిన పింఛన్దారులకు హక్కుగా రావాల్సిన భత్యాలతోపాటు పెన్షన్ సొమ్ములూ సకాలంలో ఇవ్వకుండా ముప్పతిప్పలు పెడుతున్నారు. -
అరకులోయ వైకాపాలో వర్గపోరు
[ 27-04-2024]
అరకులోయ నియోజకవర్గ వైకాపాను వర్గపోరు వెంటాడుతోంది. క్యాడర్ను అభ్యర్థి సమన్వయం చేసుకోవడం లేదు. -
పరిశోధనల సిరికి జగన్ ఉరి
[ 27-04-2024]
వ్యవసాయ శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేస్తూ ఉంటారు. వాటిలో కొన్ని విజయవంతం అవుతుంటాయి. అవి రైతుల దరికి చేరితే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించడం వీలవుతుంది. -
కలిసికట్టుగా కూటమిని గెలిపించండి
[ 27-04-2024]
వైకాపాకు ఓటుతో బుద్ధి చెప్పి రాష్ట్రం నుంచి పారదోలుదామని పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి పిలుపునిచ్చారు. -
కళ్ల ముందే దుంగలు..ఎవరు దొంగలు?
[ 27-04-2024]
ఏజెన్సీ ప్రాంతంలో అటవీ సిబ్బంది అండదండలతో విలువైన టేకు, మారుజాతి దుంగలను అక్రమార్కులు తరలించుకుపోతున్నారు. -
జిల్లాలో 63 నామినేషన్లకు ఆమోదం
[ 27-04-2024]
అల్లూరి జిల్లాలో 68 మంది అభ్యర్థులు 103 నామినేషన్లు దాఖలు చేశారు. -
జనావాసాల్లో ఆసుపత్రి వ్యర్థాలు
[ 27-04-2024]
ప్రతిపక్ష కౌన్సిలర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డుల అభివృద్ధికి నిధుల కేటాయింపులో పుర పాలకవర్గం వివక్ష చూపుతోంది. -
రెండు కిలోమీటర్ల రోడ్డు.. వంద గుంతలు
[ 27-04-2024]
పర్యటక పాంతం, ప్రముఖ పుణ్యక్షేత్రమైన రంప గ్రామానికి రోడ్డు వేయాలని అయిదేళ్లగా అధికారులకు, ప్రజాప్రతినిధులకు గిరిజనులు మొరపెట్టుకొన్నారు. -
వైకాపా రాక్షస పాలనకు చరమగీతం పాడాలి
[ 27-04-2024]
ప్రజలు తమ విలువైన ఓటుతో వైకాపా రాక్షస పాలనకు చరమగీతం పాడాలని సినీనటుడు హైపర్ ఆది పిలుపునిచ్చారు. -
నేడు వైఎస్ షర్మిల పర్యటన
[ 27-04-2024]
పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. -
శ్రీకాకుళం రోడ్- తిరుపతి ప్రత్యేక రైళ్లు
[ 27-04-2024]
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పలు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘విశాఖ- మలేసియా’ విమాన సర్వీసు ప్రారంభం
[ 27-04-2024]
విమాన ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తామని విమానాశ్రయం డైరెక్టర్ ఎస్.రాజారెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్