logo

కూడలో ప్రబలిన వ్యాధులు

గసభ పంచాయతీ కూడ గ్రామంలో మూడు రోజులుగా వాంతులు, విరేచనాలతో వృద్ధులు, చిన్నారులు మంచం పట్టారు.

Published : 01 Feb 2023 02:01 IST

వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న చిన్నారులు

బాధితులను పరామర్శిస్తున్న నేతలు

డుంబ్రిగుడ, న్యూస్‌టుడే: గసభ పంచాయతీ కూడ గ్రామంలో మూడు రోజులుగా వాంతులు, విరేచనాలతో వృద్ధులు, చిన్నారులు మంచం పట్టారు. ఆసుపత్రికి తరలించేందుకు దూర ప్రాంతం కావడం, రవాణా సౌకర్యానికి వీలుపడక ఇళ్లలోనే మంచానికి పరిమితం కావాల్సి వచ్చిందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాంతులు, విరేచనాలకు గురైన వారిలో పదేళ్ల లోపు చిన్నారులు అయిదుగురున్నారు. తక్షణమే గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి వ్యాధులు అదుపులో తీసుకురావాలని మాజీ సర్పంచి సురేష్‌, వార్డు సభ్యులు  సత్యనారాయణ, గోపాల్‌ కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని