కార్మికులపై కరకు మనసు!!
‘మాట్లాడితే చాలు పేదలకు, పెత్తందారులకు మధ్య పోటీ’ అని చెబుతుంటారు సీఎం జగన్. మరి అదే పేదలు కంపెనీల్లో ఒళ్లు గుల్ల చేసుకుని పని చేస్తూ అనారోగ్యాల బారిన పడుతున్నా వారిపై కనీస కనికరం కూడా చూపడం లేదు ఆయన.
కబుర్లతో కష్టజీవులకు ఒనగూరిందేంటి?
ప్రాణాలకు విలువివ్వని జగన్ సర్కార్
ఈనాడు, అనకాపల్లి - న్యూస్టుడే, అచ్యుతాపురం, అనకాపల్లి పట్టణం
‘మాట్లాడితే చాలు పేదలకు, పెత్తందారులకు మధ్య పోటీ’ అని చెబుతుంటారు సీఎం జగన్. మరి అదే పేదలు కంపెనీల్లో ఒళ్లు గుల్ల చేసుకుని పని చేస్తూ అనారోగ్యాల బారిన పడుతున్నా వారిపై కనీస కనికరం కూడా చూపడం లేదు ఆయన. కార్మికుల ఆరోగ్యాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేశారు. వారికి హక్కుగా కల్పించాల్సిన సదుపాయాలను దూరం చేశారు. అచ్యుతాపురం పరిసరాల్లో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మించి కార్మికుల ఆరోగ్యానికి భరోసా ఇస్తామన్న హామీలు గాలిలో కలిపేశారు.
అచ్యుతాపురం, పరవాడ ఫార్మా సెజ్లలో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఏటా పదుల సంఖ్యలో కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు. వందల సంఖ్యలో అస్వస్థతకు గురవుతున్నారు. అయినా వారికి స్థానికంగా కనీస వైద్య సేవలు అందించే పరిస్థితి లేకుండా పోయింది. కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు చిన్న సుస్తీ చేసినా అనకాపల్లి, విశాఖ జిల్లా కేంద్రాలకు పరుగులు పెట్టాల్సి వస్తోంది. వీరికి చేరువలో వైద్యసేవలు అందించేందుకు ఈఎస్ఐ ఆసుపత్రి మంజూరు చేసి మూడేళ్లయినా నిర్మాణం ప్రహరీ గోడ స్థాయి దాటలేదు.
ప్రమాదాల సమయంలోనే హడావుడి
పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగినప్పుడల్లా ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మిస్తామని హడావుడి చేయడం.. తర్వాత ఆ ఊసే ఎత్తకపోవడం అధికార పార్టీ నేతలకు పరిపాటిగా మారింది. ప్రత్యేక ఆర్థిక మండలిలో 208 రసాయన, ఫార్మా కంపెనీలతోపాటు ఇతర భారీ పరిశ్రమలున్నాయి. వీటిలో పనిచేసే కార్మికులకు ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని పలుమార్లు కార్మిక సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. ఆసుపత్రి నిర్మాణానికి అచ్యుతాపురం సెజ్లో 2 ఎకరాల స్థలాన్ని ఏపీఐఐసీ కేటాయించింది. ఈఎస్ఐ కార్పొరేషన్ పేరిట రిజిస్ట్రేషన్ కూడా చేశారు. ఆ తర్వాత నిర్మాణ పనులు ముందుకు కదల్లేదు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 1.48 లక్షలమంది కార్మికులుంటే అందులో 78 వేల మంది ఈఎస్ఐ పరిధిలో ఉన్నారు. కార్మికుల ఆరోగ్యం కంటే కంపెనీల నుంచి ముడుపుల వసూళ్లపైనే అధికార పార్టీ నేతలు దృష్టి పెట్టడంతోనే ఈఎస్ఐ ఆసుపత్రి సాకారం కావడం లేదని కార్మిక సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
నిర్మాణ కార్మికుల్లో నిస్తేజం: వైకాపా పాలనలో భవన నిర్మాణ కార్మికుల బ్రతుకులు దుర్భరంగా మారాయి. గతంలో కూలీల కోసం యజమానులు వెతుక్కోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఎప్పడు పని దొరుకుతుందా అని కూలీలు పనుల కోసం వేచి చూడాల్సి వస్తోంది. పెరిగిన ఇసుక ధర, సిమెంట్, ఇనుము ధరలు ఆకాశాన్ని అంటడంతో ఇంటి నిర్మాణాలపై యజమానులు ఆసక్తి చూపడం లేదు. దీంతో కూలీలకు పనులు దొరకడం లేదు. ముఖ్యంగా ఇసుక ధర పెరగడం డబ్బులు పెట్టి కొందామన్న అందుబాటులో లేకపోవడంతో చాలామంది నిర్మాణాలు ఆపేశారు. దీని ప్రభావం భవన నిర్మాణ కార్మికులపై పడింది. జిల్లాలోని అనకాపల్లి, చోడవరం, ఎలమంచిలి కార్మికశాఖ కార్యాలయాల పరిధిలో 1,10,069 మంది భవన నిర్మాణ కార్మికులు రిజిస్టర్ అయ్యారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డ్లో ఉన్న నిధులను జగన్ సర్కారు ఇతర అవసరాలకు వాడుకోవడంతో వీరి గోడు వినే నాథుడే లేకుండా పోయాడు.
