ఓట్ల లెక్కింపునకు పక్కా ఏర్పాట్లు
జిల్లాలో పోలింగ్ ప్రక్రియ పూర్తయిన క్రమంలో.. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. ఏర్పాట్లపై కలెక్టరేట్లో గురువారం అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు.
ముందుగా లెక్కించేది పోస్టల్ బ్యాలట్లే
ఎన్టీఆర్ కలెక్టరేట్, న్యూస్టుడే : జిల్లాలో పోలింగ్ ప్రక్రియ పూర్తయిన క్రమంలో.. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. ఏర్పాట్లపై కలెక్టరేట్లో గురువారం అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ముందుగా పోస్టల్ బ్యాలట్లను లెక్కించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఇబ్రహీంపట్నం మండలం జూపూడిలోని నోవా, నిమ్రా కళాశాలల్లో ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. స్ట్రాంగ్ రూమ్ల నుంచి ఈవీఎంలను తరలించడానికి, అభ్యర్థులు, ఏజెంట్లు వెళ్లడానికి వేర్వేరు మార్గాలు ఏర్పాటు చేయాలని సూచించారు. బారికేడ్లు ఏర్పాట్లు చేయాలని, ఎలాంటి సమస్యలు రాకుండా, ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. అసెంబ్లీ, పార్లమెంటుకు ఒక్కోదానికి 14 చొప్పున 28 టేబుళ్లు ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ.. కచ్చితమైన ఫలితాలను త్వరితగతిన ప్రకటించేలా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలతో పటిష్ఠమైన మూడు అంచెల భద్రత ఉన్నట్లు తెలిపారు. స్ట్రాంగ్ రూమ్లు, తలుపులకు వేసిన సీళ్లు, సెక్యూరిటీ, పరిసరాలు కనిపించేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేసిన సీసీ కెమెరాలు, భద్రత పర్యవేక్షణపై నియమించిన గెజిటెడ్ అధికారులు, పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. గుర్తింపు కార్డులేని వ్యక్తులు, అనధికార వ్యక్తులు, ఇతరుల వాహనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించవద్దని స్పష్టం చేశారు. డీఆర్వో వి.శ్రీనివాసరావు, కలెక్టరేట్ ఏవో నాగలక్ష్మి, జిల్లా ఎన్నికల విభాగ సూపరింటెండెంటు ఎం.దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ బ్రాంచ్లకూ.. కొలువులున్నాయ్..
[ 14-06-2024]
ఉమ్మడి జిల్లా ఇంజినీరింగ్ కళాశాలల్లో బీకేటగిరీ సీట్లలో ప్రవేశాలు జరుగుతున్నాయి. దీనికితోడు ఇటీవల ఈఏపీసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. -
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి
[ 14-06-2024]
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు కృత్తివెన్ను మండలం సీతనపల్లి వద్ద హైవేపై లారీ, కంటైనర్ ఢీకొన్నాయి. -
ప్రగతి సారథీ సాహో.. అమరావతీ జయహో...
[ 14-06-2024]
నవ్యాంధ్రకు రెండోసారి ముఖ్యమంత్రిగా వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయానికి వెళుతున్న చంద్రబాబుకు అన్నదాతలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా పూలవర్షం కురిపించి అభిమానం చాటుకున్నారు. -
భలే మంచి రోజు!
[ 14-06-2024]
రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు బాధ్యతలు చేపట్టిన తొలిరోజే.. సమాజంలోని వివిధ వర్గాల జీవితాల్లో వెలుగులు నింపే ఐదు అంశాలపై కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. -
మంత్రి కొల్లుకు ఎస్పీ అభినందన
[ 14-06-2024]
రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్రను జిల్లా ఎస్పీ నయీమ్ అస్మి గురువారం విజయవాడ నివాస గృహంలో కలిసి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. -
భయం వద్దు.. మీ స్థలాలు మీవే
[ 14-06-2024]
రాష్ట్రవ్యాప్తంగా ఏ ఒక్కరూ భూకబ్జా ముఠాలకు భయపడొద్దని, ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. -
రైల్వే రిజర్వేషన్ కౌంటర్ మూసివేత
[ 14-06-2024]
విజయవాడ-విశాఖ రైలు మార్గంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో విజయవాడ తర్వాత కీలక రైల్వేస్టేషన్గా గుర్తింపు పొందిన నూజివీడు(హనుమాన్జంక్షన్) స్టేషన్లో రిజర్వేషన్ కౌంటర్ మూసివేశారు. -
అటు వర్షం.. ఇటు అంధకారం..!
[ 14-06-2024]
నగరంలో గురువారం రాత్రి భారీ వర్షం పడింది. రహదారులన్నీ జలమయమయ్యాయి. మోకాళ్ల లోతులో నీరు నిలిచిపోయింది. విద్యుత్తు సరఫరా నిలిపివేయడంతో చీకట్లు అలముకున్నాయి. -
మోగిన బడి గంట
[ 14-06-2024]
కొత్త విద్యాసంవత్సరం ఆరంభం వేళ.. గురువారం ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. నగరంలోని విద్యార్థులు తమ తమ పాఠశాలలకు తరలిరావడంతో సందడి వాతావరణం నెలకొంది. -
రాష్ట్ర భవిష్యత్తు బంగారమే..
[ 14-06-2024]
రాష్ట్ర భవిష్యత్తు అంతా ఇకపై బంగారం కానుందని.. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేస్తారని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. -
పాఠ్యపుస్తకాలపై మారని జగన్, బొత్స పేర్లతో ముందుమాట
[ 14-06-2024]
పాఠశాలల పునఃప్రారంభం తొలి రోజునే పాఠశాల విద్యాశాఖ తప్పిదం కనిపించింది. రాష్ట్ర ప్రభుత్వం మారినా ఇంకా ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి, విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్లతోనే పాఠ్య పుస్తకాలపై ముందు మాట ఉంది. -
సర్వతోముఖాభివృద్ధే ప్రధాన ధ్యేయం: ఎంపీ
[ 14-06-2024]
మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నట్టు ఎంపీ వల్లభనేని బాలశౌరి స్పష్టం చేశారు. -
చెన్నై- సంత్రాగచి ప్రత్యేక రైలు
[ 14-06-2024]
ప్రయాణికుల సౌకర్యార్థం చెన్నై సెంట్రల్ నుంచి సంత్రాగచికి ప్రత్యేక రైలు నడపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైలు నంబరు 06005/06006 ఈ నెల 13న చెన్నై సెంట్రల్లో బయలుదేరింది.
తాజా వార్తలు (Latest News)
-
మెగా డీఎస్సీపై చంద్రబాబు తొలి సంతకం.. ఎస్వీ యూనివర్సిటీలో సంబరాలు
-
సూపర్-8 పోరుకు ముందే.. ఆ ఇద్దరు స్వదేశానికి!
-
ప్రమాణస్వీకారం చేసిన మరుసటి రోజే సీఎం సతీమణి రాజీనామా
-
‘కాళేశ్వరం’పై కొనసాగుతున్న జస్టిస్ పీసీ ఘోష్ విచారణ
-
జులై 22న కేంద్ర బడ్జెట్.. జులై 3న ఆర్థిక సర్వే..!
-
చిరు ‘విశ్వంభర’లో బాలీవుడ్ నటుడు.. అధికారికంగా ప్రకటించిన టీమ్