కోర్టుకు గైర్హాజరైన ఎస్సైకి అరెస్టు వారెంట్
ఓ కేసులో కోర్టు సమన్లు అందుకొని విచారణకు హాజరు కాని ఎస్సైకి అరెస్టు వారెంట్ జారీ చేస్తూ మొదటి అదనపు జిల్లా జడ్జి చిన్నంశెట్టి రాజు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు.
మచిలీపట్నం కార్పొరేషన్, న్యూస్టుడే: ఓ కేసులో కోర్టు సమన్లు అందుకొని విచారణకు హాజరు కాని ఎస్సైకి అరెస్టు వారెంట్ జారీ చేస్తూ మొదటి అదనపు జిల్లా జడ్జి చిన్నంశెట్టి రాజు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. 2017 జూన్ 6న మచిలీపట్నం శివారు హర్ష కళాశాల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మచిలీపట్నానికి చెందిన ప్రత్తిపాటి శ్రీధర్కు తీవ్ర గాయాలయ్యాయి. మోటారు వాహనాల చట్ట ప్రకారం తనకు జరిగిన నష్టానికి పరిహారం ఇప్పించాలని మొదటి అదనపు జిల్లా కోర్టులో ఆయన పిటీషన్ దాఖలు చేశారు. కేసు విచారణలో భాగంగా రోడ్డు ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసిన బందరు తాలూకా పోలీస్స్టేషన్ అప్పటి ఎస్సై కె.శ్రీనివాసుని ఈనెల 6వ తేదీన కోర్టుకు హాజరై సాక్ష్యం చెప్పాలని న్యాయస్థానం నుంచి సమన్లు జారీ అయ్యాయి. సమన్లు అందుకున్న ఆయన కోర్టుకు హాజరు కాకపోవడంతో న్యాయమూర్తి అరెస్ట్ వారెంట్ జారీ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్