బలమైన విద్యా వ్యవస్థ అవసరం
దేశం అభివృద్ధి చెందాలంటే బలమైన విద్యా వ్యవస్థ కలిగి ఉండాలని త్రిదండి చినజీయర్ స్వామి అన్నారు.
త్రిదండి చినజీయర్ స్వామి
మొక్క నాటి నీరు పోస్తున్న చినజీయర్ స్వామి, చిత్రంలో ఏయూ వీసీ
ఆచార్య ప్రసాదరెడ్డి తదితరులు
ఏయూ ప్రాంగణం, న్యూస్టుడే: దేశం అభివృద్ధి చెందాలంటే బలమైన విద్యా వ్యవస్థ కలిగి ఉండాలని త్రిదండి చినజీయర్ స్వామి అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బుధవారం స్వామి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏయూ కన్వెన్షన్ సెంటర్లో విద్యార్థులనుద్దేశించి అనుగ్రహభాషణం చేశారు. భారతీయ విద్యా వ్యవస్థ ఎంతో ఉత్కృష్టమైనదని, గతంలో విదేశీయులు ఎందరో మన దేశానికి వచ్చి విద్య అభ్యసించిన సందర్భాలు ఉన్నాయన్నారు. ప్రతి వ్యక్తి ఉన్నత స్థానం నుంచి మరింత ఉన్నత స్థానానికి చేరుకునేందుకు ప్రయత్నించాలని సూచించారు. దీనికి విద్య ఒక సాధనంగా నిలుస్తుందన్నారు. సమాజ హితం కోరుతూ చేసే ప్రతి పని దేవుని సేవతో సమానమన్నారు. విద్యార్థులు తమ శక్తి సామర్థ్యాలు, నైపుణ్యాలను సమాజం కోసం వినియోగించాలన్నారు. వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి మాట్లాడుతూ ఏయూలో సీవీ రామన్, మోక్షగుండం విశ్వేశ్వరయ్య వంటి వ్యక్తులు సేవలందించారన్నారు. దేశం కోరుకునే ఉత్తమ పౌరులుగా ఏయూ విద్యార్థులు మారాలని ఆకాంక్షించారు.
ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో భూమి పూజ
అంతకుముందు స్వామీజీ ఏయూ ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో చదును చేసిన 16 ఎకరాల మైదానంలో నాలుగు స్తూపాల నిర్మాణానికి సంబంధించి వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య భూమి పూజ చేశారు. ఈ నాలుగు స్తూపాల మధ్యలో మరో ఎత్తైన స్తూపం నిర్మించనున్నట్లు వీసీ తెలిపారు. అనంతరం విద్యార్థులతో కలసి అదే మైదానంలో స్వామీజీ 108 ఔషధ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. శమీ మొక్క నాటి నీరు పోశారు. ఈ మైదానానికి ‘ఊర్జా’ అని నామకరణం చేశారు. ఊర్జా అంటే సంస్కృతంలో తేజస్సు అని అర్థమని వివరించారు. తర్వాత బీచ్రోడ్డులోని ఏయూ యోగా విలేజ్ను సందర్శించి పతంజలి విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఏయూ పరిపాలనా భవనాన్ని సందర్శించి వీసీ ఆచార్య ప్రసాదరెడ్డికి ఆశీర్వచనాలు అందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల వేళ...‘కూపన్ల’ ఎర..!
[ 27-04-2024]
ప్రజాదరణ కోల్పోయిన అధికార పార్టీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారాలు, ర్యాలీలు జనం లేక వెలవెలబోతున్నాయి. -
పింఛనుదారులకు జగన్ వంచన
[ 27-04-2024]
మలివయసులో కృష్ణా, రామా అనుకుంటూ ప్రశాంతంగా గడపాల్సిన పింఛన్దారులకు హక్కుగా రావాల్సిన భత్యాలతోపాటు పెన్షన్ సొమ్ములూ సకాలంలో ఇవ్వకుండా ముప్పతిప్పలు పెడుతున్నారు. -
అరకులోయ వైకాపాలో వర్గపోరు
[ 27-04-2024]
అరకులోయ నియోజకవర్గ వైకాపాను వర్గపోరు వెంటాడుతోంది. క్యాడర్ను అభ్యర్థి సమన్వయం చేసుకోవడం లేదు. -
పరిశోధనల సిరికి జగన్ ఉరి
[ 27-04-2024]
వ్యవసాయ శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేస్తూ ఉంటారు. వాటిలో కొన్ని విజయవంతం అవుతుంటాయి. అవి రైతుల దరికి చేరితే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించడం వీలవుతుంది. -
కలిసికట్టుగా కూటమిని గెలిపించండి
[ 27-04-2024]
వైకాపాకు ఓటుతో బుద్ధి చెప్పి రాష్ట్రం నుంచి పారదోలుదామని పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి పిలుపునిచ్చారు. -
కళ్ల ముందే దుంగలు..ఎవరు దొంగలు?
[ 27-04-2024]
ఏజెన్సీ ప్రాంతంలో అటవీ సిబ్బంది అండదండలతో విలువైన టేకు, మారుజాతి దుంగలను అక్రమార్కులు తరలించుకుపోతున్నారు. -
జిల్లాలో 63 నామినేషన్లకు ఆమోదం
[ 27-04-2024]
అల్లూరి జిల్లాలో 68 మంది అభ్యర్థులు 103 నామినేషన్లు దాఖలు చేశారు. -
జనావాసాల్లో ఆసుపత్రి వ్యర్థాలు
[ 27-04-2024]
ప్రతిపక్ష కౌన్సిలర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డుల అభివృద్ధికి నిధుల కేటాయింపులో పుర పాలకవర్గం వివక్ష చూపుతోంది. -
రెండు కిలోమీటర్ల రోడ్డు.. వంద గుంతలు
[ 27-04-2024]
పర్యటక పాంతం, ప్రముఖ పుణ్యక్షేత్రమైన రంప గ్రామానికి రోడ్డు వేయాలని అయిదేళ్లగా అధికారులకు, ప్రజాప్రతినిధులకు గిరిజనులు మొరపెట్టుకొన్నారు. -
వైకాపా రాక్షస పాలనకు చరమగీతం పాడాలి
[ 27-04-2024]
ప్రజలు తమ విలువైన ఓటుతో వైకాపా రాక్షస పాలనకు చరమగీతం పాడాలని సినీనటుడు హైపర్ ఆది పిలుపునిచ్చారు. -
నేడు వైఎస్ షర్మిల పర్యటన
[ 27-04-2024]
పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. -
శ్రీకాకుళం రోడ్- తిరుపతి ప్రత్యేక రైళ్లు
[ 27-04-2024]
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పలు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘విశాఖ- మలేసియా’ విమాన సర్వీసు ప్రారంభం
[ 27-04-2024]
విమాన ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తామని విమానాశ్రయం డైరెక్టర్ ఎస్.రాజారెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!