కానుకలు ఎత్తివేత.. సరకుల్లో కోత
తెదేపా ప్రభుత్వ హయాంలో పండగలు వస్తే పేదలంతా పిండివంటకాలతో సంతోషంగా గడిపేవారు. ఏటా సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్కు కార్డుదారులందరికీ ఉచితంగా నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ఏటా క్రమం తప్పకుండా తెదేపా సర్కారు అందించింది.
కందిపప్పూ ఇవ్వని జగన్
ఐదేళ్లలో ప్రజాపంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తం
అనంతపురం (కళ్యాణదుర్గం రోడ్డు), న్యూస్టుడే
తెదేపా ప్రభుత్వ హయాంలో పండగలు వస్తే పేదలంతా పిండివంటకాలతో సంతోషంగా గడిపేవారు. ఏటా సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్కు కార్డుదారులందరికీ ఉచితంగా నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ఏటా క్రమం తప్పకుండా తెదేపా సర్కారు అందించింది. అప్పట్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10,22,627 మంది కార్డుదారులు లబ్ధి పొందారు. సంక్రాంతి, క్రిస్మస్ కానుకలు కింద కందిపప్పు ఆర కిలో, పామాయిల్ ఆర లీటరు, గోధుమపిండి కిలో, శనగలు కిలో, బెల్లం అర కిలో, నెయ్యి 100 ఎంఎల్ చొప్పున పంపిణీ చేశారు. రంజాన్ తోఫా కింద గోధుమపండి 5 కిలోలు, చక్కెర 2 కిలోలు, సేమియాలు కిలో, నెయ్యి 100 ఎంఎల్ చొప్పున అందించారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పండగ కానుకలను ఎత్తేసింది. బహిరంగ మార్కెట్లో నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కొనుగోలు శక్తిలేని పేదలకు పండగలన్నీ దూరం చేశాడు జగన్. మరోవైపు ఐదేళ్లలో ఇతర సరకులు సక్రమంగా పంపిణీ చేసిందిలేదు.
కందిపప్పు ఏదీ?
గతంలో కార్డుదారులకు కిలో చొప్పున రాయితీతో కందిపప్పు పంపిణీ చేశారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వడం లేదు. ఏడాదిలో కనీసం రెండు నెలలు కూడా ఇవ్వడం లేదని కార్డుదారులు గగ్గోలు పెడుతున్నారు. బహిరంగ మార్కెట్లో కందిపప్పు కిలో రూ.160 పైమాటే. సుమారు ఎనిమిది నెలల నుంచి కందిపప్పు సరఫరా ఆపేశారు.
కరోనా కాలం నుంచి కేంద్ర ప్రభుత్వం కార్డుదారులకు ఉచిత బియ్యం పంపిణీ చేస్తోంది. రాష్ట్రం, కేంద్రానికి సంబంధించి నెలకు రెండు కోటాల బియ్యం కార్డుదారులకు పంపిణీ చేశారు. 1-15 వరకు ఒక కోటా, 15-30 తేదీ వరకు రెండో కోటా పంచేవారు. 2020-22 వరకు పంపిణీ చేశారు. తర్వాత రాష్ట్రం కోటా బియ్యం ఎత్తేసింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఉచిత బియ్యం మాత్రమే ఇప్పటికీ ఇస్తున్నారు. సుమారు 15 నెలల నుంచి కేంద్ర ప్రభుత్వ బియ్యం మాత్రమే అందిస్తున్నారు.
లబ్ధిదారులను మోసగిస్తూ..
వైకాపా ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా అందించే నిత్యావసరాలకు కోత విధించింది. నెలకొక సరకు పంపిణీ చేస్తున్నామని లబ్ధిదారులను మోసం చేస్తోంది. తెదేపా హయాంలో బియ్యం, కందిపప్పు, చక్కెర, గోధుమపిండి, పామాయిల్ పంపిణీ చేశారు. ప్రస్తుతం బియ్యం తప్ప ఏవీ ఇవ్వడం లేదు. రాగులు, జొన్నలు, రాగిపిండి, గోధుమపిండి ఇస్తామని చెప్పినా.. పంపిణీ చేయడం లేదు.
ఇంటింటికీ రేషన్ ఉత్తిదే..
మూడేళ్ల కిందట ఇంటింటికీ రేషన్ పేరుతో ఎండీయూ వాహనాలను తీసుకొచ్చారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 806 వాహనాలు ఉన్నాయి. వాటి ద్వారా ప్రతి నెలా 1-15వ తేదీ వరకు ఇంటింటా సరకులు పంపిణీ చేయాలి. ఇలా ఎక్కడా సక్రమంగా సాగడం లేదు. ఎక్కడో ఒకచోట బండి నిలిపేస్తున్నారు. కార్డుదారులు నిరీక్షించాల్సిన పరిస్థితి. కొన్నిచోట్ల డీలర్లు వాహనదారులను బెదరించడంతో వెళ్లిపోయారు. మరికొన్నిచోట్ల వీఆర్వోల వేలిముద్ర వేసి దుకాణాల వద్ద డీలర్లే పంపిణీ చేస్తున్నారు.
ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో కార్డుదారులు 12,39,631
అనంతపురం జిల్లాలో 6,67,268
శ్రీసత్యసాయి జిల్లాలో 5,72,363
సన్నబియ్యం ఇస్తామని మోసం
తాడిమర్రి: రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తామని మోసం చేశారు. ఒక్క నెల కూడా ఆ బియ్యం పంపిణీ చేయక ఇచ్చిన హామీని తుంగలో తొక్కేశారు. కనీసం ఇతర సరకులైనా సక్రమంగా ఇస్తున్నారంటే వాటిలో కూడా పూర్తిగా కోతేశారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యం తప్ప ఏదీ పంపిణీ చేయడం లేదు. ఎండీయూ వాహనాల కోనుగోలు కోసం రూ.1,600 కోట్లు ఖర్చుచేసి వాటిని మూలనపడేసి ప్రజాధనాన్ని వృథా చేశారు.
రాజశేఖర్, పిన్నదరి గ్రామం
కందిపప్పు కొనలేకున్నాం..
మడకశిర: పండగకు కూడా కంది పప్పు లేకుండా చేస్తున్నారు. గత ప్రభుత్వంలో పండగ కానుకలు వచ్చేవి. ప్రస్తుతం ఏమీ ఇవ్వడం లేదు. నా కుమారులు ఇద్దరు ఉపాధి కోసం బెంగళూరుకు వెళ్లి జీవనం సాగిస్తున్నారు. నేను రోజూ కూలి పనికి వెళ్తాను. ప్రభుత్వం అందించే నిత్యావసరాలపైనే ఆధారపడి ఉన్నాను. బయట కందిపప్పు రూ.170 వరకు ఉంది. పొదుపుగా వాడుకుని కంది పప్పు లేకుండానే సాంబారు వండుకుని తింటున్నాం.
లక్ష్మమ్మ, ఆమిదాలగొంది, మడకశిర మండలం
వాహనం వస్తోంది.. సరకులేవీ?
పుట్టపర్తి: వైకాపా వచ్చాక ఇంటి వద్దకే రేషన్ వాహనాలు అన్నారు. వాహనం వస్తోంది.. కానీ, సరకులు మాత్రం లేవు. బియ్యం, జతగా అరకిలో చక్కెర మాత్రమే పంపిణీ చేస్తున్నారు. ఇది నెలకు సరిపోతుందా? గతంలో నిత్యావసర సరకులన్నీ సగం ధరలకే పంపిణీ చేసేవారు. నేడు జేబులకు చిల్లు తప్పడం లేదు. ఆరు నెలలుగా కందిపప్పు ఇవ్వలేదు. నిత్యావసర ధరలు పెరిగి ఆర్థిక ఇబ్బందులతో సతమతవుతున్నాం.
లక్ష్మీదేవి, పుట్టపర్తి
సంక్రాంతి సంతోషంగా చేసుకొనేవాళ్లం
చెన్నేకొత్తపల్లి: కోడలి అకాల మరణంతో ఆమె ముగ్గురు చిన్నారులను చూసుకుంటున్నాను. కుమారుడు చిన్నాచితకా పనులకు వెళ్లి తెచ్చే కూలితో అరకొరగా కడుపునింపుకొనే పరిస్థితి. ఈ పరిస్థితుల్లో సంక్రాంతి పండగ వచ్చిందంటే ఊరంతా ఎంతో సంతోషంగా పండగ జరుపుకొనేవారు. మా ఇంటిలో మాత్రం దిగాలుగా ఉండేవాళ్లం. తెదేపా అధికారంలోకి వచ్చాక చంద్రన్న సంక్రాంతి కానుక ఇవ్వడంతో ఏటా ఇంటిల్లీపాదీ ఆనందంగా పండగ చేసుకునేవాళ్లం. వైకాపా ప్రభుత్వం వచ్చిన తరువాత వాటిని రద్దు చేసి మాలాంటి పేదోళ్ల కడుపులు కొట్టింది.
నీలమ్మ, ఎన్ఎస్ గేట్
కుటుంబ పోషణ భారం
టీకొట్టు నిర్వహిస్తున్న సావిత్రమ్మ
శింగనమల: గార్లదిన్నె ప్రధాన రోడ్డు పక్కన టీకొట్టు నిర్వహిస్తున్న సావిత్రమ్మకు భర్త, ఒక కుమారుడు ఉన్నారు. పదిహేనేళ్లుగా టీకొట్టుపై ఆధారపడ్డారు. భర్త కూలీ పనికి వెళితే ఈమె టీకొట్టుతో కుటుంబపోషణ చేస్తోంది. గతంలో కందిపప్పు, నూనె, చక్కెరతో పాటు గోధుమలు ఇచ్చేవారు. పండగలకు కానుకలు వచ్చేవి. ఈ సరకులు రాకపోడంతో ప్రతి నెలా నిత్యావసర సరకులు కొనలేకపోతున్నామని వాపోతున్నారు. ప్రభుత్వం చౌకదుకాణంలో సరకులు ఇస్తే ఖర్చు కొంత తగ్గుతుందని కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అరాచకం.. నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం
[ 17-05-2024]
జిల్లా పోలీసు అధికారి అమిత్ బర్దార్పై ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు వేసింది. శాఖాపరమైన విచారణకూ ఆదేశించింది. -
నిరీక్షించి.. ఉక్కపోతతో సొమ్మసిల్లి
[ 17-05-2024]
ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో సేవలు పొందేందుకు వస్తున్న రోగుల అవస్థలు అన్నీ ఇన్నీకావు. గతంలో ఉన్న ఓపీ కౌంటర్లను అత్యవసర విభాగం వద్ద ఉన్న ఒక రేకుల షెడ్డులోకి మార్పు చేశారు. -
వస్తోంది ఖరీఫ్ సీజన్.. ఏదీ విత్తన కేటాయింపు?
[ 17-05-2024]
జూన్ ఒకటో తేదీ నుంచి ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతోంది. జిల్లాలో ప్రధాన పంట వేరుసెనగ. ఇప్పటికే వేరుసెనగ కాయలు శుద్ధిచేసి మండల కేంద్రాల్లోని గోదాముల్లో భద్రపరిచి, కావాల్సిన రైతుల పేర్లు నమోదు చేయాల్సి ఉంది. -
విచక్షణారహిత దాడులు అమానుషం: రామకృష్ణ
[ 17-05-2024]
జిల్లా సీపీఐ, ఏఐటీయూసీ నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గురువారం ప్రకటనలో ఖండించారు. -
డీఎస్పీ చైతన్యపై హత్యాయత్నం కేసు పెట్టాలి: తెదేపా
[ 17-05-2024]
తాడిపత్రిలో తెదేపా నాయకులు, కార్యకర్తలపట్ల అత్యంత కిరాతకంగా వ్యవహరించిన డీఎస్పీ చైతన్యపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ డిమాండ్ చేశారు. -
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ఠ భద్రత
[ 17-05-2024]
అనంత జేఎన్టీయూ భవన సముదాయంలో భద్ర పరిచిన ఈవీఎంల స్ట్రాంగ్ రూంలను కలెక్టర్ వినోద్కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. -
వేసవిలో చల్లని సేవ
[ 17-05-2024]
వేసవిలో ఎండలు మండుతున్నాయి. చిన్నారులతో మొదలు పండుటాకుల వరకు వేడికి తట్టుకోలేకపోతున్నారు. -
పేద మహిళలకు జీవనోపాధి కల్పనే లక్ష్యం
[ 17-05-2024]
పేద మహిళలకు జీవనోపాధి కల్పించడమే ప్రధాన లక్ష్యమని నాబార్డు డీజీఎం అనురాధ పేర్కొన్నారు. అనంతపురం గ్రామీణం చంద్రబాబు కొట్టాలలో కార్డు ఆధ్వర్యంలో పేద మహిళలకు.. -
విద్యుత్తు కార్యాలయంలో ఎస్ఈ జన్మదిన వేడుకలు
[ 17-05-2024]
విద్యుత్తుశాఖ ఎస్ఈ సురేంద్ర జన్మదిన వేడుకలను అనంతపురం విద్యుత్తుశాఖ ప్రధాన కార్యాలయం ఎస్ఈ ఛాంబర్లో నిర్వహించడం విమర్శలకు తావిస్తోంది. -
రైల్వే కంట్రోల్ కార్యాలయం.. సేవలు పూజ్యం
[ 17-05-2024]
రైళ్ల రాకపోకలను నియంత్రించడంలో ప్రధాన భూమిక పోషించేది కంట్రోల్ కార్యాలయం. గుంతకల్లు డివిజన్ గుండా వెళ్లే రైళ్లను లోకోపైలెట్లు ఎక్కడ వాటిని ఎక్కడ నిలపాలి అనేది కంట్రోల్ కార్యాలయంలో పనిచేసే కంట్రోలర్లు సూచిస్తారు. -
ఉత్సాహం ఉరకలు.. ప్రోత్సహిస్తే మెరికలు
[ 17-05-2024]
వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేందుకు చిన్నారులు, విద్యార్థులు క్రీడా శిక్షణ శిబిరాలకు వస్తున్నారు. ఆర్డీటీ క్రీడాగ్రామంలో వివిధ క్రీడాంశాలలో జోరుగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. -
అగ్ని ప్రమాదాల నివారణ చర్యలేవీ?
[ 17-05-2024]
సోమందేపల్లి, గోరంట్ల మండలాల పరిధిలోని గుడిపల్లి, పాలసముద్రం నడుమ పారిశ్రామికవాడలో అనేక పరిశ్రమలు ఏర్పాటు అవుతూ రోజురోజుకు విస్తరిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
-
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
-
అంతర్గత నివేదికలతో ఆశల మేడలు.. భాజపా, కాంగ్రెస్ శిబిరాల్లో ఒకే ధీమా
-
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’.. ఆ జన్యువు లోపిస్తే పురుషుల్లో సంతానలేమి
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
-
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