ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెదేపాదే గెలుపు: అనిత
ఇటీవల జరిగిన ‘మహానాడు’తో రాష్ట్ర రాజకీయాలు మలుపు తిరిగాయని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలుగుదేశం పార్టీ గెలుపు తథ్యమని తెదేపా మహిళా విభాగ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు.
విశాఖపట్నం, న్యూస్టుడే: ఇటీవల జరిగిన ‘మహానాడు’తో రాష్ట్ర రాజకీయాలు మలుపు తిరిగాయని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలుగుదేశం పార్టీ గెలుపు తథ్యమని తెదేపా మహిళా విభాగ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఆమె విలేకర్లతో మాట్లాడారు. తొలిదశ మేనిఫెస్టోకు లభించిన ప్రజాదరణ చూసి వైకాపా నేతలు, మంత్రుల్లో వణుకు మొదలైందన్నారు. ఈ మేనిఫెస్టోలోని అంశాలపై వైకాపా మంత్రులు ఏవేవో మాట్లాడడం దారుణమన్నారు. సీఎం జగన్ ఇచ్చిన హామీల్లో 45ఏళ్లు వచ్చిన మహిళలకు పింఛను, దశలవారీ మద్యపాన నిషేధం, ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల, ఇంటింటికి కుళాయి, సీపీఎస్ రద్దు ఇంతవరకు అమలు చేయలేకపోయారని ఆరోపించారు. గంజాయి, డ్రగ్స్లో ఏపీ ముందంజలో ఉందని.. ఇదేనా పురోగతి అని వ్యాఖ్యానించారు. చంద్రబాబును ఉద్దేశించి స్పీకర్ తమ్మినేని చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. చంద్రబాబుకు వెన్నుదన్నుగా 70లక్షల మంది తెదేపా సైన్యం ఉందన్నారు. నిజంగా ప్రజాదరణ ఉంటే..గడపగడపకు వెళ్లేటప్పుడు వైకాపా నేతలకు పోలీసు భద్రత ఎందుకని అనిత ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
TS News: తెలంగాణలో ఓటర్ల జాబితా విడుదల.. వర్గాల వారీగా ఇదీ లెక్క!
-
Devara: ‘దేవర’.. ఒక్క సంభాషణా కట్ చేయలేం.. పార్ట్ 2 ప్రకటించిన కొరటాల శివ
-
Rahul Gandhi: అమ్మకు రాహుల్ సర్ప్రైజ్ గిఫ్ట్.. ఏమిచ్చారంటే..?
-
Supriya Sule: ‘హనీమూన్’ ముగియక ముందే.. మహా ప్రభుత్వంలో ముసలం?
-
Raviteja: ఆ పదాన్ని వాడడం మానేయాలని అభ్యర్థిస్తున్నా: రవితేజ
-
Vivo mobiles: 50MP సెల్ఫీ కెమెరాతో వీవో కొత్త ఫోన్లు.. ధర, ఫీచర్లివే..!