సముద్ర జలాల నుంచి భూములను కాపాడాలి
వేసవిలో సముద్ర జలాలు మురుగు కాలువల ద్వారా ముందుకు చొచ్చుకొచ్చి వేల ఎకరాల పంట భూములు దెబ్బతిని రెండో పంట సరిగ్గా పండటం లేదని శాసనమండలి చీఫ్విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. బాపట్ల కలెక్టరేట్లో
చివరి ఆయకట్టుకు నీరందేలా చర్యలు
జిల్లా సాగునీటి సలహా మండలి తొలి సమావేశంలో ప్రజాప్రతినిధులు
మాట్లాడుతున్న శాసనమండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వేదికపై చీరాల ఎమ్మెల్యే
కరణం బలరామకృష్ణమూర్తి, ఎమ్మెల్సీ పోతుల సునీత, కలెక్టర్ విజయకృష్ణన్ తదితరులు
బాపట్ల, న్యూస్టుడే : వేసవిలో సముద్ర జలాలు మురుగు కాలువల ద్వారా ముందుకు చొచ్చుకొచ్చి వేల ఎకరాల పంట భూములు దెబ్బతిని రెండో పంట సరిగ్గా పండటం లేదని శాసనమండలి చీఫ్విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. బాపట్ల కలెక్టరేట్లో జిల్లా సాగునీటి, వ్యవసాయ సలహామండలి తొలి సమావేశం గురువారం మధ్యాహ్నం నిర్వహించారు. ఉమ్మారెడ్డి మాట్లాడుతూ.. ఈ సమస్యతో భూగర్భ జలాలు ఉప్పగా మారి భూసారం దెబ్బతినడం వల్ల రెండో పంట కోల్పోయి రైతులు నష్టపోతున్నారని, సమస్యను తీవ్రంగా పరిగణించి పరిష్కారానికి అధికారులు శాస్త్రీయంగా కృషి చేయాలని సూచించారు. చెక్ డ్యాంల నిర్మాణం ద్వారా చాలావరకు సమస్య అరికట్టవచ్చన్నారు. హేచరీలు, రొయ్యల ప్రాసెసింగ్ ప్లాంట్ల నుంచి కలుషిత నీరు శుద్ధి చేయకుండా బయటకు వదలడం వల్ల పంటలు పండటం లేదని, నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి మాట్లాడుతూ.. జూన్ పదో తేదీనే నీరు విడుదల చేస్తున్నందున సాగు, మురుగు నీటి కాలువల్లో మరమ్మతులు వేగంగా చేయాలని అధికారులను ఆదేశించారు. సంతరావూరు వద్ద సాగనీటి కాలువలో మురుగు నీరు ప్రవహిస్తూ పంటలు ముంపు బారినపడి దెబ్బతిని రైతులు నష్టపోతున్నారని, సమస్య తక్షణమే పరిష్కరించాలన్నారు. ఎమ్మెల్సీ పోతుల సునీత మాట్లాడుతూ కుందేరువాగులోకి రొయ్యల ప్రాసెసింగ్ ప్లాంట్లు నుంచి కలుషిత నీరు విడుదల చేయటం వల్ల చీరాల మండలంలోని తీర గ్రామాల్లో పంటలు పండటం లేదన్నారు. కావూరివారిపాలెం, పాపాయపాలెం గ్రామాలకు నీరందించాలని కోరారు. కలెక్టర్ విజయకృష్ణన్ ప్రసంగిస్తూ కృష్ణా పశ్చిమ డెల్టాకు జూన్ 10న, సాగర్ ఆయకట్టుకు జులై 15న సాగునీరు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. కాలువల మరమ్మతుల కోసం రూ.రెండు కోట్లు కేటాయించినట్లు చెప్పారు. రూ.5 లక్షల లోపు పనులు నామినేషన్ పద్ధతిన కేటాయిస్తున్నట్లు జిల్లా జలవనరుల శాఖాధికారి మురళీకృష్ణ తెలిపారు. వ్యవసాయ సలహామండలి ఛైర్మన్ మంతెన దశరథమహారాజు, జిల్లా వ్యవసాయాధికారి అబ్దుల్ సత్తార్, ఏపీఎంఐపీ పీడీ జెన్నమ్మ, ఆర్డీవోలు రవీందర్, సరోజని, మత్స్యశాఖ జేడీ సురేష్, జలవనరుల శాఖ ఈఈలు వెంకటరత్నం, కృష్ణమోహన్, డీఈలు ప్రసాద్, అప్పారావు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాలకులు కా‘పాడి’న పాపాన పోలేదు
[ 27-04-2024]
లీటరు పాలకు రూ.4 బోనస్ ఇస్తానని, పాడి రైతులను ఆదుకుంటానని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్రెడ్డి హామీలు అమలు చేయకపోగా అమలులో ఉన్న పథకాలు రద్దు చేశారు. -
26 నామినేషన్ల తిరస్కరణ
[ 27-04-2024]
బాపట్ల లోక్సభ, జిల్లాలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 150 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. -
తెదేపా గూటికి మాజీ మంత్రి డొక్కా
[ 27-04-2024]
ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి, దళితుల్లో సీనియర్ నేత, గుంటూరు జిల్లా వైకాపా అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. -
బరిలో మిగిలేదెవరో?
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామపత్రాల సమర్పణ, పరిశీలన కార్యక్రమం ముగిసింది. ప్రధాన పార్టీలతో పాటు గుర్తింపు, నమోదైన పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు పెద్దఎత్తున నామపత్రాలు దాఖలు చేశారు. -
‘భూ’మంతర్ ఖాళీ
[ 27-04-2024]
రాష్ట్రంలో అత్యాధునిక సాంకేతికతతో భూముల రీసర్వే నిర్వహిస్తున్నాం. భూవివాదాలన్నీ శాశ్వతంగా పరిష్కరిస్తాం. -
ఒకే రాష్ట్రం- ఒకే రాజధాని మా లక్ష్యం
[ 27-04-2024]
-
గంజాయి బ్యాచ్ ఆగడాలపై నిరసన
[ 27-04-2024]
గంజాయి బ్యాచ్ ఆగడాలు భరించలేకున్నామంటూ.. వారిపై చర్యలు తీసుకోవాని శుక్రవారం రాత్రి గుంటూరు రాజీవ్గాంధీనగర్ వాసులు నిరసన తెలిపారు. -
నేత.. మొక్కల్లో మేత!
[ 27-04-2024]
అధికారమే అండగా ఆ ప్రజాప్రతినిధి కుటుంబం గుంటూరు నగరాన్ని చెరపట్టి మరీ దోచుకుంది. అల్లుడికి రోడ్లు, డ్రెయిన్ల కాంట్రాక్టు పనులు ఇప్పించుకోవడానికే పరిమితం కాలేదు. -
నిధులు నింపుకోవడానికి మేమే దొరికామా!
[ 27-04-2024]
ఎ.ఎన్.యు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆర్థికంగా దివాళ తీసే పరిస్థితిలో ఉందని, అందువల్లే మే 1 నుంచి ప్రారంభమయ్యే బీఈడీ పరీక్షలకు అదనంగా డబ్బులు చెల్లించాలని అధికారులు ఉత్తర్వులు ఇచ్చారని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. -
నాకు తెలియదు.. నాకు తెలియదు
[ 27-04-2024]
పొన్నూరు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి మురళీకృష్ణ భార్య, కుమార్తె ఆస్తుల వివరాలను అఫిడవిట్లో ఎందుకు పొందుపరచలేదని కూటమి నాయకులు ప్రశ్నిస్తే.. నాకు తెలియదు.. నాకు తెలియదు.. చెప్పడం ఏమిటిని పలువురు తప్పుపడుతున్నారు. -
‘బీసీలను నట్టేట ముంచిన జగన్’
[ 27-04-2024]
‘బీసీలు రాజ్యాధికారం చేపట్టాలంటే ఎన్డీఏ కూటమితోనే సాధ్యం. బీసీ ఉపప్రణాళిక నిధుల్ని దారి మళ్లించి జగన్ నమ్మక ద్రోహం చేశారు. -
గురువులపై బోధనేతర విధుల భారం
[ 27-04-2024]
గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వ ఉపాధ్యాయులపై వైకాపా ప్రభుత్వం కక్ష గట్టినట్లు వ్యవహరిస్తోందని పలుమార్లు ఉపాధ్యాయ సంఘాలే నేరుగా విమర్శలు గుప్పించాయి. -
భూ కక్ష
[ 27-04-2024]
మండలంలోని సమగ్ర భూ సర్వేకు గత ఏడాది ఏప్రిల్లో రెవెన్యూ యంత్రాంగం శ్రీకారం చుట్టింది. నూరు సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈ కార్యక్రమంలో అక్షాంశ, రేఖాంశాల సహితంగా ప్రతి ఒక్కరి పొలానికి పక్కా సరిహద్దులు నిర్ణయిస్తామని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!