యువత పెడదోవ
చదువుకుని ప్రయోజకులుగా ఎదగాల్సిన వయస్సులో యువత పెడదోవ పడుతోంది. వీరిని లక్ష్యంగా చేసుకుని నగరంలో విక్రయాలు సాగుతున్నాయి.
విద్యార్థులే లక్ష్యంగా గంజాయి విక్రయాలు
నగరంలో విస్తరిస్తున్న విష సంస్కృతి
ఈనాడు, అమరావతి
చదువుకుని ప్రయోజకులుగా ఎదగాల్సిన వయస్సులో యువత పెడదోవ పడుతోంది. వీరిని లక్ష్యంగా చేసుకుని నగరంలో విక్రయాలు సాగుతున్నాయి. ఫలితంగా మత్తుకు బానిసలుగా మారి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. గంజాయి రవాణాదారులు తాము ఎక్కడా దొరక్కుండా విద్యార్థులతోనే అంతా నడిపిస్తున్నారు. ఇటీవల కొండపల్లిలోని ఓ ఇంట్లో 12 మంది యువకులు పుట్టిన రోజు వేడుకల్లో గంజాయి వినియోగిస్తూ పోలీసులకు దొరికిపోయారు. విజయవాడకు చెందిన సస్పెక్ట్ షీటర్ నుంచి సరఫరా అయినట్లు గుర్తించారు. మైలవరంలో గంజాయి విక్రయించే ఇద్దరు యువకులు.. పుట్టిన రోజు వేడుకకు రెండు కిలోల గంజాయిని సిద్ధం చేస్తూ సెబ్ పోలీసులకు పట్టుబడ్డారు. సరఫరా అవుతున్న దాంట్లో టాస్క్ఫోర్స్, ఎస్ఈబీ, డీఆర్ఐ అధికారులకు దొరుకుతోంది స్వల్పమే.
గుట్టుచప్పుడు కాకుండా బెజవాడకు...
విజయవాడ గంజాయి రవాణా ఏఓబీ సరిహద్దుల నుంచి చేరుతోంది. నగరం మీదుగా హైదరాబాద్, పుణె, ముంబయి, బెంగళూరు, చెన్నై సరఫరా అవుతోంది. అక్రమ రవాణా పకడ్బందీగా సాగుతోంది. గంజాయి సరఫరా చేసేందుకు ఏజెన్సీ ప్రాంతాల్లోని నిరుపేదలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. వారికి సరకును గమ్యస్థానాలకు చేర్చినందుకు కమీషన్ రూపంలో నగదు చెల్లిస్తున్నారు. పోలీసుల తనిఖీల్లో ఏజెంట్లు మాత్రమే దొరుకుతున్నారు. విక్రయించే దళారులు, గంజాయి మాఫియా వెనుకు ఉన్న కీలక నిందితుల ఆచూకీ కనిపెట్టలేకపోతున్నారు. కార్లు, ద్విచక్ర వాహనాలు, రైళ్లలో అధికంగా రవాణా జరుగుతోంది. బస్సుల్లో సైతం గుట్టుచప్పుడు కాకుండా రవాణా చేస్తున్నారు.
విద్యా సంస్థల చుట్టుపక్కల..
విజయవాడ, పరిసర ప్రాంతాల్లోని కళాశాలల్లో ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిన పలువురు చదువుతుంటారు. వీరిలో కొందరు మత్తుకు అలవాటుపడ్డారు. దీనిని ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. తమ ఆర్థిక అవసరాలకు గంజాయి సరఫరా చేస్తున్నారు. వీరు బాగా నమ్మకస్థులకే అందిస్తుంటారు. ఫోన్ చేస్తే చాలు రెక్కలు కట్టుకుని వచ్చి వాలిపోతున్నారు. విద్యా సంస్థల చుట్టుపక్కల ఉండే కిళ్లీషాపులు, పూల దుకాణాలు, బడ్డీ కొట్లలో గంజాయి విక్రయాలు కొనసాగుతున్నాయి. కృష్ణలంక, పటమట, మాచవరం, గుణదల, రైల్వేస్టేషన్, అజిత్సింగ్నగర్, నున్న, భవానీపురం, వన్టౌన్, టూటౌన్, తదితర ప్రాంతాల్లో అడ్డాలుగా మారాయి.
సరఫరాదారులుగా మారుతున్న విద్యార్థులు
బెజవాడలో మత్తు పదార్థాల విక్రయం అధికమైంది. స్థానిక విద్యార్థులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి చదువుకునే విద్యార్థులు అలవాటుపడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతం నుంచి సరకును తెప్పించి గుట్టుగా ఇక్కడ చలామణి చేస్తున్నారు. దీనిని అరికట్టడానికి నగర పోలీసులు పలు చర్యలు తీసుకుంటున్నారు. నిఘాను ఎంత తీవ్రం చేసినా వీరి కళ్లుగప్పి రహస్యంగా చేరవేస్తున్నారు. విద్యార్థులే విక్రేతలుగా మారుతున్నారు. కొందరైతే ఏజెన్సీకి వెళ్లి కొనుగోలు చేసి ఇక్కడకు తెస్తున్నారు.
మత్తు మందు ఆనవాళ్లు
* ఇటీవల కాకినాడకు చెందిన యువకుడు బెంగళూరు నుంచి ఎండీఎంఏ (మిథలీన్ డైఆక్సీ మెటాఫెటామిన్) అనే సింథటిక్ డ్రగ్ను రవాణా చేస్తూ విజయవాడలో పోలీసులకు పట్టుబడ్డాడు. గత ఆరు నెలలుగా ఇలా బెంగళూరు నుంచి తూర్పుగోదావరికి తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. విజయవాడలో ఏమైనా సరఫరా చేసేవాడా? అన్నది ఇంకా తేలాల్సి ఉంది.
* చెన్నై పోలీసులు గతేడాది విజయవాడలోని మందుల దుకాణాల్లో విస్తృంగా తనిఖీలు నిర్వహించారు. ఇక్కడి మందుల దుకాణాల నుంచి చెన్నైలోని విద్యార్థులకు ట్రైడాల్ అనే మాత్రలు విచ్చలవిడిగా విక్రయిస్తున్నట్టు కొనుగొన్నారు. నగరంలోని మూడు మందుల దుకాణాల నుంచి బిల్లులు లేకుండా ముఠా సభ్యులు మాత్రలను భారీఎత్తున కొనుగోలు చేసి తమిళనాడు తరలిస్తున్నట్లు గుర్తించారు.
* గతేడాది నగరం నుంచి ఓ పార్సిల్లో 4.5 కిలోల ఎఫిడ్రిన్ను పట్టు చీరల మధ్యలో పెట్టి విదేశాలకు పంపించారు. ఇక్కడి నుంచి వెళ్లే వాటిపై పెద్దగా నిఘా ఉండదని గమనించి.. చెన్నైకు చెందిన వ్యక్తి విజయవాడ వచ్చి ఆస్ట్రేలియాకు పంపించాడు. పొరపాటున ఆస్ట్రేలియాకు వెళ్లాల్సిన పార్సిల్ కెనడాకు వెళ్లడంతో ఈ ముఠా కార్యకలాపాలు వెలుగుచూశాయి.
* కమిషనరేట్ పరిధిలో గంజాయి రవాణా, వినియోగంపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టామని, విస్తృతంగా తనిఖీలు చేస్తున్నామని పోలీసు కమిషనర్ కాంతిరాణా ‘ఈనాడు’తో చెప్పారు. ముఖ్యంగా విద్యా సంస్థల వద్ద నిఘా ఉంచడంతో పాటు అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని వివరించారు. టాస్క్ఫోర్స్ కార్యాలయంలో ప్రత్యేకంగా కౌన్సెలింగ్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. ఇందులో తల్లిదండ్రుల సమక్షంలో సైకాలజిస్ట్లతో కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నామన్నారు. అధికంగా తీసుకునే వారిని డీ-అడిక్షన్ సెంటర్కు పంపుతున్నామని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎంపీ బాలశౌరిపై.. పేర్ని కుతంత్రాలు!
