వైకాపా అక్రమాలపై.. కనం, వినం, మాట్లాడం!
చెడు చూడం.. చెడు వినం.. చెడు మాట్లాడం అన్న మూడు కోతుల సిద్ధాంతాన్ని వైకాపా నాయకుల విషయంలో ఉమ్మడి అనంత జిల్లా మైనింగ్ అధికారులు సంపూర్ణంగా పాటిస్తున్నారు.
కొనసాగుతున్న ఇసుక తవ్వకాలు
ఎన్జీటీ ఆదేశాలు బేఖాతరు
చోద్యం చూస్తున్న అధికారులు
పెద్దపప్పూరు రీచ్లో కొనసాగుతున్న తవ్వకాలు
ఈనాడు డిజిటల్, అనంతపురం: చెడు చూడం.. చెడు వినం.. చెడు మాట్లాడం అన్న మూడు కోతుల సిద్ధాంతాన్ని వైకాపా నాయకుల విషయంలో ఉమ్మడి అనంత జిల్లా మైనింగ్ అధికారులు సంపూర్ణంగా పాటిస్తున్నారు. నాయకులు చేసే అక్రమాలను పరిశీలించే సమయం వారికి ఉండటం లేదు. ఎవరైనా చెప్పినా వినేంత తీరిక లేదు. ఇక అక్రమాలపై వివరణ అడిగితే మాత్రం ఆమడ దూరం పారిపోతారు. రాష్ట్ర పర్యావరణ ప్రభావ మదింపు సంస్థ (ఎస్ఈఏఏ) తాజాగా పర్యావరణ అనుమతులు ఇచ్చే వరకు రాష్ట్రంలోని అన్ని ఇసుక రీచ్(రేవు)లలో తవ్వకాలు నిలిపివేయాలని జాతీయ హరిత ట్రైబ్యునల్ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. కానీ, ఉమ్మడి అనంత జిల్లాలో అన్నిచోట్ల తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఎన్జీటీ ఆదేశాల అమలుపై మైనింగ్ అధికారులు నోరు మెదపడం లేదు. సెబ్ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. రెండు విభాగాలను పర్యవేక్షించాల్సిన కలెక్టర్లు ఎన్జీటీ ఆదేశాలను పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఉమ్మడి అనంత జిల్లాలో పెన్నా, చిత్రావతి, వేదవతి నదుల్లో ఎక్కడికక్కడ వైకాపా నాయకులు ఇసుకను కొల్లగొడుతున్నారు. భారీ ఉల్లంఘనల కారణంగా ఇప్పటికే నదులు సహజ స్వరూపాన్ని కోల్పోయాయి. ఉల్లంఘనలపై ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న పాపానపోలేదు. పైగా అక్రమ తవ్వకాలపై నిరసన వ్యక్తం చేసిన తెదేపా నాయకులపైనే కేసులు పెట్టి వేధిస్తున్నారు.
చక్రం తిప్పుతున్న మాజీ ఎమ్మెల్యే
రాష్ట్రంలో ఇసుక తవ్వకాలన్నీ జేపీ వెంచర్స్ సంస్థకు అప్పగించారు. కానీ, ఎక్కడికక్కడ వైకాపా నాయకులు సబ్లీజుకు తీసుకుని నిర్వహిస్నున్నారు. ఉమ్మడి జిల్లాలో అనంతపురానికి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే ఇసుక రీచ్ల్లో తవ్వకాలు జరుపుతున్నారు. అనుమతులు లేని ప్రాంతాల్లోనూ తవ్వి కర్ణాటకకు తరలిస్తున్నారు. ఇటీవల వేదవతి నదిలో అనుమతి లేకుండా తరలించిన ఘటనలో విజిలెన్స్ అధికారులు ఆయన పాత్రపై స్పష్టమైన నివేదిక ఇచ్చారు. అయినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. సదరు మాజీ ఎమ్మెల్యేకు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో సత్సంబంధాలు ఉండటంతో జిల్లా అధికారులు సైతం ఆయన అక్రమాలపై నోరెత్తడం లేదు. ఏడాది కాలంగా జిల్లాలో ఆయన ఆధ్వర్యంలో జరిగిన ఇసుక అక్రమ రవాణా విలువ సుమారు రూ.100 కోట్లు ఉంటుందని అంచనా. దీంతోపాటు శ్రీసత్యసాయి జిల్లాలోని ఉప్పలపాడు రేవును ధర్మవరం కీలక నేత నడిపిస్తున్నారు. ఒకచోట అనుమతులు తీసుకుని మరోచోట తవ్వకాలు జరుపుతున్నారు. రీచ్లో 3 అడుగులు (ఒక మీటరు) తవ్వాల్సి ఉండగా.. 10 నుంచి 20 అడుగులు తవ్వుతున్నారు. దీంతో నదులు, చెరువులు సహజ రూపాన్ని కోల్పోతున్నాయి. దీనిపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అక్రమాలపై ఏడీ మౌనం
వైకాపా నాయకులు చేస్తున్న అక్రమాలను మైన్స్ శాఖ ఏడీ నాగయ్య చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ఎన్ని అక్రమాలు జరుగుతున్నా మౌనంగా ఉంటున్నారని, ఎన్ని ఫిర్యాదులు వచ్చినా బుట్టదాఖలు చేస్తున్నారనే విమర్శలున్నాయి. పెద్దపప్పూరు మండల కేంద్రం సమీపంలో ఇసుక రేవులో అనుమతులు లేకుండానే నెల రోజుల పాటు తవ్వకాలు జరిగాయి. దీనిపై విజిలెన్స్ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి అక్రమాలు నిజమేనని తేల్చారు. సుమారు రూ.కోటి విలువైన ఇసుకను ఎలాంటి అనుమతులు లేకుండా తవ్వినట్లు అప్పట్లోనే నివేదిక ఇచ్చారు. అయితే ఇప్పటివరకు దానిపై కనీస చర్యలు కూడా తీసుకోకపోవడం గమనార్హం. ఈ విషయంపై ‘ఈనాడు’ వివరణ కోరగా సమాధానం దాటవేశారు.
ప్రేక్షక పాత్రలో సెబ్ అధికారులు
అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన సెబ్ అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ధర్మవరం, రాయదుర్గం, కళ్యాణదుర్గం, పెనుకొండ నియోజకవర్గాల నుంచి నిత్యం కర్ణాటకకు తరలిపోతోంది. ఎక్కడా నియంత్రణ చర్యలు తీసుకోవడం లేదు. సరిహద్దుల్లో చెక్పోస్టులు ఎత్తివేయడంతో అక్రమ రవాణాకు అడ్డూఅదుపు లేకుండాపోయింది. రాయదుర్గం పరిధిలో వేదవతి నది నుంచి అనతపురం మాజీ ఎమ్మెల్యే అధ్వర్యంలో రోజుకు వంద టిప్పర్లలో సరకు బళ్లారికి తరలిపోతోంది. స్థానికంగా సెబ్స్టేషన్ ఉన్నా ఎక్కడా అడ్డుకోవడం లేదు. ఇసుక అక్రమ తవ్వకాలపై అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల కలెక్టర్లను వివరణ కోరేందుకు ‘ఈనాడు’ ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అరాచకం.. నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం
[ 17-05-2024]
జిల్లా పోలీసు అధికారి అమిత్ బర్దార్పై ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు వేసింది. శాఖాపరమైన విచారణకూ ఆదేశించింది. -
నిరీక్షించి.. ఉక్కపోతతో సొమ్మసిల్లి
[ 17-05-2024]
ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో సేవలు పొందేందుకు వస్తున్న రోగుల అవస్థలు అన్నీ ఇన్నీకావు. గతంలో ఉన్న ఓపీ కౌంటర్లను అత్యవసర విభాగం వద్ద ఉన్న ఒక రేకుల షెడ్డులోకి మార్పు చేశారు. -
వస్తోంది ఖరీఫ్ సీజన్.. ఏదీ విత్తన కేటాయింపు?
[ 17-05-2024]
జూన్ ఒకటో తేదీ నుంచి ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతోంది. జిల్లాలో ప్రధాన పంట వేరుసెనగ. ఇప్పటికే వేరుసెనగ కాయలు శుద్ధిచేసి మండల కేంద్రాల్లోని గోదాముల్లో భద్రపరిచి, కావాల్సిన రైతుల పేర్లు నమోదు చేయాల్సి ఉంది. -
విచక్షణారహిత దాడులు అమానుషం: రామకృష్ణ
[ 17-05-2024]
జిల్లా సీపీఐ, ఏఐటీయూసీ నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గురువారం ప్రకటనలో ఖండించారు. -
డీఎస్పీ చైతన్యపై హత్యాయత్నం కేసు పెట్టాలి: తెదేపా
[ 17-05-2024]
తాడిపత్రిలో తెదేపా నాయకులు, కార్యకర్తలపట్ల అత్యంత కిరాతకంగా వ్యవహరించిన డీఎస్పీ చైతన్యపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ డిమాండ్ చేశారు. -
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ఠ భద్రత
[ 17-05-2024]
అనంత జేఎన్టీయూ భవన సముదాయంలో భద్ర పరిచిన ఈవీఎంల స్ట్రాంగ్ రూంలను కలెక్టర్ వినోద్కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. -
వేసవిలో చల్లని సేవ
[ 17-05-2024]
వేసవిలో ఎండలు మండుతున్నాయి. చిన్నారులతో మొదలు పండుటాకుల వరకు వేడికి తట్టుకోలేకపోతున్నారు. -
పేద మహిళలకు జీవనోపాధి కల్పనే లక్ష్యం
[ 17-05-2024]
పేద మహిళలకు జీవనోపాధి కల్పించడమే ప్రధాన లక్ష్యమని నాబార్డు డీజీఎం అనురాధ పేర్కొన్నారు. అనంతపురం గ్రామీణం చంద్రబాబు కొట్టాలలో కార్డు ఆధ్వర్యంలో పేద మహిళలకు.. -
విద్యుత్తు కార్యాలయంలో ఎస్ఈ జన్మదిన వేడుకలు
[ 17-05-2024]
విద్యుత్తుశాఖ ఎస్ఈ సురేంద్ర జన్మదిన వేడుకలను అనంతపురం విద్యుత్తుశాఖ ప్రధాన కార్యాలయం ఎస్ఈ ఛాంబర్లో నిర్వహించడం విమర్శలకు తావిస్తోంది. -
రైల్వే కంట్రోల్ కార్యాలయం.. సేవలు పూజ్యం
[ 17-05-2024]
రైళ్ల రాకపోకలను నియంత్రించడంలో ప్రధాన భూమిక పోషించేది కంట్రోల్ కార్యాలయం. గుంతకల్లు డివిజన్ గుండా వెళ్లే రైళ్లను లోకోపైలెట్లు ఎక్కడ వాటిని ఎక్కడ నిలపాలి అనేది కంట్రోల్ కార్యాలయంలో పనిచేసే కంట్రోలర్లు సూచిస్తారు. -
ఉత్సాహం ఉరకలు.. ప్రోత్సహిస్తే మెరికలు
[ 17-05-2024]
వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేందుకు చిన్నారులు, విద్యార్థులు క్రీడా శిక్షణ శిబిరాలకు వస్తున్నారు. ఆర్డీటీ క్రీడాగ్రామంలో వివిధ క్రీడాంశాలలో జోరుగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. -
అగ్ని ప్రమాదాల నివారణ చర్యలేవీ?
[ 17-05-2024]
సోమందేపల్లి, గోరంట్ల మండలాల పరిధిలోని గుడిపల్లి, పాలసముద్రం నడుమ పారిశ్రామికవాడలో అనేక పరిశ్రమలు ఏర్పాటు అవుతూ రోజురోజుకు విస్తరిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ నిర్ణయం నాకు ముందే చెప్పాడు: కోహ్లీ
-
హింసపై ఈసీకి సీఈవో నివేదిక.. కీలక నేతల అరెస్టులకు అవకాశం?
-
రివ్యూ: విద్య వాసుల అహం.. ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎలా ఉందంటే?
-
పాక్ వద్ద అణ్వస్త్రాలున్నా.. నిర్వహణకు డబ్బుల్లేవు కదా! - మోదీ
-
ధోనీ నుంచి అసలైన షో చూడబోతున్నాం: భారత మాజీ క్రికెటర్
-
కేజ్రీవాల్ ఇంటి నుంచి వీడియో వెలుగులోకి.. ‘హిట్మ్యాన్’ అంటూ స్వాతీమాలీవాల్ పోస్టు