ఆర్టీసీ బస్సును ఢీకొన్న కారులో గంజాయి
రావులపాలెం మండలం రావులపాడు ఆర్టీసీ డిపో వద్ద జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సును ఓ కారు బలంగా ఢీకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మరమ్మతులకు
రావులపాలెం పట్టణం, న్యూస్టుడే: రావులపాలెం మండలం రావులపాడు ఆర్టీసీ డిపో వద్ద జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సును ఓ కారు బలంగా ఢీకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మరమ్మతులకు గురైన ఆర్టీసీ బస్సును మరో బస్సు సాయంతో డిపోలోకి తీసుకువెళుతుండగా మంగళవారం తెల్లవారుజామున రాజమహేంద్రవరం వైపునుంచి వస్తున్న కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. కారులో విజయవాడకు చెందిన ఏడుగురు వ్యక్తులున్నట్లు గుర్తించారు. వారిలో సూర్య, వంశీలకు తీవ్రగాయాలు కావడంతో రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. పి.శశికుమార్, ఎన్.సంపత్, ఎం.విజయకుమార్, శ్రీను పోలీసుల అదుపులో ఉండగా ఫయాజ్ పరారయ్యాడు. వీరు విశాఖ జిల్లా పాడేరు నుంచి గంజాయి తీసుకుని విజయవాడ వెళుతున్నారు. కారులో 10 కేజీల సరకు ఉందని, రోడ్డు ప్రమాదంపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై భానుప్రసాద్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!