అచ్యుతాపురం పరిసర ప్రాంతాల్లో 55 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరు ప్రతి వైద్య అవసరానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనకాపల్లి కానీ, 45 కిలోమీటర్ల దూరంలో విశాఖపట్నం కానీ వెళ్లాల్సి వస్తోంది. అనకాపల్లి దూరం తక్కువే అయినా అధ్వాన రోడ్డు కారణంగా ప్రయాణ సమయం గంట పడుతోంది. అత్యవసర సమయంలో ఇంత జాప్యం ప్రాణాంతకంగా మారుతోంది.
ఇవీ ప్రమాదాలు..
- 2022 డిసెంబర్లో పరవాడ ఫార్మాసిటీలోని లారస్ ల్యాబ్స్లో ప్రమాదం జరిగి అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు.
- పరవాడ ఫార్మాసిటీలోనే సాయినర్, మరికొన్ని రసాయన పరిశ్రమల్లో ప్రమాదాలు చోటుచేసుకుని కార్మికులు గాయపడ్డారు.
- సాహితి ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి ఆరుగురు చనిపోగా, మరో నలుగురు గాయపడ్డారు. ఇలా తరచూ ప్రమాదాలు చోటు చేసుకునేచోట ఆసుపత్రి సేవలు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలి.. అధికారులు, పాలకపక్ష నేతలు ఆ దిశగా చిత్తశుద్ధితో ప్రయత్నించక పోవడంతో కార్మికుల ప్రాణాలకు భద్రత లేకుండాపోతోంది.
- గతేడాది సీడ్స్ దుస్తుల తయారీ పరిశ్రమలోవిషవాయువు పీల్చి 539 మంది మహిళలు అస్వస్థతకు లోనయి అనకాపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందారు.
- ఎంఎఫ్జీ ఎఫ్ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి ఒకరు మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు.
అక్కడ బతుకుతెరువు లేక.. ఇక్కడ బతకలేక!: బతుకుతెరువు కోసం వచ్చిన కూలీల బతుకులు దుర్భరంగా మారాయి. అచ్యుతాపురం పరిసర పరిశ్రమల్లో 10 వేలమంది వరకు ఉత్తరప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బిహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు పనిచేస్తున్నారు. వీరంతా కోళ్లఫారాలను మరిపించే గుడారాల్లో దయనీయంగా జీవిస్తున్నారు. గతేడాది దుప్పితూరులో గుడారాల్లో నివాసం ఉంటున్న ఒడిశాకు చెందిన ముగ్గురు కార్మికులు డయేరియా లక్షణాలతో మృతిచెందారు.
వలస కార్మికులు వారి కుటుంబాలతో ఎక్కడ నివాసం ఉంటున్నారో అనే వివరాలేవీ జిల్లా యంత్రాంగం వద్ద లేకపోవడం... వీరి భద్రతపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికలనాటి ప్రేమ ఇప్పుడేమైంది..!
[ 21-05-2024]
వైకాపా సర్కారు అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు అభివృద్ధి పనుల జోలికే పోని నేతలు ఎన్నికల ముందు హడావిడి పనులకు శ్రీకారం చుట్టారు. రోడ్లపై గుంతలు పూడ్చేస్తామని, రహదారులను బాగుచేస్తామని, పట్టణాలను సుందరీకరిస్తామని, సెంట్రల్ లైటింగ్తో వెలుగులు నింపుతామని ఎక్కడలేని ప్రేమను ఒలకబోసి ఓటర్లకు గాలం వేశారు. -
కరకలో తవ్వకాలపై కన్నెర్ర
[ 21-05-2024]
అత్యంత విలువైన వైఢూర్యాలు (అలెక్స్ రకం రంగురాళ్లు) లభించే గొలుగొండ మండలం కరక రంగురాళ్ల క్వారీ చుట్టూరా గస్తీ పటిష్ఠం చేశారు. -
అప్రకటిత కోతలు.. అదనపు వాతలు
[ 21-05-2024]
ఎండలు మండిపోతే లోడ్ రిలీఫ్ పేరుతో కరెంటు సరఫరా నిలిపేస్తున్నారు.. వర్షం కురిసినా.. గాలి వీచినా అంతకంటే వేగంగా విద్యుత్తు సరఫరా ఆపేస్తున్నారు. -
చంద్రబాబు సీఎం కావడం ఖాయం
[ 21-05-2024]
రాబోయేది కూటమి ప్రభుత్వమేనని పాడేరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పేర్కొన్నారు. -
ఇసుక అక్రమ రవాణాపై చర్యలు
[ 21-05-2024]
అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ విజయసునీత హెచ్చరించారు. -
ఓట్ల లెక్కింపునకు పక్కా ఏర్పాట్లు
[ 21-05-2024]
రంపచోడవరంలో ఓట్ల లెక్కింపునకు పక్కా ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎం.విజయసునీత పేర్కొన్నారు. -
ఈవీఎంల భద్రతలో అప్రమత్తం
[ 21-05-2024]
స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అరకులోయ, పాడేరు అసెంబ్లీ నియోజకవర్గాలకు సబంధించిన ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్రూంల వద్ద పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశామని ఎస్పీ తుహిన్ సిన్హా, రిటర్నింగ్ అధికారులు వి.అభిషేక్, భావన తెలిపారు. -
ఐటీఐ శిక్షణతో ఉపాధి అవకాశాలు
[ 21-05-2024]
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగం సాధించాలంటే అర్హత ఒక్కటే సరిపోదు. -
అరకు పర్యటకానికి కొత్తరూపు
[ 21-05-2024]
ఆంధ్రాఊటీ అరకులోయలో ఐదు యూనిట్ల పరిధిలోని పర్యటకశాఖ అతిథిగృహాల మరమ్మతులకు అధికారులు చర్యలు చేపట్టారు. -
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
[ 21-05-2024]
వచ్చే నెల 4న ఓట్ల లెక్కింపు సందర్భంగా ర్యాలీలు, ఊరేగింపులతోపాటు బాణసంచా కాల్చడం పూర్తిగా నిషేధమని రంపచోడవరం సీఐ వాసా వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. -
మూడు రోజులు.. 112 కిలోల చందనం
[ 21-05-2024]
సింహాద్రి అప్పన్న స్వామి దేవాలయంలో సోమవారం మూడవ రోజు చందనం అరగదీత కార్యక్రమం కొనసాగింది. -
తెలంగాణ ఈసెట్లో విద్యార్థి సత్తా
[ 21-05-2024]
పరవాడ మండలం వాడచీపురుపల్లి పంచాయతీ పరిధి దళాయిపాలెం గ్రామానికి చెందిన ఆలవెల్లి ఖ్యాతీశ్వర్ సోమవారం విడుదలైన తెలంగాణ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష (టీఎస్ ఈసెట్) మెటలర్జికల్ విభాగంలో మొదటి ర్యాంకు సాధించాడు. -
24 నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు
[ 21-05-2024]
జిల్లాలో ఈనెల 24 నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ఏడు కేంద్రాల్లో జరగనున్నాయని జిల్లా విద్యాశాఖ అధికారి పి.బ్రహ్మాజీరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/05/24)
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
-
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్స్పోర్ట్స్