[ 27-04-2024]
జనసేన, తెదేపా, భాజపా కూటమి అభ్యర్థిగా.. మచిలీపట్నం లోక్సభ బరిలో దిగిన.. ఎంపీ బాలశౌరికి జనంలో వస్తున్న ఆదరణను చూసి.. వైకాపా జిల్లా అధ్యక్షుడు పేర్ని నానికి ఓటమి భయం పట్టుకుంది. బాలశౌరిని నేరుగా ఢీకొట్టలేక.. అడ్డదారుల్లో ఓడించాలని తీవ్రంగా కుతంత్రాలు ఆరంభించారు. -
బందరులో ఓ తిక్కసన్నాసి ఉన్నారు: బాలశౌరి
[ 27-04-2024]
విజయం అనేది కష్టపడితే వస్తుంది..ప్రజలకు మేలు చేస్తే ఆశీర్వదిస్తారు.. కానీ బందరులో ఓ తిక్కసన్నాసి ఉన్నారు.. ఓటమి భయం పట్టుకుని తన పేరుతో ఉన్న వ్యక్తులతో నామినేషన్లు వేయించారని ఎమ్మెల్యే పేర్ని నానీని ఉద్దేశించి కూటమి మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి బాలశౌరి పరోక్షంగా విమర్శించారు. -
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
[ 27-04-2024]
ఉంగుటూరు మండలం ఎలుకపాడులో సర్వే నంబరు 31/1లో 50 మంది దళితులకు అసైన్డ్ భూమి కేటాయించారు. పాసుపుస్తకాలు కూడా అందాయి. వీరిలో నలుగురి వివరాలే ఆన్లైన్ అయ్యాయి. -
113 నామపత్రాలకు ఆమోదం
[ 27-04-2024]
జిల్లాలోని పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు దాఖలైన వాటిలో 113 నామపత్రాలు సక్రమంగా ఉన్నట్లు ఎన్నికల అధికారులు నిర్ధారించారు. అన్ని రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో శుక్రవారం నామపత్రాలు పరిశీలన కార్యక్రమం నిర్వహించారు. -
‘ఏ ముఖం పెట్టుకుని ఓట్లడగడానికి వస్తారు’
[ 27-04-2024]
గన్నవరం నియోజకవర్గానికి చెందిన అంబాపురం పంచాయతీ నగరానికి చేరువుగా ఉన్నా.. అభివృద్ధి జాడ మాత్రం కన్పించడం లేదు. అంతరవలయ రహదారికి ఒకవైపు నగరపాలకసంస్థ అందమైన రహదారులతో, తాగునీరు, కాలువలతో సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంటే.. -
తలపడలేక.. తొండాట!
[ 27-04-2024]
సారూప్యం ఉన్న పేర్లతో నామినేషన్ల జిమ్మిక్కులు.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి ప్రత్యర్థికి నష్టం కలిగించే ఎత్తుగడలు.. అసంబద్ధ ఫిర్యాదులు.. ఇలా ఎన్నో వ్యూహాలు.. ఎత్తుగడల మధ్య నామినేషన్ల పరిశీలన క్రతువు ముగిసింది. -
మిగులు పనుల పూర్తికి ఐదేళ్లా..!
[ 27-04-2024]
తెదేపా హయాంలో కానూరు వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో యాజమాన్యం వారు సొంత నిధులు వెచ్చించి వంతెన నిర్మించారు. కొన్ని పనులు మిగిలిపోయాయి. వాటిని పూర్తి చేయడానికి ఇంకా రూ.2.50 కోట్లు అవసరం. -
కాంగ్రెస్ను గెలిపిస్తే ప్రత్యేక హోదా.. రుణమాఫీ
[ 27-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే రాష్ట్రానికి పదేళ్లు ప్రత్యేకహోదా వస్తుందని, రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ అవుతుందని; పోలవరం, అమరావతి నిర్మాణం శరవేగంగా జరుగుతుందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చెప్పారు. -
గురువులపై కక్షగట్టి
[ 27-04-2024]
వైకాపా పాలనలో గురువులపై ఒత్తిడి పెరిగింది. పాఠాలు చెప్పడంతోనే వారి బాధ్యత తీరిపోలేదు. యాప్లో అటెండెన్స్ ఆలస్యంగా వేసినా, ఏదైనా ప్రధాన కారణం చేత స్పాట్ వాల్యుయేషన్కు హాజరు కాకపోయినా, బయోమెట్రిక్ వాడకపోయినా సంజాయిషీ తాఖీదు తప్పదు. -
సర్వే అన్నారు.. భూవిస్తీర్ణం తగ్గించారు
[ 27-04-2024]
భూ సంబంధిత సమస్యలన్నింటినీ శాశ్వతంగా పరిష్కరించడంతోపాటు వివాదాలు తలెత్తకుండా హద్దులు ఏర్పాటు చేసి అందరికీ మళ్లీ భూహక్కు పత్రాలు అందిస్తాం. దీని కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వినియోగిస్తున్నాం. -
ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపుతా
[ 27-04-2024]
ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజాప్రతినిధులను రీకాల్ చేసే విధానం రావాలని, పశ్చిమ నియోజకవర్గంలో ముస్లింలకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని కేంద్ర మాజీ మంత్రి, ఎన్డీయే కూటమి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి పేర్కొన్నారు. -
విజయవాడ ఎంపీ బరిలో 19 నామినేషన్ల ఆమోదం
[ 27-04-2024]
విజయవాడ లోక్సభ స్థానానికి సంబంధించి నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. సక్రమంగా ఉన్న 19 నామినేషన్లు చెల్లుబాటయ్యాయి. వివిధ కారణాలతో 15 నామినేషన్లను తిరస్కరించినట్టు రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు.