రీసర్వే త్వరితగతిన పూర్తి చేయండి
నిషేధిత జాబితా (22ఏ)లో ఉన్న భూ సమస్యల పరిష్కారం, రీసర్వేకు సంబంధించిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అధికారులకు మార్గనిర్దేశం చేశారు.
మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పష్టీకరణ
తొమ్మిది జిల్లాల అధికారులతో సమీక్ష
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ధర్మాన ప్రసాదరావు
ఈనాడు, విశాఖపట్నం : నిషేధిత జాబితా (22ఏ)లో ఉన్న భూ సమస్యల పరిష్కారం, రీసర్వేకు సంబంధించిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అధికారులకు మార్గనిర్దేశం చేశారు. విశాఖలోని ఓ హోటల్లో ఉత్తరాంధ్ర, ఉమ్మడి తూర్పు గోదావరి పరిధిలోని తొమ్మిది జిల్లాల రెవెన్యూ, రిజిస్ట్రేషన్, సర్వే శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఉదయం పది గంటలకు ప్రారంభమైన సమావేశం మధ్యాహ్నం 2.30 వరకు సాగింది. అధికారులు, సిబ్బందిని మాత్రమే లోనికి అనుమతించారు. ఈ సమావేశంలో రీసర్వేకు సంబంధించిన అంశాలపై సమీక్షించినట్లు సమాచారం. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో అధికారులు ముందుండాలని, వారి పనితీరుతోనే ప్రభుత్వానికి పేరొస్తుందని మంత్రి సూచించారు. ప్రజలతో హుందాగా వ్యవహరించి తెలియజేసిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేలా చూడాలని పేర్కొన్నారు. వివిధ సర్వే పనులు ఎప్పటిలోగా పూర్తి చేస్తారో అడిగి తెలుసుకున్నారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి విజయ్కుమార్ తన అనుభవాలను కలెక్టర్లతో పంచుకున్నారు. సీసీఎల్ఏ కమిషనర్ సాయిప్రసాద్, సర్వే శాఖ ఎండీ సిద్ధార్థజైన్ అధికారుల సందేహాలు నివృత్తి చేశారు.
చట్ట ప్రకారమే సర్వే: రీసర్వేకు సంబంధించి జిల్లాల వారీగా పరిస్థితిని తెలుసుకొని అధికారులకు సూచనలు చేశారు. మంత్రి నేరుగా కొందరు తహసీల్దార్లతో మాట్లాడి వారి అనుభవాలను తెలుసుకున్నారు. ఆయా జిల్లాల్లో ఎన్ని చోట్ల రీసర్వే జరిగింది, ఎక్కడెక్కడ జరుగుతోంది అందులో ఎదురవుతున్న ఇబ్బందులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వారికి ఎదురైన సమస్యలపై సాంకేతిక బృందం ద్వారా సలహాలు ఇప్పించారు.
* నిబంధనలు, ఆర్వోఆర్ చట్టం ప్రకారం అధికారులు రీసర్వే నిర్వహించాలన్నారు. ఆ పరిధులను ఎవరూ మీరొద్దని చెప్పారు.
* రీసర్వేపై ప్రతి మండలానికి నియమించిన ఉప తహసీల్దార్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.
* వాస్తవ స్థలానికి, దస్త్రాల్లో ఉన్న లెక్కలకు వ్యత్యాసం రాకుండా జాగ్రత్త తీసుకోవాలని సూచించారు. కుటుంబ సభ్యుల మధ్య జాయింట్ పట్టాల పంపిణీ సక్రమంగా ఉండేలా చూడాలని, పంపకపు దస్తావేజులను రిజిస్టర్ చేసి ఆ దస్తావేజులతో భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలని పేర్కొన్నారు. గ్రామసభల తరువాత వచ్చిన ఫిర్యాదులను పరిగణలోకి తీసుకోవాలన్నారు.
* నగరాలు, పట్టణాల్లో ఉపతహసీల్దార్ల ఆధ్వర్యంలోనే సర్వే జరగాలని స్పష్టం చేశారు. ప్రతి ఇంటికి ఒక నంబరు ఇవ్వాలన్నారు. పురపాలక, సర్వేశాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఇది జరుగుతుందన్నారు.
వాటిపై తాత్సారం ఎందుకు?: 22ఏ జాబితాలో భూసమస్యలను పరిష్కరించడంలో అధికారులు తాత్సారం చేయడంపై మంత్రి గట్టిగానే ప్రశ్నించినట్లు తెలిసింది. ఆయా జిల్లాల కలెక్టర్లే వాటిని పరిష్కరించకపోతే ఎలా అని అడిగినట్లు సమాచారం. 22ఏ కింద వచ్చిన దరఖాస్తులలో ప్రాథమిక ఆధారాలు పరిశీలించి, వాస్తవమైతే పరిష్కరించండి. ఆ స్థాయిలో చేయలేకపోతే రాష్ట్ర స్థాయి అధికారులకు పంపించండి అని తెలియజేసినట్లు తెలిసింది. 22ఏలో ఉన్న వాటికి 1బి, సబ్డివిజన్ వంటి ఇతర పత్రాల ఆధారాలుంటే ఇబ్బంది పెట్టకుండా ప్రజాహితంగా పనులు చేయాలని సూచించినట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల వేళ...‘కూపన్ల’ ఎర..!
[ 27-04-2024]
ప్రజాదరణ కోల్పోయిన అధికార పార్టీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారాలు, ర్యాలీలు జనం లేక వెలవెలబోతున్నాయి. -
పింఛనుదారులకు జగన్ వంచన
[ 27-04-2024]
మలివయసులో కృష్ణా, రామా అనుకుంటూ ప్రశాంతంగా గడపాల్సిన పింఛన్దారులకు హక్కుగా రావాల్సిన భత్యాలతోపాటు పెన్షన్ సొమ్ములూ సకాలంలో ఇవ్వకుండా ముప్పతిప్పలు పెడుతున్నారు. -
అరకులోయ వైకాపాలో వర్గపోరు
[ 27-04-2024]
అరకులోయ నియోజకవర్గ వైకాపాను వర్గపోరు వెంటాడుతోంది. క్యాడర్ను అభ్యర్థి సమన్వయం చేసుకోవడం లేదు. -
పరిశోధనల సిరికి జగన్ ఉరి
[ 27-04-2024]
వ్యవసాయ శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేస్తూ ఉంటారు. వాటిలో కొన్ని విజయవంతం అవుతుంటాయి. అవి రైతుల దరికి చేరితే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించడం వీలవుతుంది. -
కలిసికట్టుగా కూటమిని గెలిపించండి
[ 27-04-2024]
వైకాపాకు ఓటుతో బుద్ధి చెప్పి రాష్ట్రం నుంచి పారదోలుదామని పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి పిలుపునిచ్చారు. -
కళ్ల ముందే దుంగలు..ఎవరు దొంగలు?
[ 27-04-2024]
ఏజెన్సీ ప్రాంతంలో అటవీ సిబ్బంది అండదండలతో విలువైన టేకు, మారుజాతి దుంగలను అక్రమార్కులు తరలించుకుపోతున్నారు. -
జిల్లాలో 63 నామినేషన్లకు ఆమోదం
[ 27-04-2024]
అల్లూరి జిల్లాలో 68 మంది అభ్యర్థులు 103 నామినేషన్లు దాఖలు చేశారు. -
జనావాసాల్లో ఆసుపత్రి వ్యర్థాలు
[ 27-04-2024]
ప్రతిపక్ష కౌన్సిలర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డుల అభివృద్ధికి నిధుల కేటాయింపులో పుర పాలకవర్గం వివక్ష చూపుతోంది. -
రెండు కిలోమీటర్ల రోడ్డు.. వంద గుంతలు
[ 27-04-2024]
పర్యటక పాంతం, ప్రముఖ పుణ్యక్షేత్రమైన రంప గ్రామానికి రోడ్డు వేయాలని అయిదేళ్లగా అధికారులకు, ప్రజాప్రతినిధులకు గిరిజనులు మొరపెట్టుకొన్నారు. -
వైకాపా రాక్షస పాలనకు చరమగీతం పాడాలి
[ 27-04-2024]
ప్రజలు తమ విలువైన ఓటుతో వైకాపా రాక్షస పాలనకు చరమగీతం పాడాలని సినీనటుడు హైపర్ ఆది పిలుపునిచ్చారు. -
నేడు వైఎస్ షర్మిల పర్యటన
[ 27-04-2024]
పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. -
శ్రీకాకుళం రోడ్- తిరుపతి ప్రత్యేక రైళ్లు
[ 27-04-2024]
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పలు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘విశాఖ- మలేసియా’ విమాన సర్వీసు ప్రారంభం
[ 27-04-2024]
విమాన ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తామని విమానాశ్రయం డైరెక్టర్ ఎస్.రాజారెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!