ప్రాణవాయువుకు లోటు లేకుండా..
పాడేరు జిల్లా ఆసుపత్రిలో కరోనా ఉద్ధృతంగా ఉన్న కాలంలో ప్రాణవాయువు కొరత వేధించింది. ఊపిరాడక కొవిడ్ భూతానికి నిండుప్రాణాలు గాల్లో కలిసిపోయిన సంగతి తెలిసిందే.
జిల్లా ఆసుపత్రిలో భారీ ఏర్పాట్లు
పాడేరు, న్యూస్టుడే
పాడేరు ఆసుపత్రిలో ఆక్సిజన్ ఉత్పత్తి యూనిట్
పాడేరు జిల్లా ఆసుపత్రిలో కరోనా ఉద్ధృతంగా ఉన్న కాలంలో ప్రాణవాయువు కొరత వేధించింది. ఊపిరాడక కొవిడ్ భూతానికి నిండుప్రాణాలు గాల్లో కలిసిపోయిన సంగతి తెలిసిందే. కొవిడ్కు ముందు ఆక్సిజన్తో ఆసుపత్రులకు పెద్దగా పని ఉండేది కాదు. కొద్దో గొప్పో నిల్వలు ఉంచుకుని ఊపిరాడని రోగులకు అందించేవారు. ఆ సమయంలో కేవలం ఊపిరందక కొట్టుమిట్టాడుతూ పలువురు మృత్యువాత పడిన ఉదంతాలు ఉన్నాయి. వీటిని తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి జిల్లా ఆసుపత్రికి ఓ ఆక్సిజన్ యూనిట్ను సమకూర్చుతోంది.
ఎల్ఎంవో నిల్వ కేంద్రం
500 పడకల స్థాయికి తగ్గట్లుగా...
కొవిడ్ సమయంలో స్థానిక ఆసుపత్రిలో ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడంతో విశాఖ కేజీహెచ్ నుంచి సిలెండర్ల రూపంలో ఇక్కడకు తరలించేవారు. అవీ అరకొరగా సరఫరా చేసేవారు. దీంతో రోగులు నానా అవస్థలు ఎదుర్కొనేవారు. ఇక్కడున్న తీవ్రతను గుర్తించిన అమెరికన్-ఇండియా ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ అప్పట్లో ఓ యూనిట్ను సమకూర్చి ఆదుకుంది. ఈ ట్రస్టు ఆధ్వర్యంలో 500 లీటర్ల ఎల్పీఎం (లీటర్ ఫర్ మినిట్) సామర్థ్యమున్న ఓ యూనిట్ను ఏర్పాటు చేశారు. దీనిద్వారా ఎంతో మంది ప్రాణాలు నిలిచాయి. దీంతోపాటు ప్రభుత్వం ఆధ్వర్యంలో మరో 500 లీటర్లు ఉత్పతి సామర్థ్యమున్న కేంద్రాన్ని నెలకొల్పారు. భవిష్యత్తులో నిల్వలు సమృద్ధిగా ఉండాలని భావించి 500 పడకల ఆసుపత్రి స్థాయికి తగ్గట్లుగా 10 వేల లీటర్ల నిల్వ సామర్థ్యమున్న లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ (ఎల్ఎంవో) యూనిట్ను తాజాగా ఏర్పాటు చేశారు. ఈ ట్యాంకులో అవసరాన్ని బట్టి ఎప్పటికప్పుడు ఆక్సిజన్ను వేరో చోట నుంచి తీసుకొచ్చి నిల్వ ఉంచుతారు. ఈ మూడు ప్లాంట్లు అందుబాటులోకి రావడంతో కొవిడ్ వంటి ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఆక్సిజన్ కొరత ఎంత మాత్రం ఉండదని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణారావు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల వేళ...‘కూపన్ల’ ఎర..!
[ 27-04-2024]
ప్రజాదరణ కోల్పోయిన అధికార పార్టీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారాలు, ర్యాలీలు జనం లేక వెలవెలబోతున్నాయి. -
పింఛనుదారులకు జగన్ వంచన
[ 27-04-2024]
మలివయసులో కృష్ణా, రామా అనుకుంటూ ప్రశాంతంగా గడపాల్సిన పింఛన్దారులకు హక్కుగా రావాల్సిన భత్యాలతోపాటు పెన్షన్ సొమ్ములూ సకాలంలో ఇవ్వకుండా ముప్పతిప్పలు పెడుతున్నారు. -
అరకులోయ వైకాపాలో వర్గపోరు
[ 27-04-2024]
అరకులోయ నియోజకవర్గ వైకాపాను వర్గపోరు వెంటాడుతోంది. క్యాడర్ను అభ్యర్థి సమన్వయం చేసుకోవడం లేదు. -
పరిశోధనల సిరికి జగన్ ఉరి
[ 27-04-2024]
వ్యవసాయ శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేస్తూ ఉంటారు. వాటిలో కొన్ని విజయవంతం అవుతుంటాయి. అవి రైతుల దరికి చేరితే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించడం వీలవుతుంది. -
కలిసికట్టుగా కూటమిని గెలిపించండి
[ 27-04-2024]
వైకాపాకు ఓటుతో బుద్ధి చెప్పి రాష్ట్రం నుంచి పారదోలుదామని పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి పిలుపునిచ్చారు. -
కళ్ల ముందే దుంగలు..ఎవరు దొంగలు?
[ 27-04-2024]
ఏజెన్సీ ప్రాంతంలో అటవీ సిబ్బంది అండదండలతో విలువైన టేకు, మారుజాతి దుంగలను అక్రమార్కులు తరలించుకుపోతున్నారు. -
జిల్లాలో 63 నామినేషన్లకు ఆమోదం
[ 27-04-2024]
అల్లూరి జిల్లాలో 68 మంది అభ్యర్థులు 103 నామినేషన్లు దాఖలు చేశారు. -
జనావాసాల్లో ఆసుపత్రి వ్యర్థాలు
[ 27-04-2024]
ప్రతిపక్ష కౌన్సిలర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డుల అభివృద్ధికి నిధుల కేటాయింపులో పుర పాలకవర్గం వివక్ష చూపుతోంది. -
రెండు కిలోమీటర్ల రోడ్డు.. వంద గుంతలు
[ 27-04-2024]
పర్యటక పాంతం, ప్రముఖ పుణ్యక్షేత్రమైన రంప గ్రామానికి రోడ్డు వేయాలని అయిదేళ్లగా అధికారులకు, ప్రజాప్రతినిధులకు గిరిజనులు మొరపెట్టుకొన్నారు. -
వైకాపా రాక్షస పాలనకు చరమగీతం పాడాలి
[ 27-04-2024]
ప్రజలు తమ విలువైన ఓటుతో వైకాపా రాక్షస పాలనకు చరమగీతం పాడాలని సినీనటుడు హైపర్ ఆది పిలుపునిచ్చారు. -
నేడు వైఎస్ షర్మిల పర్యటన
[ 27-04-2024]
పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. -
శ్రీకాకుళం రోడ్- తిరుపతి ప్రత్యేక రైళ్లు
[ 27-04-2024]
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పలు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘విశాఖ- మలేసియా’ విమాన సర్వీసు ప్రారంభం
[ 27-04-2024]
విమాన ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తామని విమానాశ్రయం డైరెక్టర్ ఎస్.రాజారెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు