అనంతలో తెదేపా నాయకుడి అరెస్టు
అనంతపురం గ్రామీణం రామకృష్ణ కాలనీలో ఇరువర్గాల ఘర్షణ, తెదేపా నాయకుడు జయరాం నాయుడి అరెస్టు ఉద్రిక్తతకు దారితీసింది. ఓ వర్గాన్ని రెచ్చగొట్టి నగేశ్పై దాడి చేయించాడనే కారణంతో వన్టౌన్ పోలీసులు బుధవారం తెల్లవారు జామున జయరాం నాయుడిని అరెస్టు చేశారు.
రామకృష్ణకాలనీ దాడి ఘటనలో ప్రమేయం ఉందంటున్న పోలీసులు
త్రీటౌన్ పోలీస్స్టేషన్ ఎదుట తెదేపా శ్రేణుల ఆందోళన
ఎన్నికల పరిశీలకుడికి ఫిర్యాదు చేస్తున్న, వెంకటశివుడు యాదవ్, దగ్గుపాటిప్రసాద్, అంబికా లక్ష్మీనారాయణ, తదితరులు
అనంత నేరవార్తలు, కళ్యాణదుర్గంరోడ్డు, న్యూస్టుడే: అనంతపురం గ్రామీణం రామకృష్ణ కాలనీలో ఇరువర్గాల ఘర్షణ, తెదేపా నాయకుడు జయరాం నాయుడి అరెస్టు ఉద్రిక్తతకు దారితీసింది. ఓ వర్గాన్ని రెచ్చగొట్టి నగేశ్పై దాడి చేయించాడనే కారణంతో వన్టౌన్ పోలీసులు బుధవారం తెల్లవారు జామున జయరాం నాయుడిని అరెస్టు చేశారు. ఆయనతోపాటు మరికొందరిపై దాడి, హత్యాయత్నం, అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అతడి అరెస్టు తెలుసుకున్న తెదేపా శ్రేణులు, నాయకులు పెద్ద ఎత్తున వన్టౌన్ పోలీస్స్టేషన్ వద్దకు చేరుకుని ఆందోళన నిర్వహించారు. త్రీటౌన్ పోలీస్స్టేషన్లో ఉంచారన్న సమాచారంతో నాయకులంతా అక్కడికెళ్లి స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించారు. అనంతపురం అర్బన్ తెదేపా, జనసేన, భాజపా ఉమ్మడి అభ్యర్థి దగ్గుబాటి వెంకటప్రసాద్, తెదేపా జిల్లా అధ్యక్షుడు శివుడు యాదవ్, కార్పొరేటర్ హరిత, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి లక్ష్మీనరసింహ, తదితరులు పోలీసుల ఏకపక్ష ధోరణిని నిరసిస్తూ ధర్నా చేశారు. డీఎస్పీ వీర రాఘవరెడ్డి, ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జయరాం నాయుడిని ఎక్కడికి తీసుకెళ్లారో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఓటమి భయంతోనే: తెదేపా నాయకులు
ఈ అరెస్టుపై దగ్గుబాటి ప్రసాద్ మాట్లాడుతూ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డికి ఓటమి భయం పట్టుకుందని, అందుకే పోలీసులను అడ్డుపెట్టుకుని తెదేపా నాయకులపై అక్రమ కేసులు పెట్టిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్పీ వీరరాఘవరెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జయరాం నాయుడి భార్య సతీమణి హరిత మాట్లాడుతూ.. నెల క్రితం వరకు వైకాపా ఉన్నామని, అక్కడ పరిస్థితులు నచ్చక తెదేపా చేరామని..దీన్ని మనసులో ఉంచుకుని కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని ఆమె అన్నారు. అర్బన్ డీఎస్పీ, వన్టౌన్ సీఐ రెడ్డెప్పలను ఇక్కడి నుంచి బదిలీ చేస్తే తప్ప ఎన్నికలు ప్రశాంతంగా జరిగే అవకాశం లేదన్నారు.
ఎన్నికల పరిశీలకుడికి ఫిర్యాదు
ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డికి తొత్తుగా వ్యవహరిస్తున్న డీఎస్పీ వీరరాఘవరెడ్డి, సీఐ రెడ్డెప్ప సస్పెండ్ చేయాలని తెదేపా నాయకులు డిమాండ్ చేశారు. దగ్గుబాటి ప్రసాద్, అంబికా లక్ష్మీనారాయణ, జిల్లా తెదేపా అధ్యక్షుడు శివుడు యాదవ్ పార్టీ శ్రేణులతో కలిసి ఎన్నికల పరిశీలకులు రవికుమార్కు వినతిపత్రం అందజేశారు. రామకృష్ణ కాలనీలో వ్యక్తిగత కారణాలతో ఇరువర్గాల వారు గొడవ పడితే డీఎస్పీ ఉద్దేశపూర్వకంగా అరెస్టు చేశారన్నారు. జయరాం నాయుడిని బుధవారం రాత్రి వరకూ త్రీటౌన్ స్టేషన్లో ఉంచారు. హత్యాయత్నం సెక్షను నమోదు కావడంతో జైలుకు తరలించే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అరాచకం.. నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం
[ 17-05-2024]
జిల్లా పోలీసు అధికారి అమిత్ బర్దార్పై ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు వేసింది. శాఖాపరమైన విచారణకూ ఆదేశించింది. -
నిరీక్షించి.. ఉక్కపోతతో సొమ్మసిల్లి
[ 17-05-2024]
ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో సేవలు పొందేందుకు వస్తున్న రోగుల అవస్థలు అన్నీ ఇన్నీకావు. గతంలో ఉన్న ఓపీ కౌంటర్లను అత్యవసర విభాగం వద్ద ఉన్న ఒక రేకుల షెడ్డులోకి మార్పు చేశారు. -
వస్తోంది ఖరీఫ్ సీజన్.. ఏదీ విత్తన కేటాయింపు?
[ 17-05-2024]
జూన్ ఒకటో తేదీ నుంచి ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతోంది. జిల్లాలో ప్రధాన పంట వేరుసెనగ. ఇప్పటికే వేరుసెనగ కాయలు శుద్ధిచేసి మండల కేంద్రాల్లోని గోదాముల్లో భద్రపరిచి, కావాల్సిన రైతుల పేర్లు నమోదు చేయాల్సి ఉంది. -
విచక్షణారహిత దాడులు అమానుషం: రామకృష్ణ
[ 17-05-2024]
జిల్లా సీపీఐ, ఏఐటీయూసీ నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గురువారం ప్రకటనలో ఖండించారు. -
డీఎస్పీ చైతన్యపై హత్యాయత్నం కేసు పెట్టాలి: తెదేపా
[ 17-05-2024]
తాడిపత్రిలో తెదేపా నాయకులు, కార్యకర్తలపట్ల అత్యంత కిరాతకంగా వ్యవహరించిన డీఎస్పీ చైతన్యపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ డిమాండ్ చేశారు. -
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ఠ భద్రత
[ 17-05-2024]
అనంత జేఎన్టీయూ భవన సముదాయంలో భద్ర పరిచిన ఈవీఎంల స్ట్రాంగ్ రూంలను కలెక్టర్ వినోద్కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. -
వేసవిలో చల్లని సేవ
[ 17-05-2024]
వేసవిలో ఎండలు మండుతున్నాయి. చిన్నారులతో మొదలు పండుటాకుల వరకు వేడికి తట్టుకోలేకపోతున్నారు. -
పేద మహిళలకు జీవనోపాధి కల్పనే లక్ష్యం
[ 17-05-2024]
పేద మహిళలకు జీవనోపాధి కల్పించడమే ప్రధాన లక్ష్యమని నాబార్డు డీజీఎం అనురాధ పేర్కొన్నారు. అనంతపురం గ్రామీణం చంద్రబాబు కొట్టాలలో కార్డు ఆధ్వర్యంలో పేద మహిళలకు.. -
విద్యుత్తు కార్యాలయంలో ఎస్ఈ జన్మదిన వేడుకలు
[ 17-05-2024]
విద్యుత్తుశాఖ ఎస్ఈ సురేంద్ర జన్మదిన వేడుకలను అనంతపురం విద్యుత్తుశాఖ ప్రధాన కార్యాలయం ఎస్ఈ ఛాంబర్లో నిర్వహించడం విమర్శలకు తావిస్తోంది. -
రైల్వే కంట్రోల్ కార్యాలయం.. సేవలు పూజ్యం
[ 17-05-2024]
రైళ్ల రాకపోకలను నియంత్రించడంలో ప్రధాన భూమిక పోషించేది కంట్రోల్ కార్యాలయం. గుంతకల్లు డివిజన్ గుండా వెళ్లే రైళ్లను లోకోపైలెట్లు ఎక్కడ వాటిని ఎక్కడ నిలపాలి అనేది కంట్రోల్ కార్యాలయంలో పనిచేసే కంట్రోలర్లు సూచిస్తారు. -
ఉత్సాహం ఉరకలు.. ప్రోత్సహిస్తే మెరికలు
[ 17-05-2024]
వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేందుకు చిన్నారులు, విద్యార్థులు క్రీడా శిక్షణ శిబిరాలకు వస్తున్నారు. ఆర్డీటీ క్రీడాగ్రామంలో వివిధ క్రీడాంశాలలో జోరుగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. -
అగ్ని ప్రమాదాల నివారణ చర్యలేవీ?
[ 17-05-2024]
సోమందేపల్లి, గోరంట్ల మండలాల పరిధిలోని గుడిపల్లి, పాలసముద్రం నడుమ పారిశ్రామికవాడలో అనేక పరిశ్రమలు ఏర్పాటు అవుతూ రోజురోజుకు విస్తరిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
భారత వృద్ధిరేటు అంచనాలను గణనీయంగా పెంచిన ఐరాస
-
వివేకా హత్య కేసు.. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన ఎంపీ అవినాష్రెడ్డి
-
నువ్వు కొత్త ప్లేయర్వి కాదు.. వరల్డ్ కప్లో సత్తా చాటాలి: గంభీర్
-
సైలెంట్గా ఓటీటీలోకి ‘కృష్ణమ్మ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
-
కొత్తవలసలోని జిందాల్ పరిశ్రమ మూసివేత
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!