కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు కొనసాగించాలి
అంబేడ్కర్ పేరు కోనసీమ జిల్లాకు కొనసాగించాలని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు గోళ్ల అరుణ్కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు లాడ్జికూడలిలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరును వ్యతిరేకిస్తూ కోనసీమలో విధ్వంస..
మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు అరుణ్కుమార్
లాడ్జికూడలిలో నిరసన ప్రదర్శన చేస్తున్న అరుణ్కుమార్ను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు
బ్రాడీపేట, న్యూస్టుడే: అంబేడ్కర్ పేరు కోనసీమ జిల్లాకు కొనసాగించాలని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు గోళ్ల అరుణ్కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు లాడ్జికూడలిలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరును వ్యతిరేకిస్తూ కోనసీమలో విధ్వంస వాతావరణాన్ని నెలకొల్పడంపై మాలమహానాడు, దళిత, ప్రజా సంఘాలు, బహుజన సంఘాల ఆధ్వర్యంలో బుధవారం శాంతియుత నిరసన ప్రదర్శన చేపట్టారు. ముందుగా నల్లబ్యాడ్జీలు, ప్లకార్డులు పట్టుకొని కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరును కొనసాగించాలని నినాదాలు చేశారు. ర్యాలీకి అనుమతి లేదంటూ గుంటూరు తూర్పు డీఎస్పీ సీతారామయ్య దళిత నాయకులను నిలువరించగా, శాంతియుతంగా తమ నిరసన ప్రదర్శన ఉంటుందని, 20 నిమిషాల పాటు అనుమతి ఇవ్వాలని కోరగా ఇచ్చారు. అంతలో మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు గోళ్ల అరుణ్కుమార్ రోడ్డుపై బైఠాయించి నిరసన చేపడతామని, అనుమతి ఇవ్వాలని కోరగా, డీఎస్పీ కుదరదని చెప్పడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. అంబేడ్కర్ పేరును వ్యతిరేకించి విధ్వంసం సృష్టిస్తుంటే చోద్యం చూసిన పోలీసులు శాంతియుతంగా నిరనస తెలియజేస్తామంటే తమను అడ్డుకోవడం సరికాదని, లాడ్జికూడలిలోని ప్రధాన రహదారిపై బైఠాయించారు. పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి దళిత నాయకులను అరెస్టు చేసే ప్రయత్నం చేశారు. నిరసన ప్రదర్శనను భగ్నం చేస్తే పోరాటం తీవ్రతరం చేస్తామని హెచ్చరించడంతో పోలీసులు మిన్నకుండిపోయారు. ఈ సందర్భంగా గోళ్ల అరుణ్కుమార్ మాట్లాడుతూ సాక్షాత్తు దళిత మంత్రి విశ్వరూప్ ఇంటిపైనే వందల సంఖ్యలో రౌడీమూకలు దాడులకు పాల్పడుతుంటే పోలీసులు నిలువరించలేకపోవడం ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టాలని, లేకపోతే త్వరలో చలో కోనసీమను నిర్వహిస్తామని హెచ్చరించారు. భీమ్సేనా సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లపు నీలాంబరం మాట్లాడుతూ భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించిన అంబేడ్కర్ పేరును కోనసీమ జిల్లాకు వ్యతిరేకించడం సిగ్గుచేటన్నారు. సుమారు రెండు గంటల పాటు అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు బత్తుల అనిల్కుమార్, బత్తుల వీరాస్వామి, చార్వాక, మద్దు అంకయ్య, వైకే, శిరిపురపు శ్రీధర్, జూపూడి శ్రీనివాస్, మాలమహానాడు రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు గోదా జాన్పాల్, చేబ్రోలు మనోరంజని, పిల్లి మేరి, గనిక జాన్సీ, దారా హేమప్రసాద్, జొన్నలగడ్డ శ్రీకాంత్, పాగళ్ల ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
బీఎస్పీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన
కోనసీమ జిల్లాలో జరుగుతున్న హింసకు కారకులైన వారిని వెంటనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు బొంతా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు వ్యతిరేకించి విధ్వంసానికి పాల్పడటంపై స్థానిక లాడ్జికూడలిలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద బుధవారం నిరసన ప్రదర్శన చేపట్టారు. కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు నల్లపు నీలాంబరం, చింతా రామ్ప్రసాద్, చిరతనగండ్ల వాసు, మణికుమారి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాలకులు కా‘పాడి’న పాపాన పోలేదు
[ 27-04-2024]
లీటరు పాలకు రూ.4 బోనస్ ఇస్తానని, పాడి రైతులను ఆదుకుంటానని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్రెడ్డి హామీలు అమలు చేయకపోగా అమలులో ఉన్న పథకాలు రద్దు చేశారు. -
26 నామినేషన్ల తిరస్కరణ
[ 27-04-2024]
బాపట్ల లోక్సభ, జిల్లాలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 150 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. -
తెదేపా గూటికి మాజీ మంత్రి డొక్కా
[ 27-04-2024]
ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి, దళితుల్లో సీనియర్ నేత, గుంటూరు జిల్లా వైకాపా అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. -
బరిలో మిగిలేదెవరో?
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామపత్రాల సమర్పణ, పరిశీలన కార్యక్రమం ముగిసింది. ప్రధాన పార్టీలతో పాటు గుర్తింపు, నమోదైన పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు పెద్దఎత్తున నామపత్రాలు దాఖలు చేశారు. -
‘భూ’మంతర్ ఖాళీ
[ 27-04-2024]
రాష్ట్రంలో అత్యాధునిక సాంకేతికతతో భూముల రీసర్వే నిర్వహిస్తున్నాం. భూవివాదాలన్నీ శాశ్వతంగా పరిష్కరిస్తాం. -
ఒకే రాష్ట్రం- ఒకే రాజధాని మా లక్ష్యం
[ 27-04-2024]
-
గంజాయి బ్యాచ్ ఆగడాలపై నిరసన
[ 27-04-2024]
గంజాయి బ్యాచ్ ఆగడాలు భరించలేకున్నామంటూ.. వారిపై చర్యలు తీసుకోవాని శుక్రవారం రాత్రి గుంటూరు రాజీవ్గాంధీనగర్ వాసులు నిరసన తెలిపారు. -
నేత.. మొక్కల్లో మేత!
[ 27-04-2024]
అధికారమే అండగా ఆ ప్రజాప్రతినిధి కుటుంబం గుంటూరు నగరాన్ని చెరపట్టి మరీ దోచుకుంది. అల్లుడికి రోడ్లు, డ్రెయిన్ల కాంట్రాక్టు పనులు ఇప్పించుకోవడానికే పరిమితం కాలేదు. -
నిధులు నింపుకోవడానికి మేమే దొరికామా!
[ 27-04-2024]
ఎ.ఎన్.యు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆర్థికంగా దివాళ తీసే పరిస్థితిలో ఉందని, అందువల్లే మే 1 నుంచి ప్రారంభమయ్యే బీఈడీ పరీక్షలకు అదనంగా డబ్బులు చెల్లించాలని అధికారులు ఉత్తర్వులు ఇచ్చారని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. -
నాకు తెలియదు.. నాకు తెలియదు
[ 27-04-2024]
పొన్నూరు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి మురళీకృష్ణ భార్య, కుమార్తె ఆస్తుల వివరాలను అఫిడవిట్లో ఎందుకు పొందుపరచలేదని కూటమి నాయకులు ప్రశ్నిస్తే.. నాకు తెలియదు.. నాకు తెలియదు.. చెప్పడం ఏమిటిని పలువురు తప్పుపడుతున్నారు. -
‘బీసీలను నట్టేట ముంచిన జగన్’
[ 27-04-2024]
‘బీసీలు రాజ్యాధికారం చేపట్టాలంటే ఎన్డీఏ కూటమితోనే సాధ్యం. బీసీ ఉపప్రణాళిక నిధుల్ని దారి మళ్లించి జగన్ నమ్మక ద్రోహం చేశారు. -
గురువులపై బోధనేతర విధుల భారం
[ 27-04-2024]
గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వ ఉపాధ్యాయులపై వైకాపా ప్రభుత్వం కక్ష గట్టినట్లు వ్యవహరిస్తోందని పలుమార్లు ఉపాధ్యాయ సంఘాలే నేరుగా విమర్శలు గుప్పించాయి. -
భూ కక్ష
[ 27-04-2024]
మండలంలోని సమగ్ర భూ సర్వేకు గత ఏడాది ఏప్రిల్లో రెవెన్యూ యంత్రాంగం శ్రీకారం చుట్టింది. నూరు సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈ కార్యక్రమంలో అక్షాంశ, రేఖాంశాల సహితంగా ప్రతి ఒక్కరి పొలానికి పక్కా సరిహద్దులు నిర్ణయిస్తామని అధికారులు పేర్కొన్నారు.