PM Modi: ఈడీ సీజ్ చేసిన నోట్లగుట్టలను ఏం చేస్తామంటే.. మోదీ కీలక వ్యాఖ్యలు
PM Modi: అవినీతి కేసుల్లో ఈడీ స్వాధీనం చేసుకున్న సొమ్మును పేదలకు పంచిపెట్టాలని యోచిస్తున్నామని, ఇందుకు న్యాయ సలహాలను తీసుకుంటామని ప్రధాని మోదీ వెల్లడించారు.
దిల్లీ: దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) గట్టిగా బదులిచ్చారు. కాంగ్రెస్ హయాంలో ఈడీ నిరుపయోగంగా ఉండిపోయిందని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాతే సమర్థంగా పనిచేయడం ప్రారంభించిందని తెలిపారు. ఈ సందర్భంగా అవినీతి కేసుల్లో ఈడీ (ED Raids) స్వాధీనం చేసుకుంటున్న నోట్ల గుట్టలపై ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దాన్ని పేదలకు తిరిగి పంచే అవకాశాలను అన్వేషిస్తున్నట్లు తెలిపారు.
‘‘గత ప్రభుత్వాల హయాంలో కొందరు వ్యక్తులు అధికార బలంతో తమ పదవులను దుర్వినియోగం చేసి పేదల సొమ్మును దోచుకున్నారు. ఆ డబ్బంతా తిరిగి వారికి చెందాలని కోరుకుంటున్నా. ఇందుకోసం న్యాయబృందం సలహా కోరుతాం. చట్టపరంగా మార్పులు చేయాల్సి వస్తే దానికీ వెనుకాడబోం. దర్యాప్తు సంస్థ స్వాధీనం చేసుకున్న సొత్తు (Money Seized by ED)ను ఏం చేయాలో సలహా ఇవ్వాలని ఇప్పటికే న్యాయవ్యవస్థను కోరా’’ అని ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని వెల్లడించారు.
అటల్ సేతుపై రష్మిక వీడియో.. స్పందించిన మోదీ
400 మార్క్.. అక్కడి నుంచే
ఈ ఇంటర్వ్యూలో ప్రధాని పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 400 సీట్లు సాధిస్తుందంటూ భాజపా నేతలు ధీమా వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. దీన్ని మోదీ ప్రస్తావిస్తూ.. ‘‘దీని గురించి నేను ముందెన్నడూ చెప్పలేదు. గెలుస్తామా ఓడుతామా? అన్నది కూడా మాట్లాడలేదు. 400 సీట్లు గెలుస్తామని ప్రజలే మాలో విశ్వాసం నింపారు. వాళ్ల దృక్పథం నాకు తెలుసు. 2019 ఎన్నికల నుంచే మా కూటమికి 400 స్థానాల మెజార్టీ ఉంది. ఈసారి 400 మార్క్ దాటాలని మా నేతలకు చెప్పాం’’ అని మోదీ తెలిపారు.
ఇక, హిందూ-ముస్లిం రాజకీయాలంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలను ప్రధాని తిప్పికొట్టారు. వారి బుజ్జగింపు రాజకీయాలను బయటపెడుతున్నందుకే తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వాలంటీర్ వ్యవస్థ రద్దు కాలేదు: ఏపీ మంత్రి నిమ్మల
ఏపీలో ఎన్నికలు ముగిసి.. ప్రభుత్వం ఏర్పాటు కావడంతో వాలంటీర్ వ్యవస్థపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ కొనసాగుతోంది -
మంత్రులకు శాఖల కేటాయింపు.. కొనసాగుతున్న చంద్రబాబు కసరత్తు
ఆంధ్రప్రదేశ్లో మంత్రులుగా ప్రమాణం చేసిన 24మందికి శాఖల కేటాయింపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. -
ఎంపీటీసీ పదవికి రాజీనామా చేసిన కర్నూలు ఎంపీ నాగరాజు
కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు.. ఎంపీటీసీ పదవికి రాజీనామా చేశారు. -
నన్ను కలిసేందుకు వచ్చేవారు బొకేలు, శాలువాలు తేవొద్దు: పవన్
రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్కు ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. -
‘కళ్లు మూసుకుంటే ఐదేళ్లు అయిపోయాయి..’ జగన్ కామెంట్స్ వైరల్
YS Jagan: పార్టీ ఎమ్మెల్సీలతో జరిగిన సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడిన తీరు సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవుతోంది. -
మెగా డీఎస్సీపై చంద్రబాబు తొలి సంతకం.. 16,347 పోస్టులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం సాయంత్రం సచివాలయం మొదటిబ్లాక్లో తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. -
లోక్సభ ఎన్నికల్లో దూకుడు.. ‘మహా’ పట్టుకు శరద్ పవార్ ప్రయత్నాలు
మరికొన్ని నెలల్లో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే తమ పార్టీ రాష్ట్రంపై పూర్తి పట్టు కోసం ప్రయత్నిస్తున్నట్లు ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ పేర్కొన్నారు. -
మాది ప్రజా ప్రభుత్వం.. ప్రచార ప్రభుత్వం కాదు: తెదేపా ఎంపీ కలిశెట్టి
తమది కూల్చే ప్రభుత్వం కాదని.. ఆస్తులు కాపాడే ప్రభుత్వమని విజయనగరం తెదేపా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. -
ఫలితాలు అసంతృప్తిని మిగిల్చాయి
లోక్సభ ఎన్నికల్లో పార్టీ సాధించిన ఫలితాలపై అసంతృప్తిగా ఉన్నామని, వాటిపై అంతర్గతంగా సమీక్షించుకుంటామని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పష్టం చేశారు. -
గాడి తప్పిన రాష్ట్రానికి పూర్వవైభవం తీసుకురావాలి
‘గడిచిన ఐదేళ్లలో విశృంఖల పాలనతో అన్ని విధాలుగా నాశనమైన రాష్ట్రాన్ని మళ్లీ మీరు (చంద్రబాబు) గాడిలో పెడతారన్న నమ్మకంతో ప్రజలు చారిత్రాత్మకమైన ఆధిక్యంతో అధికారంలోకి తీసుకొచ్చారు. -
అవినీతి పాలనను అంతమొందించారు: పురందేశ్వరి
గత ప్రభుత్వ అవినీతి పాలనతో విసిగిపోయిన ప్రజలు సార్వత్రిక ఎన్నికల్లో గట్టి బుద్ధి చెప్పారని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. -
ప్రమాణ స్వీకార వేదికపై అమిత్ షా, తమిళిసై సీరియస్ సంభాషణ!
చంద్రబాబు ప్రమాణ స్వీకార వేదికపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఏదో అంశంపై సీరియస్గా చర్చించుకుంటున్న వీడియో నెట్టింట వైరల్గా మారింది. -
పట్టించుకోని నాయకులకు పదవులెందుకు?
అయ్యా సమస్య వచ్చిందని చెబితే పట్టించుకోని నాయకులకు పదవులు ఎందుకని ఎంపీ అవినాష్రెడ్డి ఎదుట కడప వైకాపా కార్పొరేటర్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. -
సంక్షిప్తవార్తలు
మాచర్ల నియోజకవర్గం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పాల్పడిన నేరాలకు సంబంధించిన నాలుగు కేసులలో ప్రాసిక్యూషన్ తరఫున హైకోర్టులో వాదనలు వినిపించేందుకు న్యాయవాది ఎన్.అశ్వినీకుమార్ను రాష్ట్ర ప్రభుత్వం ‘స్పెషల్ కౌన్సిల్’గా నియమించింది. -
ఏక వ్యక్తి పాలనకు ప్రజల చరమగీతం: శరద్ పవార్
ప్రజాస్వామ్యానికి ఉన్న శక్తిని లోక్సభ ఎన్నికల్లో ప్రజలు చాటిచెప్పారని ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ అన్నారు. -
అరుణాచల్ సీఎంగా మళ్లీ పెమా ఖండూ
అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పెమా ఖండూ వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. రాష్ట్ర భాజపా శాసనసభాపక్ష నేతగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
ఎటూ తేల్చుకోలేకపోతున్నా
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తాను గెలుపొందిన వయనాడ్ (కేరళ), రాయ్బరేలీ (యూపీ) లోక్సభ నియోజకవర్గాల్లో దేనిని వదులుకోవాలనే దానిపై అయోమయంలో ఉన్నారు. -
భాగవత్ జీ! మీ సంరక్షణలోనే లోపం
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) ఇప్పుడు అసంబద్ధమైనదిగా మిగిలిందని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. -
యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జయారెడ్డి
యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కుమార్తె జయారెడ్డి నియమితులయ్యారు. -
రైతులకు భరోసా ఏదీ?
రైతుభరోసా పథకం కింద ఒక్కో సీజన్లో ఎకరాకు రూ.7,500 ఇస్తామన్న హామీ అమలుపై కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసిందని, డిసెంబరు 9న రైతుభరోసా అన్న ముఖ్యమంత్రి హామీలు, నీటి మీది రాతలే అని తేలిపోయిందని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి విమర్శించారు. -
నేడు భారాస ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారం
మహబూబ్నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గ భారాస ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి గురువారం ఉదయం శాసనమండలిలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో ఏం చేశారో ఐఏఎస్, ఐపీఎస్లు ఆత్మవిమర్శ చేసుకోవాలి: చంద్రబాబు
-
ఆ పోస్టర్లో మా నాన్నను చూస్తే భయమేసింది: వరుణ్ తేజ్
-
షకీబ్ అల్ హసన్ హాఫ్ సెంచరీ.. నెదర్లాండ్స్ లక్ష్యం 160
-
రోహిత్ శర్మది, నాది ఒకే స్కూల్: అమెరికా క్రికెటర్
-
రూ.15లక్షలకు ఒప్పందం.. 3లక్షలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీసీఎస్ ఇన్స్పెక్టర్
-
అమెరికా విద్యార్థి వీసా ప్రక్రియ షురూ.. గతేడాది కంటే ఎక్కువ!