logo

గంగూరులో వైకాపా భారీ తాయిలాలు

ఎన్నికల వేళ ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి అధికార వైకాపా చేయని ప్రయత్నం అంటూ లేదు. మంత్రి జోగి రమేష్‌ బరిలో ఉన్న పెనమలూరు నియోజకవర్గంలో ఓటర్లకు పంపిణీ చేయడానికి ఆ పార్టీ నాయకులు పోరంకి-గంగూరు సరిహద్దున ఉన్న ఏవీఎం గార్డెన్స్‌లో భారీగా బహుమతులు భద్రపర్చారు.

Published : 08 May 2024 04:43 IST

జోగి రమేష్‌ ఇలాకాలో పంపిణీకి సిద్ధం చేసిన అధికార పార్టీ నాయకులు

పెనమలూరు, న్యూస్‌టుడే: ఎన్నికల వేళ ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి అధికార వైకాపా చేయని ప్రయత్నం అంటూ లేదు. మంత్రి జోగి రమేష్‌ బరిలో ఉన్న పెనమలూరు నియోజకవర్గంలో ఓటర్లకు పంపిణీ చేయడానికి ఆ పార్టీ నాయకులు పోరంకి-గంగూరు సరిహద్దున ఉన్న ఏవీఎం గార్డెన్స్‌లో భారీగా బహుమతులు భద్రపర్చారు.

ఈ సమాచరం అందుకున్న ప్రత్యేక పోలీస్‌ బృందం మంగళవారం రాత్రి అక్కడకు వెళ్లి తనిఖీలు చేపట్టగా.. లోపల తాయిలాలు, గృహోకరణాలు తదితర వస్తువులు, పార్టీ ప్రచార సామగ్రి పెద్ద ఎత్తున దాచి ఉన్నట్టు గుర్తించారు. పదుల సంఖ్యలో ఉన్న పెట్టెలు, మూటలను విప్పి తనిఖీలు చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యే సరికి అర్ధరాత్రి 2గంటలవుతుందని అధికారులు తెలిపారు. ఇందులో ప్రముఖ కంపెనీలకు చెందిన ప్లాస్క్‌లు, వాటర్‌ బాటిళ్లు ఇతర ఉపకరణాలు ఉన్నాయి. నగదు కూడా ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు